India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాచలంలో నీటిమట్టం పెరిగిందని, రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప.గో కలెక్టర్ CH.నాగరాణి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్.. గోదావరి వరద పరిస్థితిపై సమీక్షించారు. భద్రాచలం నుంచి వదులుతున్న నీటితో వశిష్ట గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతుందన్నారు. ముంపు బాధితులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

*వైసీపీకి మాజీ MLA రాజీనామా
*అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఎంట్రీ
*అసెంబ్లీ వద్ద జగన్ ఆగ్రహం
*అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన జగన్
*నరసరావుపేట: 16 బైకులు స్వాధీనం
*వినుకొండ హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
*జగన్పై మరోసారి ఫైరైన MLA జీవీ
*నగరం: రూ.60 లక్షలు మాయం
*అమెరికాలో తెనాలి వైద్యురాలి మృతి
*అసెంబ్లీకి పసుపు చొక్కాతో మంత్రి లోకేశ్

➣ ఈనెల 23 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆధార్ క్యాంపులు➣ టెక్కలిలో టీడీపీ ఫ్లెక్సీల చించివేత➣ వరద నీటిపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ స్వప్నిల్ ➣ కేసులకు భయపడేవారు ఎవరూ లేరు: స్పీకర్ తమ్మినేని➣ఎచ్చెర్లలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య➣ మీకోసం పరిష్కార వేదికకు 151 అర్జీలు➣ పోటీ పరీక్షల్లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచాలి: రామ్మోహన్➣ ఐటీడీఏ పీవోగా రాహుల్ కుమార్ రెడ్డి➣ జలుమూరులో రూ.9 లక్షల నగదు చోరీ

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి సోమవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, వాగులు, చెరువుల వైపు వెళ్లనివ్వొద్దని కలెక్టర్ సూచించారు. SHARE IT..

కడప కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కలెక్టర్ శివ శంకర్ లోతేటి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబంధించిన శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు.

బొమ్మనహాల్ మండలంలోని తుంగభద్ర జలాశయం నుంచి సోమవారం ఎగువ కాలువకు తుంగభద్ర బోర్డు సెక్రటరీ వారికి రెడ్డి, ఎస్ ఈ శ్రీకాంత్ రెడ్డి, ఈఈ రవిచంద్ర నీటిని విడుదల చేశారు. మొదట 100 క్యూసెక్కుల నీటిని ఎగువ కాలువకు విడుదల చేశారు. గంట గంటకు పెంచుకుంటూ పోతూ 500 క్యూసెక్కుల నీటిని వదులుతామని తుంగభద్ర బోర్డ్ అధికారులు తెలిపారు.

గుంటూరు శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని ఉప్పలపాడు-తగరపాలెం అడ్డరోడ్డు దగ్గర గోపాలకృష్ణ రోడ్డు దాటుతున్నాడు. వేగంగా వచ్చిన లారీ అతణ్ని ఢీకొనడంతో గోపాలకృష్ణ రెండు టైర్లకింద నలిగి అక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పెదకాకాని పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేశ్ తాడేపల్లిలోని ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన, ప్రజా దర్బార్ మంగళవారం రద్దు చేసినట్లు లోకేశ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సమయాభావం వలన కార్యక్రమం రద్దు చేశామన్నారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుపుతామన్నారు. ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

అవినీతికి పాల్పడ్డ ముగ్గురు రెవెన్యూ అధికారులను కలెక్టర్ శివ శంకర్ సస్పెండ్ చేశారు. బద్వేల్ డివిజన్ మున్నెల్లి రెవెన్యూ గ్రామంలోని ZPH పాఠశాలకు చెందిన స్థలాన్ని అప్పటి డిప్యూటీ MRO విద్యాసాగర్, సర్వేయర్ ప్రవీణ్, వీఆర్వో గురవయ్య నిబంధనలకు వ్యతిరేకంగా వేరొకరికి ఆన్లైన్ చేశారు. దీనిపై బద్వేలు ఇన్ఛార్జ్ ఆర్డీవో విచారణ చేసి కలెక్టర్కు నివేదిక అందించడంతో ముగ్గురిని సస్పెండ్ చేశారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రజలు నుంచి 55 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల విషయంలో అలసత్వం లేకుండా చట్ట ప్రకారం తక్షణ చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.