Andhra Pradesh

News July 24, 2024

ప.గో: ముద్రా రుణాల పెంపు.. కలలు సాకారమయ్యేనా?

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 425 పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో దాదాపు 100 పరిశ్రమల వరకు మూతపడ్డాయి. ఇలాంటి క్రమంలో కేంద్రం చిన్న పరిశ్రమలను ఆదుకునేలా బడ్జెట్ ప్రవేశపెట్టడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముద్రా రుణాల పరిమితి రూ.10 లక్షలు ఉండగా ఈ బడ్జెట్‌లో రూ.20 లక్షలకు పెంచారు. ఈ ముద్రా లోన్ ద్వారా యువత కలలు సాకారం కానున్నాయి. అర్హులు రుణం పొందేలా బ్యాంకుల్లో ఆంక్షలను సడలించారు.

News July 24, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో పల్లెల అభివృద్ధికి బాసట

image

కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించడం హర్షనీయం. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 385 వంతున, తూ.గో జిల్లాలో 300 పంచాయతీలు ఉన్నాయి. సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా వినియోగించాలి. పల్లెల్లోని పీఆర్, ఆ&బీ రహదారులకు మోక్షం దక్కాలి. రూ.1,203 కోట్లతో చేపట్టిన జలజీవన్ మిషన్, రూ.1,650 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాలు చేపట్టాలి.

News July 24, 2024

మండవల్లిలో రైలు ఢీ.. యువకుడి మృతి

image

మండవల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని బుధవారం రైల్వే సిబ్బంది గుర్తించారు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మండవల్లి రైల్వేస్టేషన్ ట్రాక్‌పై తెల్లవారు జామున 2:45 సమయంలో సిబ్బంది అజయ్ కుమార్ పెట్రోలింగ్ చేస్తుండగా.. ప్లాట్ ఫారం సమీపంలో యువకుడి మృతదేహం కనిపించింది. రైల్వే SI కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడకు తరలించారు.

News July 24, 2024

కిలారి రోశయ్య ఆత్మీయ సమావేశం.. పార్టీ మారే అవకాశం?

image

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. నేడు YCP నేతలంతా జగన్‌తో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన బుధవారం గుంటూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. సమావేశానికి పొన్నూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

News July 24, 2024

తూ.గో: ముద్ర రుణం.. యువతకు ప్రయోజనం

image

ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు ద్వారా ఎంతో మంది యువకులకు ఉపాధి లభిస్తుంది. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,40,257 మందికి రూ.1,650.60 కోట్లు అందించారు. కాకినాడ జిల్లాలో 17,166 మందికి రూ. 282.51 కోట్లు.. కోనసీమ జిల్లాలో 24,371 మందికి రూ.229.84 కోట్లు రుణాలు ఇచ్చారు. ఇకపై రూ.20 లక్షలు వరకు రుణం ఇస్తారు.

News July 24, 2024

కేంద్ర బడ్జెట్.. పాలకొల్లు మెడికల్ కాలేజీ పనుల్లో కదలిక!

image

కేంద్ర బడ్జెట్‌తో పాలకొల్లులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఈ కాలేజీ నిర్మాణం పనులు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడికి వినతులు అందాయి. ఈ నిర్మాణం పూర్తయితే యువతకు, జిల్లా ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందని నాయకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. తాజా బడ్జెట్‌లో కేంద్రం విద్యా రంగానికి ఊతం ఇవ్వడంతో పునాదుల దశలో ఉన్న పనుల్లో కదలిక రానున్నట్లు తెలుస్తోంది.

News July 24, 2024

విశాఖ: డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఏయూ పరిధిలోని డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. హానర్స్ మొదటి సెమిస్టర్ ఫలితాలతో పాటు రెగ్యులర్ కోర్సులకు సంబంధించి ఫస్ట్, సెకెండ్, ఫోర్త్ రీవాల్యుయేషన్ ఫలితాలను వెబ్ సైట్‌లో ఉంచామన్నారు. విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్‌ను ఏయూ వెబ్‌సైటులో నమోదు చేసి మార్కులను నేరుగా పొందవచ్చని వెల్లడించారు.

News July 24, 2024

పోలవరానికి నిధులు.. చిగురించిన ఆశలు

image

పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఊరట కలిగించింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం కాకినాడ, తూ.గో, కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల వరకు పూర్తి చేయాల్సి ఉంది. దీనివల్ల సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ఎడమ కాలువను రూ 4,202.69 కోట్లతో నిర్మించవలసి ఉంది. ఇంతవరకు 72.99 శాతం పనులయ్యాయి.

News July 24, 2024

పోలవరానికి నిధులు.. చిగురించిన ఆశలు

image

పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఊరట కలిగించింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం కాకినాడ, తూ.గో, కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల వరకు పూర్తి చేయాల్సి ఉంది. దీనివల్ల సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ఎడమ కాలువను రూ 4,202.69 కోట్లతో నిర్మించవలసి ఉంది. ఇంతవరకు 72.99 శాతం పనులయ్యాయి.

News July 24, 2024

కేజీహెచ్ ఓపీ వద్ద అవస్థలు పడుతున్న రోగులు

image

కేజీహెచ్ ఓపి వద్ద రోగులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి వచ్చే రోగులు వద్ద స్మార్ట్ ఫోన్ లేక ఒకవేళ ఉన్నా యాప్ డౌన్లోడ్ చేయలేక గంటలు తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిరీక్షించి ఓపీ తీసుకున్న రోగులు వార్డులకు వెళితే అక్కడ డాక్టర్లు ఉండడం లేదని.. కేవలం పీజీ విద్యార్థులతో వైద్య సేవలు అందిస్తున్నట్లు రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.