Andhra Pradesh

News July 28, 2024

తాడేపల్లిగూడెం: కారు బీభత్సం.. మహిళ మృతి

image

తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్లలో ఆదివారం కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు రోడ్డుపక్కనే ఉన్న నివాసాలపైకి దూసుకుపోయి పంటబోదిలో చెట్టును ఢీకొని బోల్తా కొట్టింది. కారులో ఉన్న ఓ మహిళ మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
☛ తెల్లవారుజామున కాకినాడలో జరిగిన యాక్సిడెంట్‌లో భీమవరానికి చెందిన ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే.

News July 28, 2024

కర్నూలు: ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఆగస్టు 1న ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని శనివారం రాష్ట్ర సెర్ఫ్ సీఈవో నుంచి జిల్లా డీఆర్డీఏ-వైకేపీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. మొదటి రోజు 99 శాతం చేయాలని, రెండు రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. జిల్లాలో మొత్తం 2,43,337 మందికి రూ.103.54 కోట్లు పంపిణీ చేయనున్నారు.

News July 28, 2024

నిఫా వైరస్.. కాకినాడలో ప్రత్యేక వార్డ్

image

కేరళలో నిఫా వైరస్‌ జాడలు వెలుగు చూడటంతో కాకినాడ జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కాకినాడ GGHలో నిఫా వైరస్‌ ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. ఈఎన్‌టీ వార్డు భవనంలో 6 బెడ్‌లతో వార్డు సిద్ధం చేశారు. అనస్థీషియా, మైక్రోబయాలజీ, మెడిసిన్, ఫల్మనాలజీ తదితర విభాగాలకు చెందిన వైద్యనిపుణులతో కమిటీని నియమించారు. మందులు, ఇతర వైద్య పరికరాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

News July 28, 2024

కడప: వర్షాలు లేక జలాశయాలు ఖాళీ

image

కడప జిల్లాలో ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో జలాశయాలు వెలవెలబోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 11 జలాశయాలు ఉండగా వాటిల్లో కనీసం 50% నీటి సామర్థ్యం కూడా లేదని అధికారులు చెబుతున్నారు. సగిలేరు, బుగ్గ వంక జలాశయాలయితే పూర్తిగా ఖాళీ అయినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జలాలను తరలించి జలశయాలను నీటితో నింపాలని రైతులు కోరారు.

News July 28, 2024

సంతమాగులూరు: అనుమానాస్పద రీతిలో ఒకరు మృతి

image

సంతమాగులూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో వంట మనిషిగా చేస్తున్న మొగులమ్మ, శావల్యాపురానికి చెందిన శ్రీనివాసరావు సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి మొగులమ్మ ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు తెల్లవారిజామున చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News July 28, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా మచిలీపట్నం, భీమవరం నుంచి విజయవాడ వచ్చే పలు రైళ్లు జులై 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మచిలీపట్నం, భీమవరం వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి. 

News July 28, 2024

వేటపాలెం: బాలికతో అసభ్య ప్రవర్తన.. పొక్సో కేసు నమోదు

image

మూడో తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు వేటపాలెం పోలీసులు తెలిపారు. రామన్నపేటకు చెందిన దేమన నీలకంఠ అయ్యప్ప కుమార్ అనే వ్యక్తి శనివారం బాలిక ఇంటి సమీపంలోని పాఠశాల వద్ద బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపినట్లు ఎస్సై సురేశ్ చెప్పారు.

News July 28, 2024

మంగళగిరి: ANUలో రేపు ఐసెట్ కౌన్సెలింగ్

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఎంబీఏ జనరల్, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు నిర్వహించిన ఐసెట్‌లో అర్హత సాధించిన వారికి సోమవారం కౌన్సెలింగ్ ఏర్పాటుచేశామని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు.  ఎంబీఏలో 10, ఎంసీఏలో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ANU ఐసెట్‌లో అర్హత సాధించిన వాళ్లంతా రేపు ఉదయం పీజీ ప్రవేశాల విభాగానికి రావాలని చెప్పారు. 

News July 28, 2024

పెద్దాపురం: నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

పెద్దాపురం జవహార్ నవోదయ విద్యాలయం (2025-2026)లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పెద్దాపురం విద్యాలయ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ రామకృష్ణయ్య తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని 43 మండలాల నుంచి ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు అర్హులన్నారు. సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2025 జనవరి 18న పరీక్ష జరుగుతాయన్నారు.

News July 28, 2024

మెము రైళ్లు రద్దు

image

విజయవాడ, బిట్రగుంట మధ్య ప్రయాణించే మెము రైళ్లను ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు నం.07978 విజయవాడ-బిట్రగుంట, నం.07977 బిట్రగుంట-విజయవాడ రైలును జులై 29 నుంచి ఆగస్టు 4 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.