Andhra Pradesh

News March 8, 2025

విశాఖ జూలో రేపు మహిళా జీవవైవిధ్య నడక

image

విశాఖ జంతు ప్రదర్శనశాలలో శనివారం మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా జీవవైవిధ్య నడక ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల నిర్వహించనున్నట్లు జూ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు అధికారులను సంప్రదించాలని కోరారు.

News March 8, 2025

విశాఖ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు: డీఈవో 

image

విశాఖ జిల్లాలో పాఠశాలలకు రేపు (రెండో శనివారం) సెలవు యథావిధిగా కొనసాగుతుందని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యా సంవత్సరంలో నిర్దిష్టంగా 220 రోజులు పాఠశాలలు తెరవాల్సి ఉండడంతో తొలుత సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని సెలవు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

News March 7, 2025

జన ఔషది కేంద్రాన్ని సందర్శించిన విశాఖ ఎంపీ

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మధురవాడలో జన ఔషది దివస్ కేంద్రం వద్ద జనరిక్ మందుల వాడకంపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొని జనరిక్ మందుల గూర్చి అన్ని విషయాలను ప్రజలకు అవగాహన కలుగజేసే గోడపత్రికను ఆవిష్కరించారు. జన ఔషది కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో ప్రారంభించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు. DMHO జగదీశ్వరరావు ఉన్నారు.

News March 7, 2025

చిత్తూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్యాంశాలు

image

☛ చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు
☛ పలమనేరు: 9న రైతు బజార్ ప్రారంభోత్సవం
☛ జిల్లా స్థాయిలో సత్తా చాటిన వెదురుకుప్పం విద్యార్థినులు
☛ పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
☛ పుంగనూరు: అప్పు అడిగినందుకు వ్యక్తిపై దాడి
☛ కాణిపాకం హుండీకి రూ.1.40కోట్ల ఆదాయం

News March 7, 2025

శనివారం విద్యాసంస్థలకు సెలవు: నెల్లూరు DEO

image

నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు శనివారం సెలవు దినంగా ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు తెలిపారు. శుక్రవారం రాత్రి జిల్లా శాఖ అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తొలుత శనివారం వర్కింగ్ డేగా తొలుత ప్రకటించారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా వారి మనోభావాలను గౌరవించి సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.

News March 7, 2025

విశాఖ మహిళలను సత్కరించనున్న మంత్రి

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని సిరిపురంలోని చిల్డ్రన్స్ ఏరీనాలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరుకానున్నారు.‌ ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ రంగాలలో ప్రతిభ చూపిన మహిళలను సత్కరిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు పోటీలు నిర్వహిస్తామన్నారు.

News March 7, 2025

తాడేపల్లి: టాటా పవర్‌తో నారా లోకేశ్ ఒప్పందం

image

టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాలను అన్వేషణకు ఏపీ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టాటా రెన్యువబుల్ ఎనర్జీ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.

News March 7, 2025

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 21 లోక్ అదాలత్ బెంచీలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. రెండు జిల్లాల్లో మొత్తం 21 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద బీమా, బ్యాంకు చెక్ బౌన్స్, ప్రాంసరీ, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్, ల్యాండ్, తదితర కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

News March 7, 2025

గుడివాడ: ’41ఏ నోటీసులు ఎవరికి ఇవ్వలేదు’

image

మాజీ మంత్రి కొడాలి నాని మిత్రులు, వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్‌లకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని 1టౌన్ సీఐ శ్రీనివాస్, 2టౌన్ సీఐ దుర్గాప్రసాద్‌లు తెలిపారు. 2024లో వాలంటీర్లు, ఆటోనగర్‌లోని లిక్కర్ గోడౌన్ విషయంలో నమోదైన కేసులలో కొడాలి, దుక్కిపాటి, పాలడుగు, గొర్ల శీను తదితరులపై నమోదైన కేసులో పలువురికి 41ఏ నోటీసులు అందజేశారన్న వార్తలను సీఐలు ఖండించారు. 

News March 7, 2025

విశాఖలో 12 మందితో సైబర్ టీం 

image

సైబర్ నేరాలను అరికట్టేందుకు విశాఖ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని సైబర్ నేరాలు నివారించేందుకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీ కొత్తగా టీం ఏర్పాటు చేశారు. కంప్యూటర్ నైపుణ్యం ఉన్న 12 మందిని ఎంపిక చేసి బి-కేటగిరిలో హోంగార్డు నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. వీరందరి సహకారంతో సైబర్ నేరాలపై అవగాహన, నియంత్రణ చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో డీసీపీ ఇతర అధికారులు పాల్గొన్నారు.