India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు నగరంలోని గోమతి నగర్లో జనసేన జిల్లా పార్టీ ఆపీసు ఏర్పాటు చేశారు. దీనిని పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. ఎవరికి అన్యాయం జరిగినా తమ పార్టీ కార్యాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. జనసేన పార్టీ పేద ప్రజల బాధలు తెలుసుకుని వారికి సహాయం చేసేందుకు ముందుంటుందని తెలిపారు.

నరసన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన ముగ్గురు విద్యార్థులు IIITలో ప్రవేశాలు పొందినట్లు పాఠశాల సిబ్బంది గురువారం తెలిపారు. విద్యార్థులు మెర్సీ, మధుసూదన్ రావు నూజివీడు త్రిపుల్ ఐటీలో, దివ్య శ్రీకాకుళం త్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు అర్హత సాధించారని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఉమ్మడి విశాఖ జిల్లా జనాభా 50,66,616కు చేరుకుంది. విశాఖ జిల్లాలో 23,85,658 మంది, అనకాపల్లి జిల్లాలో 17,26,998 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9,53,960 మంది జనాభా ఉన్నట్లు ఏయూ జనాభా అధ్యయన కేంద్రం అంచనా వేసింది. 2011 పోల్చితే ఉమ్మడి జిల్లాలో సుమారు 8 లక్షలకు పైగా జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లా జనాభా 42,90,599గా ఉంది.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 నుంచి 29 వరకు నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్& సప్లిమెంటరీ BA, BCom, BSc, BCA పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సంధ్యా కోల్ విడుదల చేశారు. ఈ ఫలితాలలో మొత్తం 14,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చన్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 నుంచి 29 వరకు నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ BA, BCom, BSc, BCA పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సంధ్యా కోల్ విడుదల చేశారు. మొత్తం 14,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 8,439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చన్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 నుంచి 29 వరకు నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్& సప్లిమెంటరీ BA, BCom, BSc, BCA పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సంధ్యా కోల్ విడుదల చేశారు. ఈ ఫలితాలలో మొత్తం 14,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చన్నారు.

విజయవాడ సచివాలయంలోని రెండో బ్లాకులోని తన ఛాంబర్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం కుటుంబసభ్యులతో ఫోటో దిగారు. తన విజయానికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందని పయ్యావుల తెలిపారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం తన కుమారులు విక్రమ్ సింహ, విజయ్ సింహ ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహించారు.

టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. శ్రీవారి నగదు, బంగారు డిపాజిట్లను ఆయనకు అనుకూలమైన బ్యాంకుల్లో పెట్టారని విమర్శలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్టుతో పాటు ఇతర దర్శన టికెట్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, తిరుపతిలో TTD నిధులతో అక్రమంగా రోడ్లు నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. తిరుమలకు వచ్చే బడాబాబుల పరిచయంతో YCPకి విరాళాలు సేకరించారని ఆరోపణలు ఉన్నాయి.

ఉప్పాడ తీర ప్రాంతంలో ఎప్పుడు అలలు మింగేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఉప్పాడలో ఇప్పటివరకు 1,360 ఎకరాలు కోతకు గురయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో చెన్నైకి చెందిన NCR నిపుణుల బృందం ఉప్పాడ తీరంలో కోత కట్టడికి 20ఏళ్లకు ప్రణాళిక సిద్ధం చేసింది. రక్షణ గోడ, గ్రోయన్ ఏర్పాటుకు రూ.200-250 కోట్ల వరకు అవుతుందని పేర్కొంది.

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గాలంకి శ్యామ్ యాక్సిడెంట్లో మృతి చెందాడు. మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శ్యామ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(SEB)లో పని చేస్తున్నాడు. ఆయన ఏలూరు నుంచి విజయవాడకు బైక్పై వెళ్తుండగా.. కృష్ణా జిల్లా పెదఅవుటుపల్లి వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.