India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి బీఆర్ ప్రవేశాలకు కన్వీనర్ కడప డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతి విశ్వనాథరెడ్డి తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ఇంటర్ లేదా డిప్లొమా పూర్తి చేసి అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 19లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంతమాగులూరు మండలంలోని పాత మాగులూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై నరసరావుపేట నుంచి ఇంటికి వస్తుండగా ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతడిని స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని క్షతగాత్రుడిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు.

దేవాదాయ శాఖ ఉమ్మడి ప.గో. జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం తణుకులో ఎన్నుకున్నారు. స్థానిక సీతారామాంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా నల్లం రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా జగదీశ్వరరావు, కార్యదర్శిగా శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా నాగేశ్వరరావు, కోశాధికారిగా కుసుమకుమార్, కార్యవర్గ సభ్యులుగా ఎంవీవీఎస్ నందకుమార్, జీవీ రమణ, ఎస్కే నబీ, సాంబశివరావు ఎన్నికయ్యారు.

జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదివారం రెవెన్యూ ఉద్యోగులకు నిర్వహించిన సర్వే ఎగ్జామ్ జరుగుతున్న తీరును పరీక్షా కేంద్రమైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించారు. ఈ పరీక్షకు అన్ని జిల్లాల నుంచి 1093కు గాను 943 మంది రెవెన్యూ ఉద్యోగులు సర్వే ఎగ్జామ్కు హాజరయ్యారైనట్లు అధికారులు తెలిపారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో మతాలను, కులాలను రెచ్చగొడుతూ ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. దీనిని పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. మండల కేంద్రాలలోనూ సంబంధిత అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.

జిల్లాలోని నెల్లూరు, సంగం బ్యారేజీలకు పూర్వపు పేర్లను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వంలో నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజీ అని అప్పటి సీఎం జగన్ నామకరణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాత పేర్లనే కొనసాగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి బండారు శేషన్న అనే వ్యక్తి ఆదివారం గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్సై గంగన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో పుట్టి మునిగిన ప్రాంతాన్ని ఇంజిన్ బోట్లో వెళ్లి పరిశీలించారు. శేషన్న అచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. సాగర్ డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు నాగార్జున సాగర్ డ్యాంకు తరలివచ్చారు. సాగర్ గేట్ల ద్వారా జాలువారే నీటిని వీక్షిస్తున్నారు. శాంతిసిరి, నాగసిరి లాంచీలలో ప్రయాణిస్తూ నాగార్జున కొండ అందాలను చూస్తున్నారు.

ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా సీటు కోల్పోయిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. S.కోట నుంచి గొంప కృష్ణ, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున, నెల్లిమర్ల నుంచి కర్రోతు బంగార్రాజు, బొబ్బిలి నుంచి తెంటు లక్ష్ము నాయుడు పదవులు ఆశిస్తున్నారు. జనసేన, బీజేపీ నుంచి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.