Andhra Pradesh

News August 4, 2024

గుబ్బల మంగమ్మ భక్తులకు శుభవార్త

image

బుట్టాయిగూడెం మండలం కొరసావారిగూడెం అటవీ ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లీ దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు ఉదయం 7 గంటల లోపు వచ్చి మొక్కులు చెల్లించుకోవచ్చని సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా వంట కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 3 గంటలలోపు తిరుగు ప్రయాణం కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని కోరారు.

News August 4, 2024

సోమిరెడ్డితో డీఎస్పీ ఘట్టమనేని భేటీ

image

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు
శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నెల్లూరులోని వేదాయపాళెం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ శాంతిభద్రతలపై వారు సమీక్షించారు.

News August 4, 2024

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం

image

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు సుమధుర గ్రూప్‌ సీఎండీ మధుసూధన్‌ కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఈ  మేరకు డీడీని తిరుమలలోని గోకులం రెస్ట్‌ హౌస్‌లో టీటీడీ అడిషనల్‌ ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు భరత్ కుమార్,నవీన్‌కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

News August 4, 2024

కడప వారికి స్నేహం అంటే ప్రాణం!

image

కడప అంటే ఫ్యాక్షన్ అని చాలామంది అనుకుంటారు. కానీ మన కడప బంధాలకు, ఆప్యాయతలకు నిలయం. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ప్రతి ఒక్కరిలో భాగమే. ఇక స్కూల్‌‌ ఫ్రెండ్స్‌తో చేసిన చిలిపి పనులు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఎక్కడికెళ్లినా మన వెంట ఒకడు ఉండాల్సిందే. ఫేర్‌వెల్‌ పార్టీలో కన్నీరు పెట్టిన మిత్రులెందరో. అటువంటి మిత్రులు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా.. కామెంట్ చేయండి.
Happy Friendship Day

News August 4, 2024

ప్రకాశం వారికి స్నేహం అంటే ప్రాణం!

image

ప్రకాశం జిల్లా వారు స్నేహం అంటే ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ప్రతి ఒక్కరిలో భాగమే. ఇక స్కూల్‌‌ ఫ్రెండ్స్‌తో చేసిన చిలిపి పనులు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఎక్కడికెళ్లినా మన వెంట ఒకడు ఉండాల్సిందే. ఫేర్‌వెల్‌ పార్టీలో కన్నీరు పెట్టిన మిత్రులెందరో. అటువంటి మిత్రులు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా.. కామెంట్ చేయండి.
Happy Friendship Day

News August 4, 2024

సీతంపేట: గిరిజన విద్యార్థులు టెట్, డీఎస్సీకి ఉచిత శిక్షణ

image

ఐటీడీఏ ఆధ్వర్యంలో టెట్, డీఎస్సీకి అందిస్తున్న ఉచిత శిక్షణను పొందేందుకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ నెల 3 నుంచి 10వ తేదీ లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పరీక్ష ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు.

News August 4, 2024

వచ్చేవారం నుంచి వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియ: డీఈఓ

image

వచ్చేవారం నుంచి ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతుందని డీఈఓ శామ్యూల్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో త్వరలోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్, కార్యదర్శి పర్యటనలు ఉంటాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా నివేదికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు.

News August 4, 2024

‘మేం గోదారోళ్లం.. స్నేహమంటే ప్రాణమిస్తాం’

image

ఉమ్మడి పశ్చిమ గోదారోళ్లు స్నేహమంటే ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విడదీయలేని బంధాలెన్నో. సంతోషంలోనే కాదు ఆపదలోనూ అండగా ఉండే మిత్రులెందరో. ఇక పాఠశాల స్థాయి నుంచి ఉన్న స్నేహాలైతే లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్‌ పార్టీలో కన్నీరుపెట్టిన మిత్రులెందరో కదా. అలాంటి వారి కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ ప్రాణ స్నేహితుడు ఎవరు..?
☞ Happy Friendship Day

News August 4, 2024

‘మేం గోదారోళ్లం.. స్నేహమంటే ప్రాణమిస్తాం’

image

ఉమ్మడి తూర్పు గోదారోళ్లు స్నేహమంటే ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విడదీయలేని బంధాలెన్నో. సంతోషంలోనే కాదు ఆపదలోనూ అండగా ఉండే మిత్రులెందరో. ఇక పాఠశాల స్థాయి నుంచి ఉన్న స్నేహాలైతే లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్‌ పార్టీలో కన్నీరుపెట్టిన మిత్రులెందరో కదా. అలాంటి వారి కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ ప్రాణ స్నేహితుడు ఎవరు..? ☞ Happy Friendship Day

News August 4, 2024

ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ తొలగించబడింది

image

నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే నరసాపురం- నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12787, 12788 ట్రైన్‌లను ఆగస్టు 3 -10 వరకు విజయవాడ మీదుగా కాక రామవరప్పాడు- రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ లేదని, సమీపంలోని రామవరప్పాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామన్నారు.