India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్(వీసీ)గా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్న గంగాధర్ను ఇన్ఛార్జ్ వీసీగా నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

అనంతపురం JNTU ఇన్ఛార్జ్ వీసీగా సీనియర్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శన రావు నియమితులయ్యారు. ఈయన ఇదే జేఎన్టీయూలోనే బీటెక్ (1979-83) పూర్వ విద్యార్థి కావడం విశేషం. గతంలో ఈయన తన మెరిట్ ప్రతిపాదన క్రింద జేఎన్టీయూ రెక్టార్గా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. 2007లో ఏపీ ప్రభుత్వం నుంచి బెస్ట్ ప్రొఫెసర్ అవార్డును సైతం అందుకున్నారు.

డప యోగివేమన యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ ఉపకులపతిగా కృష్ణారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కడప వైవీయూకు కృష్ణారెడ్డిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈయన గతంలో వైవీయూ ప్రిన్సిపల్గా వ్యవహరించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ఈసీఈ విభాగం సీనియర్ ఆచార్యులు జి.శశిభూషణరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆచార్య శశిభూషణరావు ఏయూ పాలకమండలి సభ్యునిగా పనిచేశారు. రక్షణ రంగ సంబంధ పరిశోధనలో శశిభూషణ్ రావు నిష్ణాతులు.

రామసముద్రం మండలం మినికి సమీపంలోని పొలంలో 11కేవీ విద్యుత్ లైన్ చేతికి అందే ఎత్తులో ఉంది. పొలంలో రైతులు వ్యవసాయ పనులు చేసేందుకు కూడా భయపడుతున్నారు. పొలం దుక్కి చేయాలంటే ట్రాక్టర్ గాని లారీలు గాని నడపలేని పరిస్థితి నెలకొంది. వైర్లు అంత కిందకు వేలాడుతుండటంతో ఎప్పుడు ఏమి ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ఈసీఈ విభాగం సీనియర్ ఆచార్యులు జి.శశిభూషణరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆచార్య శశిభూషణరావు ఏయూ పాలకమండలి సభ్యునిగా పనిచేశారు. రక్షణ రంగ సంబంధ పరిశోధనలో శశిభూషణ్ రావు నిష్ణాతులు.

ఒలింపిక్స్లో భారత్ తరఫున పాల్గొన్న తొలి తెలుగు మహిళగా మచిలీపట్నంకు చెందిన మేరీ లైలారావు ఘనత వహించారు. ఆమె తన తండ్రి MK రావు ప్రోత్సాహంతో 100 మీ. పరుగు, 80 మీ. హర్డిల్స్లో శిక్షణ తీసుకుని.. 1956లో మెల్బోర్న్లో జరిగిన విశ్వక్రీడల్లో బరిలోకి దిగారు. ఆ పోటీల్లో ఆమె తొలి రౌండ్లోనే వెనుదిరిగినా ఆసియాలో అత్యంత వేగంగా పరిగెత్తే మహిళగా నిలిచారు. 1958లో జరిగిన ఆసియా క్రీడల్లో లీలా కాంస్యం గెలిచారు.

నెల్లూరు జిల్లా సీతారామపురంలో కనపడిన ఈ ఘటన చూపారుల హృదయాన్ని చలింపజేసింది. తల్లిదండ్రుల ఒడిలో కూర్చొని కమ్మని లాలి పాటలు వింటూ, బడిలో గురువుల వద్ద పలకపై ఓనమాలు దిద్దాల్సిన చేతులు, నేడు మురికి గుంటలో చిన్నారి చెత్త వేరుకుంటూ కనిపించింది. దారినపోయే బాటసారులకు సైతం ఈ ఘటన చూసి కన్నీళ్లు తెప్పించక మానదు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నారాయణపురంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద వరద భారీగా ప్రవహిస్తుంది. 5 కార్లు, 4 ఆటోలు, 10 బైకులు సహా దాదాపు 30 మంది ఆ వరదలో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సహాయక చర్యల కోసం ఉన్నతాధికారులతో మాట్లాడి హెలికాప్టర్ను రప్పించారు. ఆ హెలికాప్టర్ సహాయంతో బయటకు తరలిస్తున్నారు.

కుష్టు వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన ఇంటింటి సర్వే జిల్లాలో గురువారం ప్రారంభమైంది. నేటి నుంచి ప్రారంభమైన సర్వే ఆగస్ట్ 2వ తేదీ వరకు సాగనుంది. సర్వే నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తున్నాయి. ఇంటింటి సర్వేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ జి. గీతాబాయి పర్యవేక్షిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.