India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజకీయ చైతన్యానికి మారుపేరైన సింహపురిలో రసవత్తర పోటీ జరుగుతోంది. నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి విజయసాయిరెడ్డి(వైసీపీ), వీపీఆర్(టీడీపీ), రాజు(కాంగ్రెస్) పోటీపడుతున్నారు. నెల్లూరు అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టోతో వీఎస్ఆర్, మాస్టర్ ప్లాన్తో వీపీఆర్, గతంలో చేసిన మంచి పనులతో రాజు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు సింహపురి ప్రజలు ఎవరిని ఢిల్లీకి పంపుతారో చూడాలి మరి.
ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ఈనెల 7న తిరుపతికి రానున్నారు. అదే రోజున చంద్రగిరి నుంచి వారాహి రోడ్ షో, తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటం, తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తుండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలోనే పర్యటన పూర్తి వివరాలు ప్రకటిస్తామని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం 23,532మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్ కుమార్ వెల్లడించారు. నిర్దేశించిన తేదీల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజక వర్గానికి రెండు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
పెన్షన్ నగదు తీసుకునేందుకు బ్యాంక్ల వద్ద వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మంగళగిరి యూనియన్ బ్యాంకు వద్ద పెన్షన్ తీసుకోవడానికి ఎక్కువ సంఖ్యలో ఫించనుదారులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పెన్షన్ దారులకు మధ్య తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో వృద్ధురాలికి గాయాలు అయ్యాయి.
కడపకు ఈనెల 7న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రానున్నట్లు సమాచారం. కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ CM రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ CM డీకే శివకుమార్తో పాటు పలువురు నాయకులు రానున్నట్లు తెలుస్తోంది. కడప మున్సిపల్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో వీరు ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ఈ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఒంగోలు YCP MP అభ్యర్థి MLA చెవిరెడ్డిపై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన సభలో లోకేశ్ మాట్లాడారు. ‘చంద్రగిరిని ఐదేళ్లు దోచుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ.2 వేల కోట్లు సంపాదించారు. ఆయన సినిమా అయిపోవడంతో ప్రకాశం జిల్లాకు పారిపోయారు. శ్రీవారి దర్శన టికెట్లు, గంజాయి, ఎర్రచందనంతో బాగా సంపాదించారు. అందుకే ఆయనకు చెవిలో పువ్వు అని పేరు పెట్టా’ అని లోకేశ్ అన్నారు.
విశాఖలోని పలు ప్రధాన జంక్షన్లో వేసవి తాపానికి గాను గ్రీన్ రూఫ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయడంతో వాహనచోదకులకు కొంత ఉపశమనం లభిస్తోంది. ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇలాంటి గ్రీన్ రూఫ్లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల6న నారా లోకేశ్ విజయనగరం రానున్నారు. ఆరోజు జరిగే యువగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని టీడీపీ నాయకులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు నగరానికి చేరుకొని సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటారు. ఇక్కడ సభ అనంతరం శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఇప్పటికే ఈనియోజకవర్గంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ప్రచారం చేశారు.
జిల్లాలోని 14 నియోజవర్గాల్లో 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుల్లో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే 50,592మంది మహిళా ఓట్లర్లదే పైచేయి. అందులో 11 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు అధికంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. నియోజకవర్గాల వారీగా పాణ్యం 3.32 లక్షల ఓటర్లతో అత్యధికం, 2.08 లక్షల ఓటర్లతో మంత్రాలయం ఓటర్లు అత్యల్పం.
గుంటూరులో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29.0 డిగ్రీలుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా పలువురు వడదెబ్బ తగిలి ఆసుపత్రిలో చేరుతున్నారు. అయితే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.