Andhra Pradesh

News August 7, 2024

అనంత: రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

రానున్న ఐదు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 32.6 నుంచి 34.8° ఉష్ణోగ్రత, రాత్రి ఉష్ణోగ్రతలు 24.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. పంటలు సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News August 7, 2024

సత్యదేవుడికి రూ.కోటిన్నర వ్యయంతో వజ్ర కిరీటం

image

శంఖవరం మండలం అన్నవరం సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మి అమ్మవారు వజ్ర కిరీటధారిణిగా మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దాపురానికి చెందిన మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు సుమారు రూ.కోటిన్నర వ్యయంతో వజ్రాలు, బంగారు ఆభరణాలతో తయారుచేయించిన కిరీటాన్ని దేవస్థానానికి అందజేశారు. సత్యనారాయణ స్వామి దేవస్థానం 134వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ వజ్ర కిరీటాన్ని అలంకరించారు.

News August 7, 2024

గుంటూరులో జాబ్ మేళా.. అర్హతలివే

image

గుంటూరు గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.రఘు తెలిపారు. పేటీఎం, సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్, జయలక్ష్మి ఆటోమొబైల్స్, పలు కంపెనీలలో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందుకోసం టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

News August 7, 2024

విశాఖ: రైలులో విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన..

image

విజయవాడ నుంచి విశాఖ వస్తున్న రైలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతుండగా మేలుకొని కేకలు వేసింది. ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు నిందితుడిని పట్టుకుని బుధవారం ఉదయం విశాఖలో రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయికుమార్ డిమాండ్ చేశారు.

News August 7, 2024

బొకారో ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు

image

చెన్నై సెంట్రల్-బేసిన్ బ్రిడ్జి స్టేషన్ల మధ్య వంతెన పునర్నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే బొకారో ఎక్స్‌ప్రెస్‌ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. అలప్పుజ-ధన్ బా‌ద్ బొకారో ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 8,10,13, 15,17, 20,22, 24,27,29తేదీల్లో రెగ్యులర్ మార్గంలో కాకుండా వయా పొదనూర్,ఇరుగూర్, సూరత్‌కల్ స్టేషన్ల మీదుగా నడుస్తుందన్నారు. పొదనూర్‌లో హాల్ట్ కల్పించామన్నారు.

News August 7, 2024

కృష్ణా: బాలికపై ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన

image

పామర్రు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక నిమ్మకూరులో చదువుతోంది. తెలుగు ఉపాధ్యాయుడు డి.వెంకటరాజేశ్వరరావు ఈనెల 1న విద్యార్థులను గదికి రమ్మని, సదరు బాలికకు పుస్తకంలోని విషయాన్ని సరిచేయాలని సూచిస్తూ.. విద్యార్థిని శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఇంట్లో చెప్పగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్ విధించారు. గతంలో ఈయనపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి.

News August 7, 2024

కడప: ఈనెల 11వ తేదీ వరకు తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు

image

కడప- విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ మోహన్ దాస్ తెలిపారు . విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. కావున ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

News August 7, 2024

శ్రీకాకుళం: సాయం కోసం ఎదురుచూపులు

image

శ్రీకాకుళం జిల్లా గంగువారి సిగడాం మండలం సంతవురిటి గ్రామానికి చెందిన పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ పడాల రూపాదేవి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది థాయిలాండ్ లోపారా బ్యాడ్మింటన్ పోటీలో సిల్వర్ మెడల్, ఖేలో ఇండియాలో సిల్వర్, లక్నోలో గోల్డ్ మెడల్ సాధించారు. ఇండోనేషియాలో సెప్టెంబరులో జరిగే అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలకు వెళ్లడానికి ప్రభుత్వం సాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

News August 7, 2024

కాకినాడ అబ్బాయిని మోసం చేసిన ఆరుగురు మహిళలు

image

కాకినాడకు చెందిన కృష్ణమోహన్‌కు పెళ్లిసంబంధం చూస్తానని శిరీష అనే మహిళ కలిసింది. జూన్ 23న సత్యవేణి, దుర్గ అనే ఇద్దరిని పరిచయం చేసింది. వారు అతణ్ని రాజమండ్రికి తీసుకెళ్లి నీరజను పెళ్లికుమార్తెగా చూపించారు. నచ్చడంతో నిశ్చితార్థం ఖర్చులకు రూ.2.80లక్షలు, గోల్డ్ చైన్, ఫోన్‌ను సత్యదేవి, ప్రియాదేవికి అందించాడు. కొద్దిరోజులకు అనుమానంతో ప్రశ్నించగా మోసం చేశారని తేలింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

News August 7, 2024

తిరుపతి జిల్లాలో చిరుత సంచారం?

image

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం పరమాలలో అడవి జంతువు సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన శేషమ్మ సోమవారం రాత్రి తన పశువులను పొలాల సమీపంలో కట్టేసి ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం పాలు పితికేందుకు వెళ్లగా తాడుకు కట్టేసిన దూడను చంపి తినడం గుర్తించారు. అటవీ బీట్ అధికారి కిషోర్ కుమార్ జంతువు పాద ముద్రలు సేకరించారు. దాడికి పాల్పడింది చిరుతా? లేదా రేసుకుక్కలా? అని తేలాల్సి ఉంది.