India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జీవీఎంసీ స్థాయిా సంఘం ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు నిలిచినట్లు అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామన్నారు.

ఏలూరు జిల్లా దెందులూరు-అలుగులగూడెం మధ్య రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని 30 ఏళ్ల వయసు గల వ్యక్తిని ట్రైన్ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

AP బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ తిరుపతి వారి వివరాల మేరకు శనివారం సాయంత్రం బులియన్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10gm బంగారం ధర రూ.72160, 22 క్యారెట్ల 1gm బంగారం ధర రూ.6674గా ఉంది. ఒక సవరం బంగారం (8gm) ధర రూ.53392లుగా ఉంది. వెండి 1కిలో రూ.85,000, రిటైల్ ధర 1gm రూ.87.00గా ఉంది.

రాజంపేట టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఏర్పాటుచేసిన బ్యానర్లను అదే రోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఒంటిమిట్ట ఎస్సై మధుసూదన్ రావుని వివరణ కోరగా పిర్యాదు అందలేదని తెలిపారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లాలో కొత్తగా 39 లెప్రసీ (కుష్టు) వ్యాధి కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కరరావు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జులై 18 నుంచి 15 రోజుల పాటు కుష్ఠ వ్యాధిపై ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 16,96,837 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందులో 5,106 అనుమానిత కేసులు గుర్తించామన్నారు. వీరి అందరికీ కూడా పరీక్షలు నిర్వహించనున్నామన్నారు.

గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ఆటో డ్రైవర్ శివకృష్ణ(26) మామిడి చెట్టుకి ఉరివేసుకొని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పర్చూరు ప్రాంతానికి చెందిన శివకృష్ణ చేబ్రోలులో ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతను అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

మీ సేవ సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతూ శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీసేవ నిర్వాహకుల సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తెచ్చి మీ సేవను రోడ్డున పడవేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మీ సేవపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

దేశభక్తి భావన ఉట్టిపడేలా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వేడుకలను మొక్కుబడిగా కాకుండా దేశ, రాష్ట్ర, జిల్లా సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకం ద్వారా పశువులకు, జీవాలకు షెడ్లు నిర్మించుకునే వారికి గోకులం పథకం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలను కునేవారు జాబ్ కార్డుతో ఉపాధి హామీ కార్యాలయంలో లేదా స్థానిక గోపాలమిత్రలు, పశువైద్య సహాయకులను సంప్రదించాలని కోరారు. ఈ పథకంలో షెడ్ నిర్మాణ వ్యయంలో పశుపోషకులకు 90%, జీవాలు, కోళ్లు పెంచేవారికి 70% రాయితీ ఇస్తామన్నారు.

కోసువారిపల్లిలో ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ రోజు జరిగిన ఈ ఘటనపై తంబళ్లపల్లె SI శివకుమార్ ప్రకారం.. చరణ్, నందినిల కుమార్తె రూప(2) ఇంటి ముందు ఆడుకుంటుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని కుటుంబీకులు మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందినట్లు వైద్యులు తెలిపారు. చరణ్ దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.