Andhra Pradesh

News March 8, 2025

చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

ఈనెల 8వ తేదీ(శనివారం) చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవును DEO వరలక్ష్మి ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా ఉపాధ్యాయునిలు జరుపుకోవాలని ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

News March 8, 2025

విజయనగరంలో 3వేల మంది మహిళలతో ర్యాలీ: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజీవ్ క్రీడా ప్రాంగణంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ అంబేడ్క‌ర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత హాజరుకానున్నారని వెల్లడించారు. 3వేల మంది మహిళలతో ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 8, 2025

మార్కాపురంలో సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించిన SP

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు నేడు మార్కాపురం రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్, SSG ఆఫీసర్స్ కలిసి మార్కాపురంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్‌ తనిఖీలను శుక్రవారం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ వివరించారు.

News March 8, 2025

కీటక జనిత వ్యాధుల నియంత్రణపై విశాఖలో శిక్షణ

image

విశాఖలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శుక్రవారం కీటక జనిత వ్యాధుల నియంత్రణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వైద్య శాఖ అదనపు సంచాలకులు సుభ్రమన్యేశ్వరి పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రతీ శుక్రవారం డ్రైడే -ఫ్రై డే పాటించాలన్నారు. యాంటీ లార్వా పద్ధతులు ద్వారా దోమల నిర్మూలన చేయాలన్నారు. నీరు నిల్వ లేకుండా, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. DMHO జగదీశ్వరావు ఉన్నారు.

News March 8, 2025

శ్రీకాకుళం: కేసుల దర్యాప్తులో పురోగతి సాధించాలి

image

అపరిష్కృతంగా ఉన్న అదృశ్య (మిస్సింగ్) కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తులో పురోగతి సాధించాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి జామ్ మీటింగ్ నిర్వహించారు. వర్చువల్ గా డీఎస్పీ, సీఐ, ఎస్సైలు హాజరయ్యారు. మిస్సింగ్, రోడ్డు ప్రమాదాల కేసులు దర్యాప్తు, విచారణ, హిట్ అండ్ రన్ కేసుల దర్యాప్తు గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

News March 8, 2025

రాజమండ్రి: ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచాలి

image

ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని అప్పుడే పర్యావరణ పరిరక్షణ లక్ష్యం సాధ్యం అవుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో వ్యవసాయ, హార్టికల్చర్ క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, సిబ్బందికి సూచించారు. 

News March 8, 2025

10 రోజుల్లోపు చార్జిషీట్ వేయాలి: అనంత కలెక్టర్

image

ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించిన కేసులపై 10 రోజుల్లోపు చార్జిషీట్ వేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సాధారణ ఎన్నికలు- 2024 అనంతరం జరిగిన హింసపై సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ పి. జగదీశ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస చాలా సున్నితమైన అంశమన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News March 8, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక పునః ప్రారంభం: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి 04/3/25 మంగళవారం ముగియటంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పున ప్రారంభిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. 10/3/25 సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10 గం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా శుక్రవారం తెలియజేశారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించ వలసిందిగా కోరారు.

News March 8, 2025

కృష్ణా: మెగా DSC పరీక్షలకు ఆన్‌లైన్‌లో శిక్షణ

image

మెగా DSC రిక్రూట్మెంట్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు మచిలీపట్నంలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 8, 2025

నేడు కస్తూర్బా కళాక్షేత్రంలో మహిళా దినోత్సవం: కలెక్టర్

image

శనివారం నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళలను, పొదుపు సంఘాల మహిళలను సత్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, వివిధ పథకాల కింద ఆస్తుల పంపిణీ, ప్రొసీడింగ్స్ అందజేస్తామన్నారు.