India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని MBA 2023 2024 మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ఆగస్టు 1 గురువారం నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ మంగళవారం తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలు 10 గంటల నుంచి 12 వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు 2 గంటల నుంచి 5 గంటలకు వరకు జరుగుతాయని అన్నారు. పరీక్షా కేంద్రానికి అర గంట ముందే చేరుకోవాలని తెలిపారు.

శ్రీశైలం డ్యామ్కు కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో శ్రీశైలం పోలీసులు అప్రమత్తమయ్యారు. జలాశయం బ్యాక్ వాటర్లో పడవలు నడపొద్దు అంటూ ఏపీ టూరిజం మేనేజర్కు, స్థానిక మత్స్యకార బోట్ ఆపరేటర్లకు శ్రీశైలం సీఐ ప్రసాదరావు నోటీసులు అందజేశారు. వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోందని, సందర్శకుల శ్రేయస్సు దృష్ట్యా నోటీసులు జారీ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పన్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంసీఏ రెండో సెమిస్టర్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ రెండో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మంగళవారం తెలిపారు. పరీక్షల టైం టేబుల్ను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సమీక్షలో ఐటీడీఏలు బలోపేతం, ఫీడర్ అంబులెన్సులు పునరుద్ధరణ, గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

రాయచోటి మండలం గ్రామ సచివాలయం మహిళా VRO వేధింపులకు గురవుతోంది. వివరాల్లోకి వెళితే.. చెన్నముక్కపల్లికి చెందిన చవాకుల రాజేశ్ వేధిస్తున్నాడని మహిళా వీఆర్వో ఆరోపిస్తోంది. సచివాలయానికి రావడంలేదంటూ తాను చెప్పినట్లు వినాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను అనుసరిస్తూ అమె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మహిళా వీఆర్వో ఆరోపిస్తోంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మను ముద్రించుకొని, రూ.15 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. పొలాల సరిహద్దు రాళ్లపై కూడా తన బొమ్మ కోసం రూ.700 కోట్లు వృథా చేశారని.. ఈ సొమ్ముతో రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేదని తెలిపారు. గతంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తే నియంత పాలనకు అద్దం పడుతుందని మండిపడ్డారు.

ఆర్టీసీలో విజయనగరం జోన్ పరిధిలో అప్రెంటిషిప్ చేయడానికి ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆగస్టు ఒకటి నుంచి 16 తేదీ వరకు తమ పేర్లను www.apprenticeshipindia.gov.in సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లా పరిధిలో వివిధ ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

శ్రీకాకుళం టూ టౌన్ కానిస్టేబుల్ మాధవ్ మంగళవారం మృతిచెందారు. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడ ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం మృతిచెందారు. జిల్లాలోని పలువురు పోలీసులు ఆయనకు సంతాపం తెలిపారు. కాగా, రణస్థలం మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎం.సతీశ్ కూడా అనారోగ్యంతో ఈరోజు వేకువజామున మృతిచెందారు.

నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య 87కి చేరిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశంలోనే అతి పెద్దదైన శ్రీశైలం- నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్ట్లో 2014 సంవత్సరంలో పెద్ద పులుల సంఖ్య 48గా ఉండగా.. 2022కు ఆ సంఖ్య 62కు చేరిందన్నారు. ప్రస్తుతం ఆ పెద్ద పులుల సంఖ్య 87. అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకై 800 మంది చెంచు గిరిజనులు పనిచేస్తున్నారని DFO విఘ్నేశ్ అప్పావ్ తెలిపారు.

తల్లి మందలించిందనే కారణంతో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ పోలీస్ ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమై బాలికను రెండు గంటల్లోపే కనిపెట్టి డీసీపీ హరికృష్ణ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.
Sorry, no posts matched your criteria.