India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమిళనాడు రాష్ట్రానికి ఎక్కువ కాలం CMగా పనిచేసిన వ్యక్తి కరుణానిధి. 13 సార్లు MLAగా ఎన్నికై గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నారు. వారి పూర్వీకులది ఒంగోలు పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామం. వారి ముత్తాత పెళ్లూరు సంస్థానంలో విద్వాంసులుగా పనిచేశారని సమాచారం. కాగా నేడు కరుణానిధి మరణించిన రోజు కావడంతో ఈ విషయాన్ని పలువురు చర్చించుకుంటున్నారు.

భారత ప్రభుత్వం 2015 నుంచి ఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 20 వేల కుటుంబాలు పైగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, మదనపల్లె, వరదయ్యపాలెం, నారాయణవనం, పాలమంగళం, పులిచెర్ల ప్రాంతాల్లో సిల్క్, కంచి పట్టుచీరలు నేస్తుంటారు. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం చేనేత కార్మికులను ప్రోత్సహించింది.

రైల్వేకోడూరు- మైసూరు వారిపల్లి దగ్గర బైక్లో వస్తున్న వ్యక్తి లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుని పేరు కిరణ్ కుమార్ రెడ్డి(23) అని ఇతను కోడూరు నుంచి మాధవరంపోడుకు వళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ని క్లియర్ చేసి కేసు నమోదు చేశారు.

రాయచోటి ప్రాంతీయ వైద్యశాల వైద్యులు కార్పొరేట్ వైద్యానికి తీసిపోని విధంగా అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. ప్రముఖ వైద్య నిపుణులు సీనియర్ సివిల్ సర్జన్ డి లక్మీప్రసాద్ ఆధ్వర్యంలోని, వైద్య బృందం కడుపునొప్పితో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక నిరుపేద రోగి కడుపులోని 12 కణుతులను తొలగించి పేదరోగికి ప్రాణదానం చేశారు.

ఏపీ CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూఖ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ భేటీలో CM చంద్రబాబు తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెసి మయూర్ అశోక్ సూచించారు. బుధవారం పలువురి అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

ఇందుకూరుపేట మండలం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వై కృష్ణ బుధవారం మృతి చెందాడు. ఇటీవల కానిస్టేబుల్ కృష్ణ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదానికి గురై గత పది రోజుల నుంచి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుటుంబానికి తోటి మిత్రులు, సన్నిహితులు, కుటుంబ స్నేహితులు, పోలీస్ శాఖ సిబ్బంది ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఏజెన్సీలోని గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న సీతాఫలాల అమ్మకాలు ప్రస్తుతం పాడేరు మండలంలో జోరందుకున్నాయి. మన్యం అమృత ఫలాలకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది కూడా కాపు ఆశాజనకంగా ఉండడంతో పాడేరు ఘాట్లోని వంట్లమామిడి కేంద్రంగా సీతాఫలాల అమ్మకాలు సాగుతున్నాయి. రెండు బుట్టలను కావిడ రూ. 1000 నుంచి రూ.1500 వరకు రేటు పలుకుతోంది.

అమరావతిలో గత ఐదేళ్లుగా ఏపుగా పెరిగిన ముళ్లపొదలను జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటలతో అమరావతికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. 30 రోజుల్లోగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి కోసం 38 రోజుల్లోనే 34 వేలు ఎకరాలు రైతులు ల్యాండ్ పోలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఐటిఐలో ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్కు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్, జిల్లా ప్రవేశాల కన్వీనర్ ఎల్. సుధాకర్ రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సిలింగ్లో మిగిలిన సీట్ల ప్రవేశాలు కల్పిస్తామని ఆయన వివరించారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు iti.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 26వ తేదీతో గడువు ముగుస్తుందని ఆయన చేప్పారు.
Sorry, no posts matched your criteria.