Andhra Pradesh

News March 22, 2024

కందికుంట వెంకటప్రసాద్‌ను నిర్దోషిగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు

image

కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. వెంకట ప్రసాద్‌పై గతంలో సీబీఐ, హైదరాబాద్ కోర్టు విధించిన ఐదు, ఏడు సంవత్సరాల శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఇవాళ తీర్పు వెల్లడించింది. క్రిమినల్ ఆపిల్ నెంబర్ 454/2016, 1382/2017లను అనుమతిస్తూ క్రింది కోర్టు ఇచ్చిన శిక్షణ హైకోర్టు రద్దు చేసింది.

News March 22, 2024

తిరుపతి: ఆన్‌లైన్‌లో వ్యవసాయ కోర్సులు

image

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ పరిధిలో పుట్టగొడుగుల పెంపకం, సేంద్రియ వ్యవసాయంపై తెలుగు మీడియం ద్వారా ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు angrau.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.

News March 22, 2024

కర్నూలు: ‘రెండు స్థానాలను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తాం’

image

కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కురువలకు కేటాయించడం పట్ల కురువ, వాల్మీకి సంఘ నాయకులు శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా కురువ కులస్థుడైన బస్తిపాటి నాగరాజు.. మంత్రాలయం అసెంబ్లీకి వాల్మీకి కులస్థుడైన రాఘవేంద్రరెడ్డికి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు MP, మంత్రాలయం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామన్నారు.

News March 22, 2024

అమలాపురం ఎంపీ అభ్యర్థిగా హరీశ్.. నేపథ్యం ఇదే

image

టీడీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీశ్ మాధుర్ పోటీ చేయనున్నట్లు అధినేత చంద్రబాబు ప్రకటించారు. హరీశ్ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్లీ ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈయన జీఎంసీ బాలయోగి కుమారుడు.

News March 22, 2024

కురిచేడు: రైటు పట్టాలపై విద్యార్థిని డెడ్ బాడి

image

కురిచేడు మండలం దేకనకొండ గ్రామానికి చెందిన పి. భార్గవి (19) దర్శిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతుంది. గురువారం కాలేజికి బయలుదేరి వెళుతున్నానని చెప్పి వెళ్ళింది. మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించింది. భార్గవి తల్లిదండ్రులకు రైల్వే పోలీసులు సమాచారాన్ని అందించారు. ఇది ఆత్మహత్యనా లేక ప్రమాదమా అనే కారణాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2024

ఒంటిమిట్టలో 25న పౌర్ణమి కళ్యాణం

image

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 25వ తేదీన స్వామివారికి పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో వారు మాట్లాడుతూ.. ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలలో తిరుమల లడ్డూలు స్వామివారి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

News March 22, 2024

కర్నూలు: హత్యాయత్నం కేసులో..ఐదేళ్ల జైలు

image

రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురానికి చెందిన దండు గోపాలకృష్ణ అనే వ్యక్తికి హత్యాయత్నం కేసులో 5ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా కోర్టు విధించినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. 2017లో అదే గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తిపై డబ్బుల విషయంలో హత్యాయత్నానికి పాల్పడడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణ అనంతరం జడ్జి జైలు శిక్ష జరిమాన విధిస్తూ తీర్పనిచ్చారు

News March 22, 2024

అనంత: దోపిడి ముఠాను అరెస్ట్

image

అనంతపురంలోని రిలయన్స్ మార్ట్‌లో దోపిడీ చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపిన మేరకు.. గుజ్జల రుస్యింగులు, రాగిరి శ్రీనివాసులు, గొల్ల చంటి పట్టణంలోని రిలయన్స్ మార్ట్‌తో పాటు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వర్తకుడు ఇంట్లో చోరీ చేయాలని కుట్ర పన్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.

News March 22, 2024

VZM: భార్యపై కత్తితో దాడిచేసిన భర్త

image

భర్త భార్యను హతమార్చిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామానికి చెందిన గంటా ముసలి నాయుడు భార్య అప్పలనరసమ్మపై కత్తితో దాడిచేయగా, ఆమె కడుపులో కత్తి దిగింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. ముసలి నాయుడు పరారిలో ఉండడంతో కేసు నమోదుచేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

News March 22, 2024

చింతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగ్గయ్యపేట వాసి మృతి

image

చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో జగ్గయ్యపేటకు చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించామని చెప్పారు.