India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి- మెలియాపుట్టి రోడ్డులోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్న పోలాకి సుందరమ్మ అనే మహిళ శుక్రవారం విద్యుత్ షాక్కు గురై తీవ్రగాయాలయ్యాయి. మండాపోలం కాలనీకి చెందిన సుందరమ్మ మిల్లులో పని చేస్తుండగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంట్ షా్క్ తగిలింది. గమనించిన స్థానికులు మహిళను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పోటీలో ఉన్నారు. గతంలో కలెక్టర్గా పనిచేసిన కొప్పుల రాజు కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉండగా, తిరుపతి ఎంపీ బరిలో వెలగపల్లి వరప్రసాద్, విజయకుమార్ ఉన్నారు. వరప్రసాద్ నాలుగోసారి ఎన్నికల సంగ్రామంలో ఉండగా విజయకుమార్ మొదటి సారి పోటీ చేస్తున్నారు.
కైకలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఆయన హార్ట్ స్ట్రోక్ రాగానే వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ నాగార్జున నగర్లోని ఆయుష్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.
కొండాపురం మండలం వెంకటాపురం వద్ద శుక్రవారం ఉదయం ఇన్నోవా, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముద్దనూరు మండలం తిమ్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివ శంకర్ అనే వ్యక్తి బైకులో తన సొంత గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా ఇన్నోవా కారు వచ్చి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా బైక్లో ప్రయాణిస్తున్న అతని భార్యకు గాయాలవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని సొంత అన్న నారాయణరెడ్డి కట్టెతో దాడి చేసి హత్య చేశాడు. గురువారం రాత్రి అర్ధరాత్రి నిద్రలో ఉన్న రామకృష్ణారెడ్డిపై మద్యం మత్తులో నారాయణరెడ్డి దాడి చేసి చంపాడు. గుంతకల్లు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు సూచించారు. ఆయన కౌన్సిల్ హాలులో ఎన్నికల అధికారులతో మాట్లాడారు. 80 ఏళ్లుపైన ఉండి హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
నంద్యాలలో శుక్రవారం నిర్వహించనున్న యవగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొంటారని నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని రాణి మహారాణి థియేటర్ వెనుకభాగంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన వృద్ధురాలు బండి సత్యవతి (73) గురువారం రాత్రి అనారోగ్య కారణంగా మృతి చెందారు. కుమారుడు బండి నర్సింహులు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చిన వైద్యులు మృతదేహం నుంచి నేత్రాలను సేకరించారు. తాను చనిపోయినా తన కళ్లు వేరొకరికి ఉపయోగపడాలనే గొప్ప ఆశయంతో నేత్రదానం చేసిన కుటుంబ సభ్యుల ఆశయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
ఇవాళ ప్రకాశం జిల్లాకు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రానున్నారు. కూటమి అభ్యర్థులను మద్దతుగా గిద్దలూరులో ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొదిలిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం జగన్ కనిగిరిలో పర్యటించనున్నారు. దీంతో జిల్లాలో పార్టీ అధినేతలు వస్తుండటంతో అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును CM జగన్ కచ్చితంగా అమలు చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పుంగనూరు ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘చంద్రబాబు అధికారంలోకి వస్తే చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు. ఆయన గెలవడు, చట్టం రద్దు చేసేదీ లేదు. పింఛన లబ్ధిదారుల కష్టాలకు చంద్రబాబు బంధువు నిమ్మగడ్డ రమేశే కారణం. ఆయన వాలంటీర్లపై ఫిర్యాదు చేయడంతో ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వడం లేదు’ అన్నారు.
Sorry, no posts matched your criteria.