India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నీళ్ల ట్యాంకర్ బోల్తాపడి యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు రాముడు తన కుమారుడు సోమశేఖర్తో కలిసి చీనిచెట్లకు నీళ్లు తెచ్చేందుకు నీళ్ల ట్యాంకర్ తీసుకెళ్లారు. ఈ క్రమంలో కమలాపురం వద్ద ప్రమాదవశశాత్తు ట్యాంకర్ బోల్తాపడి సోమశేఖర్ మృతిచెందగా.. తండ్రి రాముడికి తీవ్రగాయాలయ్యాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలకు నిర్వహించనున్న క్రికెట్ శిక్షణ శిబిరాలకు జిల్లాకు చెందిన పలువురిని శిక్షకులుగా ఎంపిక చేశారు. జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధుసూదన్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చెందిన బొమ్మన్న సీనియర్ మహిళా జట్టుకు నైపుణ్య శిబిరానికి టైనర్గా నియమించారు. శర్మాస్వలిని జూనియర్ మహిళా జట్టుకు మొదటి బ్యాచ్ శిక్షకుడిగా, రెండో బ్యాచ్ శిక్షకుడిగా K.నరేశ్ను నియమించారు.
మంగళగిరికి చెందిన ఇద్దరు యువకులు స్నేహితులతో పాటు బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్ర తీరానికి బుధవారం విహారయాత్రకు వచ్చారు. వీరు సముద్రంలో మునుగుతూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలల తాకిడికి ఇద్దరు సముద్రంలోకి వెళ్లిపోయారు. నీటిలో కొట్టుకుపోతున్న వీరిని అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు వెంటనే అప్రమత్తమై రక్షించి ఒడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారు.
నెల్లూరు జిల్లా రాజకీయాలు విమానాశ్రయం చుట్టే తిరుగుతున్నాయి. జిల్లా కోసమే ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఇదే విషయాన్ని కీలకంగా ప్రస్తావించారు. తాజాగా నిన్న వీఆర్సీ మైదానంలో జరిగిన యువగళం సభలో నారా లోకేశ్ ఎయిర్ పోర్టుపై కీలక హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే విమానాశ్రయం తీసుకు వస్తామని చెప్పారు. మరి నాయకుల హామీలపై మీ కామెంట్.
ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న పోలింగ్ సందర్భంగా దుకాణాలు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులకు ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు జిల్లా సహాయ కార్మిక కమీషనర్ టి. నాగలక్ష్మి బుధవారం తెలిపారు. కార్మికులు వేతనాల్లో ఈ సెలవుకు సంబంధించి ఎటువంటి తగ్గింపు చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు జరిమానాతో కూడిన శిక్షార్హులుగా భావించడం జరుగుతుందని తెలిపారు.
పోలీసు స్టేషన్లోని నగదును హోంగార్డు స్వాహాచేసిన ఘటన ఆదోనిలో జరిగింది. DSP శివనారయణస్వామి వివరాలు..టూ టౌన్ PSలో మనోజ్ హోంగార్డుగా పనిచేస్తున్నారు. PSలో విలువైన వస్తువులు భద్రపరిచే గది, బీరువా తాళాలు నకిలీవి తయారు చేయించాడు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన రూ.5,53,605 నగదును చోరీచేశాడు. కొద్ది రోజులకు విషయం బయటపడడంతో.. ఆ చోరీ తానే చేశానని మనోజ్ ఒప్పుకున్నాడు. అరెస్ట్చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.
చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృత్యువాత పడిన విషాద ఘటన బుధవారం సాయంత్రం పెదకూరపాడు మండలం రామాపురంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సందీప్(10), అభినయ్(12) ఇద్దరు కలిసి వేసవి సెలవులు కావడంతో గ్రామ శివారు పోలేరమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఉన్న ఊర చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగి ఈత రాక మునిగి చనిపోయారు.
కడప జిల్లాలో ఎండ వేడితో పాటు రాజకీయ వేడి ఉండనుంది. కడప, రాయచోటిలో TDP అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తుండగా.. ఏపీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల జమ్మలమడుగులో పర్యటించనున్నారు. ఇద్దరు కూడా కడప జిల్లాపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇవాళ వీరిద్దరూ కడప జిల్లాకు ఎటువంటి హామీలు ఇస్తారు. అదే విధంగా వీరిద్దరూ పర్యటించిన ప్రతి చోట ఆనియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు.
విజయవాడలో వైద్యుని కుంటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇంట్లో ఉన్న రూ.16 లక్షలు, 300గ్రా. బంగారాన్ని శ్రీనివాస్ కారులో పెట్టాడు. కారు తాళాన్ని ఎదురింటి గేటు బాక్సులో పెట్టి అన్నయ్య వస్తే తాళం ఇవ్వాలని చెప్పాడు. ఉదయం పనిమనిషి వచ్చి చూడగా శ్రీనివాస్ పోర్టికోలో ఉరేసుకొని ఉన్నాడు. అనంతరం బాక్స్లో కారుతాళం చూడగా కాగితానికి తాళం అన్నకు ఇవ్వాలని ఫోన్ నంబర్ రాసి ఉంది.
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. వీరికి తోడుగా పార్టీ అధినేతలు జిల్లాకు క్యూ కట్టారు. ఏప్రిల్ 28, 30న జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. శుక్రవారం కనిగిరిలో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో పాల్గొననున్నారు. అదే రోజు పొదిలిలో చంద్రబాబు నాయుడు, గిద్దలూరులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఒకే రోజు జిల్లాలో పర్యటిస్తున్న తరుణంలో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది.
Sorry, no posts matched your criteria.