Andhra Pradesh

News May 1, 2024

డుంబ్రిగుడలో దారుణ హత్య

image

డుంబ్రిగుడలో దారుణ హత్య జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయంలో ప్లాస్టిక్ వినియోగ పరికరాలు సేకరించే  ఓ వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. అరకు సీఐ రుద్రశేఖర్, స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడు ఎస్.కోట మండలం రాజిపేట గ్రామానికి చెందిన బత్తిన శివ శ్రీనివాస్‌గా గుర్తింమన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

విజయవాడలో జ్యోతి సురేఖకు ఘన సన్మానం

image

విజయవాడకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఏప్రిల్ 23 నుంచి 28వ తేదీ వరకు చైనాలోని షాంఘైలో జరిగిన ప్రపంచ ఆర్చరీ పోటీలలో వ్యక్తిగత, జట్టు, మిక్స్డ్ విభాగాలలో 3 బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం శాప్ కార్యాలయంలో రాష్ట్ర క్రీడల ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న పుష్పగుచ్చమిచ్చి శాలువా కప్పి సత్కరించారు. ఆయన సురేఖ విజయం దేశానికే గర్వకారణం అని అన్నారు.

News May 1, 2024

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

image

పోక్సో కేసులో రామభద్రపురం మండలంలోని కోటశిర్లాం గ్రామానికి చెందిన నిందితుడు గర్బాపు వినయ్ కుమార్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. బొబ్బిలి రూరల్ సీఐ తిరుమలరావు మాట్లాడుతూ.. 2020లో బాలికను మోసం చేశాడన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. నేరం రుజువు కావడంతో జడ్జి నాగమణి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.

News May 1, 2024

కృష్ణా జిల్లాలో రేపటి నుంచి హోమ్ ఓటింగ్ 

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందు కోసం జిల్లాలో 35 బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. 85సం పైబడిన వారు, 40% పైబడి అంగవైకల్యం కలిగి హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు ఈ బృందాలు వెళ్లి ఓటు వేయించనున్నాయి. ఒక్కో బృందంలో ఒక PO, APO, వీడియో గ్రాఫర్ ఉంటారు. 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ జరగనుందని తెలిపారు.  

News May 1, 2024

నెల్లూరు ఎంపీగా ఎవరు గెలుస్తారో

image

నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 18సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో బెజవాడ రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 12సార్లు గెలవగా.. TDP 3సార్లు, YCP 2 సార్లు గెలిచింది. ప్రస్తుతం TDP తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, YCP నుంచి వి.విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కొప్పుల రాజు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి

News May 1, 2024

మార్కాపురం: రథోత్సవంలో అపశ్రుతి

image

మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు పాడుబడిన భవనంపై భక్తులు నిలబడి ఉండడంతో భవనం ముందు భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి: అమిత్ కుమార్

image

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీల వ్యవహరించాలని పార్లమెంటరీ ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఖర్చులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈనెల 6, 10వ తేదీలలో అభ్యర్థులు ఖర్చు చేసిన వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేస్తామన్నారు.

News May 1, 2024

కోవూరు: దుస్తులు ఇస్త్రీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి

image

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపురెడ్డి కిరణ్ రెడ్డి దుస్తులను ఇస్త్రీ చేశారు. బుధవారం ఆయన ఇందుకూరుపేటలో ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు.

News May 1, 2024

చౌడేపల్లి: ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

image

ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు కథనం ప్రకారం.. తిరుపతికి చెందిన రమేశ్(40) గంగజాతర సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చాడు. అనంతరం బోయకొండ రోడ్డులో ఉన్న సిద్ధప్ప బావి వద్ద ఈతకు వెళ్లినట్లు మృతి చెందాడు. సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని గుర్తించి వెలికితీశామని అన్నారు.

News May 1, 2024

కలెక్టరేట్లో ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ: ఢిల్లీ రావ్

image

విజయవాడ కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ ఎన్నికల పర్యవేక్షకులు రాజ్ పాల్, నరేందర్ సింగ్‌తో కలిసి ఈవీఎంల రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి ర్యాండమైజేషన్‌లో ఈవీఎంలను నియోజకవర్గాలకు కేటాయించగా, 2వ ర్యాండమైజేషన్‌లో ఈవీఎంలను ఆన్లైన్లో ద్వారా పోలింగ్ స్టేషన్లకు అనుసంధానించాలని తెలిపారు.