Andhra Pradesh

News May 1, 2024

ఓటర్ స్లిప్‌లను 4 రోజులలోపు పంపిణీ చేయాలి : కర్నూలు జిల్లా

image

ఓటర్ స్లిప్‌లను 4 రోజులలోపు పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత అధికారులను టెలీ కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. మంగళవారం ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు, ఈవిఎమ్ కమిషనింగ్, పెన్షన్ పంపిణీ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News May 1, 2024

ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు: సత్యసాయి కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పోలీస్ అబ్జర్వర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా నియమించిన పోలీస్ అబ్జర్వర్‌కు చెందిన 9502846080 ఫోన్ నంబర్‌కు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.

News May 1, 2024

ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎంపీ అవినాశ్‌రెడ్డి

image

మే 13 జరిగే ఓటింగ్ విషయంలో ఏ చిన్న పొరపాటు చేయవద్దని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం స్థానిక భావసార క్షత్రియులు (రంగరాజులు), ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అజెండా ప్రజా సంక్షేమమే అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం నేడు పెత్తందారులతో పోరాడుతున్నాడని తెలిపారు.

News May 1, 2024

నెల్లూరు జిల్లాలో 982 మంది రౌడీ షీటర్లపై బైండోవర్

image

నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు 115 మంది, పార్లమెంటుకు 14 మంది పోటీ పడుతున్నారని కలెక్టర్ ఎం .హరి నారాయణన్ తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ ఆఫీజ్ మాట్లాడుతూ. జిల్లాలో 982 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు. శాంతి భద్రతలపై దృష్టి పెడుతామన్నారు.

News May 1, 2024

కృష్ణా : రాజకీయ బల్క్ మెసేజ్‌లపై కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలింగ్‌కు 72 గంటల ముందు రాజకీయ ప్రచార బల్క్ SMSలు, వాయిస్ మెసేజ్‌లు నిలుపు చేయాలని కలెక్టర్ DK బాలాజీ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో వివిధ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మే 10 సాయంత్రం 5గంటల నుంచి ఎటువంటి బల్క్ మెసేజ్లు పంపరాదన్నారు. అంతకముందు పంపే వాటికి MCMC అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

News May 1, 2024

విశాఖ: ‘మే 5 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్’

image

ఎన్నికల విధుల్లో భాగమయ్యే అధికారులు, సిబ్బందికి మే నెల 5 ,6, 7 తేదీల్లో ఏయూలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 7, 8 తేదీల్లో పోలీసు, రవాణా ఇతర అత్యవసర సేవల విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు. మొత్తం 11,221 మంది దరఖాస్తు చేసుకున్నారని సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

News May 1, 2024

ఎన్నికలు శాంతి యుతంగా నిర్వహించాలి: మన్యం ఎస్పీ

image

సాధారణ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం పార్వతీపురంలో మన్యం జిల్లా డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాలు, వ్యక్తులపై నిరంతర నిఘా ఉండాలని, ఎన్నికల నిబంధనలు ప్రకారం పని చేయాలన్నారు. అనంతరం మార్చి నెల సంబంధించిన నేర సమీక్ష చేపట్టారు.

News May 1, 2024

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

ప్రకాశం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకొల్లులో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.

News April 30, 2024

విశాఖ: ఆలస్యంగా బయలుదేరనున్న వారణాసి రైలు

image

బుధవారం విశాఖ నుంచి వారణాసికి వెళ్లనున్న రైలు 2గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
విశాఖపట్నంలో బుధవారం ఉదయం 4.20 గంటలకు బయలుదేరవలసిన విశాఖ- బనారస్ రైలు లింక్ రైలు ఆలస్యం కారణంగా ఉదయం 6.20 గంటలకు విశాఖలో బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. దీనిని గమనించి ప్రయాణికులు తమ ప్రయాణంలో మార్పులు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

News April 30, 2024

ప్రకాశం: వైద్యశాఖలో డిప్యూటేషన్లు రద్దు

image

వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న సూపరింటెండెంట్ తోపాటు పలువురు ఉద్యోగులు వారి మాతృశాఖకు తిరిగి వెళ్లారు. కొన్నేళ్ల నుంచి పలువురు ఉద్యోగులు వైద్యశాఖ అనుబంధ శాఖల్లో పనిచేస్తూ డిప్యూటేషన్ పై వైద్య ఆరోగ్యశాఖకు వచ్చారు. వైద్యశాఖ సూపరింటెండెంట్ పయ్యావుల శ్రీనివాసరావుతో పాటు మరో ఐదుగురు ఉద్యోగులు మంగళవారం రిలీవ్ అయ్యి మాతృశాఖకు వెళ్లారు.