India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయనగరం జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో రాత్రి 11 గంటల తర్వాత ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినా, వ్యాపారాలు సాగించినా కేసులు నమోదు చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా కొన్ని ఆంక్షలను కఠినతరం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకూడదని, గుంపులుగా కనిపించవద్దని సూచించారు. SHARE IT..

పంగులూరు మండలంలోని బయట మంజులూరు సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బయట మంజులూరు గ్రామానికి చెందిన సరికొండ నాగరాజు(39) చిలకలూరిపేట వైపు నుంచి బస్సులో వచ్చి, మంజులురు దగ్గర దిగి గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో విజయవాడ వైపు నుంచి వస్తున్న ఇంద్రా బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

మైదుకూరులోని మండల రెవెన్యూ, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాలను శనివారం జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ పరిశీలించారు. కలెక్టర్కు తహశీల్దార్ రాజసింహ నరేంద్ర, కమిషనర్ జబ్బార్ మియా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తహశీల్దార్ కార్యాలయం దూరంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు తెలిపారు. గతంలో మాదిరి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోనే తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.

ఇటీవల వివాహమై.. ఆషాఢ మాసం తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు పెట్టారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన ఉద్ధగిరి వెంకన్నబాబు-రమణి దంపతులు వారి అల్లుడు బాదం రవితేజ, కుమార్తె రత్న కుమారికి శనివారం 100 రకాల పిండి వంటలు స్వయంగా చేసి వడ్డించారు. సాధారణంగా గోదావరి జిల్లాలో అల్లుళ్లకు ఇటువంటి మర్యాద చేయడం ఆనవాయితీగా వస్తుంది.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పార్వతీపురం పట్టణంలోని వెంకంపేట గోరీల వద్ద చోటుచేసుకుంది. అవుట్ పోస్ట్ పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా గాజువాకలోని గణేశ్నగర్కు చెందిన షేక్ రోషన్(26) పార్వతీపురం పట్టణంలో సీలింగ్ పనులు చేస్తున్నాడు. పనులు ముగించుకొని తిరిగి రూమ్కి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు తెలిపారు.

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు, కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిగిలిన జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కానీ అల్లూరి జిల్లాలో ఆ అవకాశం కలెక్టర్కు లభించింది.

నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) ప్రతిజ్ఞను ఈ నెల 12న పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం సంబంధిత అధికారులు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం నివారించేందుకు 2020 ఆగస్టు 15న నషా ముక్త్ భారత్ అభియాన్ అనే సామూహిక అవగాహన కార్యక్రమాన్ని సామాజిక న్యాయం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తామన్నారు.

టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద చోటుచేసుకున్న ఘటనలపై అటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణీ, కుమార్తె హైందవి పరస్పర ఫిర్యాదుల మేరకు శనివారం సాయంత్రం నాటికి టెక్కలి పోలీసులు ఇరువర్గాలపై పలు సెక్షన్ల కింద మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు దువ్వాడ ఇంటి వద్ద మోహరించగా పోలీసులు తదుపరి నిర్ణయంపై స్థానికంగా చర్చ జరుగుతుంది.

ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఇటీవల జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భార్గవ్ తేజ ఎస్పీని శనివారం కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాంతి భద్రతలపై సమష్టిగా పనిచేయాలని ఎస్పీ సూచించారు.

క్రైమ్ రేటు నియంత్రణకై ప్రతీ పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ జిల్లాలోని హిరమండలం, కొత్తూరు, సరుబుజ్జిలి మండల పోలీస్ స్టేషన్లను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో పరిస్థితులు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఇటీవల నమోదైన కేసులు వివరాలను ఆరా తీశారు. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు
Sorry, no posts matched your criteria.