India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 8వ తరగతి వరకు 2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జె.దయానంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో చేరేందుకు 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. ఆసక్తికలవారు 9000013640, 9440437629 నెంబర్లను సంప్రదించి పాఠశాలలో ప్రవేశంకోసం మరింత సమాచారం తెలుసుకోవచునన్నారు
కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన వృద్ధుడు బాలయ్య(73) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. నల్లగుంట్ల సమీపంలో ఉదయాన్నే ఉపాధి హామీ పనికి వెళ్లిన బాలయ్య పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు గమనించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాలయ్యను తరలించారు. వైద్యలు పరీక్షించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరిగే మే 13న జిల్లాలో స్థానిక సెలవుదినంగా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం, 1881 ప్రకారం సెలవు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈనెల 30 నుంచి ఇంటింటికి ‘ఓటర్ స్లిప్స్’ పంపిణీ చేయడం జరుగుతుందని ఎన్నికల అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్లను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
NCC, NSS వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరిగే ఒక్కరోజు సామాజిక సేవ, స్వచ్ఛంద ప్రాతిపదికన వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధికతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
గన్నవరంలో నామినేషన్ విత్డ్రా అనంతరం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రాఘవేంద్రరావు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యార్లగడ్డ వెంకట్రావుకి రంగా, పవన్ కళ్యాణ్ అంటే కనీస గౌరవం లేదన్నారు. తనను నియోజకవర్గంలో నిలబెట్టి వంశీని ఓడించాలని చూశారని అన్నారు. ఆఫీసులో కనీసం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టుకోలేదని, నియోజకవర్గంలో కాపులందరూ వంశీకి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
మే 1 నుంచి 4 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి గురువయ్య శెట్టి సోమవారం తెలిపారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రభుత్వ జూనియర్ కళాశాల (టౌన్), అదేవిధంగా ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు (CP&M కోర్సు) ఎమ్మిగనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర), మిగతా ఒకేషనల్ కోర్సులను బి.క్యాంప్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పీసీపల్లి మండలం వరిమడుగుకు చెందిన కొడవటిగంటి శాంసన్(34) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వెంగళాయపల్లి-దరిమడుగు గ్రామాల మధ్యలో ఆదివారం అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ బాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కనిగిరి వైద్యశాలకు తరలించారు.
ఏలూరు జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయం హీటెక్కుతోంది. ఈ మేరకు ప్రధాన పార్టీల నాయకులు జిల్లాలో బహిరంగ సభలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 30న దెందులూరుకు చంద్రబాబు నాయుడు, నేడు కొయ్యలగూడెంలో షర్మిల రెడ్డి బహిరంగ సభ, మే 1న ఏలూరులో జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు కొయ్యలగూడెంలో పర్యటించనున్నారు.
నూజివీడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వర రావు సోమవారం తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. త్వరలో ముద్దరబోయిన దంపతులు చంద్రబాబును కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Sorry, no posts matched your criteria.