Andhra Pradesh

News April 29, 2024

నరసరావుపేట: పోటీలో 122 మంది అభ్యర్థులు

image

నరసరావుపేట పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు 122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కలెక్టర్ శివ శంకర్ సోమవారం తెలిపారు. పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. పెదకూరపాడు 11, చిలకలూరిపేట 25, నరసరావుపేట 14, సత్తెనపల్లి 15, వినుకొండ 14, గురజాల 13, మాచర్ల 15 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నట్లు తెలిపారు.

News April 29, 2024

మే 1న పెందుర్తిలో పవన్ కళ్యాణ్ సభ

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 1న పెందుర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఆ పార్టీ నాయకులకు సమాచారం అందింది. పెందుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పంచకర్ల రమేశ్ బాబు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. బహిరంగ సభకు జన సేకరణలో నాయకులు నిమగ్నమయ్యారు. పెందుర్తి జంక్షన్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ జరగనుంది.

News April 29, 2024

విజయగనరంలో 92 మంది పోటీ

image

నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. విజయనగరం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 77 మంది పోటీలో ఉన్నారు. VZM అసెంబ్లీ స్థానంలో 15 మంది అభ్యర్థులు, ఎస్.కోటలో 12, నెల్లిమర్లలో 12, గజపతినగరంలో 13, చీపురుపల్లిలో 7, రాజాంలో 10, బొబ్బిలిలో 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల నుంచి 7 అభ్యర్థులు తప్పుకున్నారు.

News April 29, 2024

డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

image

జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సంబంధించి డిగ్రీ 6వ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ మూల్యాంకన షెడ్యూల్ ను యూనివర్సిటీ డీన్ ఎస్ ఉదయ్ భాస్కర్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు విద్యార్థులు ఈనెల 29వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుముతో మే 7వ తేదీ వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో మే 8వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. కావున విద్యార్థులు గమనించాలని కోరారు.

News April 29, 2024

కడప పార్లమెంట్ పరిధిలో ఫైనల్ అభ్యర్థుల వివరాలు

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కడప పార్లమెంటు స్థానానికి ఫైనల్ అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. మొత్తం 47 నామినేషన్లు దాఖలు కాగా 20 నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించామని, చివరకు 14 మంది ఎన్నికల పోటీలో నిలిచారన్నారు. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్‌రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల ఎన్నికల బరిలో ఉన్నారన్నారు.

News April 29, 2024

జనసేన రెబల్ పాఠంశెట్టికి ‘గాజు గ్లాసు’ గుర్తు

image

జనసేన జగ్గంపేట రెబల్‌ అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రకు ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. పాఠంశెట్టి MLA టికెట్ ఆశించగా.. కూటమిలో భాగంగా జ్యోతుల నెహ్రూ(టీడీపీ)కు దక్కింది. దీంతో పాఠంశెట్టి, మరో ఇద్దరు అసంతృప్తులు నామినేషన్స్ వేశారు. ఈ ముగ్గురి పేర్లు పేపర్లలో రాసి డ్రా తీయగా.. పాఠంశెట్టికి ‘గాజు గ్లాసు’ దక్కింది. జగ్గంపేటలో గెలిచి పవన్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని పాఠంశెట్టి పేర్కొన్నారు.

News April 29, 2024

పాలకొండ: సబ్ జైలుని సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి

image

పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి విజయరాజ్ కుమార్ సోమవారం సబ్ జైలును సందర్శించారు. జైలులో మౌలిక వసతుల పట్ల ఆరాతీశారు. జైలు సూపరింటెండెంట్ డి. జోగులు వేసవి దృష్ట్యా జైలు గదుల ఉపరితలాలపై కూల్ పెయింట్ వేయించినట్లు తెలియజేసారు. సారా అక్రమ వ్యాపార దుష్ప్రభావాలపై జూనియర్ సివిల్ జడ్జి ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, న్యాయవాదులు బొడ్డు రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

News April 29, 2024

నామినేషన్‌లు ఉపసంహరించుకున్న మడకశిర టీడీపీ రెబల్ అభ్యర్థులు

image

మడకశిర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న, తనయుడు సునీల్ కుమార్ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. సోమవారం మడకశిర తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఈరన్నతో పాటు సునీల్ కుమార్‌ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థి ఎమ్మెస్ రాజుకు మద్దతు పలికారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు.

News April 29, 2024

నెల్లూరు పార్లమెంటుకు నామినేషన్ ఉపసంహరణ

image

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ వేసిన వేణుంబాక సునంద రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు సోమవారం సునంద రెడ్డి తరఫున ఎస్. సుబ్బారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి హరినారాయణ్ వద్దకు వెళ్లి తమ నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేసి పత్రాలను అందజేశారు.

News April 29, 2024

విశాఖ-తిరుపతి స్పెషల్ ట్రైన్ రీ షెడ్యూల్

image

విశాఖ-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నుంచి సోమవారం రాత్రి 7.10 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ రాత్రి 11.10 గంటలకు బయలుదేరుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ట్రైన్ కు సంబంధించిన కనెక్షన్ రైలు ఆలస్యంగా వస్తున్న కారణంగా దీనిని రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.