Andhra Pradesh

News March 7, 2025

నీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్

image

వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరపాలక సంస్థ ఎస్ఈని ఆదేశించారు. శుక్రవారం కర్నూలు నగర శివార్లలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మీడియాకు వెల్లడించారు.

News March 7, 2025

విశాఖ ప్రజలు సహకరించాలి: కలెక్టర్

image

విశాఖలో రేపటి నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా P-4 సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శుక్రవారం తెలిపారు. పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా ఈ సర్వే రూపకల్పన చేశామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది 27 అంశాలతో సర్వే చేయనున్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా దిగువ స్థాయి కుటుంబాలను గుర్తించేందుకు ఇంటింటికీ వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ తెలిపారు.

News March 7, 2025

చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

ఈనెల 8వ తేదీ(శనివారం) చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవును DEO వరలక్ష్మి ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా ఉపాధ్యాయునిలు జరుపుకోవాలని ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

News March 7, 2025

VZM: రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు..!

image

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్యానికి వాడితే కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విజయనగరం, గజపతినగరం, డెంకాడ, చీపురుపల్లి, గరివిడి, రాజాం ప్రాంతాల్లో రెండు బృందాలుగా అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీ చేసి 57 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేశారు. వ్యాపారానికి డొమెస్టిక్ సిలిండర్లు వాడడం నేరమన్నారు.

News March 7, 2025

తక్కువ ధరలకే ఔషధ విక్రయాలు: ఎంపీ

image

జన ఔషధి కేంద్రలంలో తక్కువ ధరలకే నాణ్యమైన ఔషధాలు లభిస్తాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. పోస్టాఫీసు ఎదురుగా ఉన్న జన ఔషధి కేంద్రంలో జన ఔషధి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బయట మెడికల్ షాపుల్లో బ్రాండెడ్ ఔషధ ధరలు ఆకాశాన్ని అంటున్నాయని.. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ధరలకే జన ఔషధి కేంద్రల ద్వారా విక్రయిస్తున్నాయన్నారు. ఈ ఔషధాలన్నీ బ్రాండెడ్ ఔషధాల మాదిరిగానే పనిచేస్తాయన్నారు.

News March 7, 2025

కృష్ణా: DRDA PDగా హరినాథ్ బాబు బాధ్యతలు 

image

కృష్ణా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వై.హరినాథ్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. హరినాథ్ బాబు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి కృష్ణాజిల్లా డీఆర్డీఏ పీడీగా బదిలీపై వచ్చారు.

News March 7, 2025

షెడ్యూల్ కులాలకు సహాయం అందాలి: అనంతపురం కలెక్టర్

image

షెడ్యూల్ కులాలు, షెడ్యూలు తెగల వారికి ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.

News March 7, 2025

ఢిల్లీలో తన వాణి వినిపించిన ప.గో జిల్లా సర్పంచ్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పంచాయతీ శాఖ నిర్వహిస్తున్న వర్క్ షాప్‌లో ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బలక్ష్మి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని అన్నారు. తమ గ్రామంలో చేసిన అభివృద్ధి, చేయబోయే కార్యక్రమాల గురించి ఆమె వర్క్ షాప్‌లో వివరించారు.

News March 7, 2025

బాడంగి ఎయిరో డ్రమ్ భూములు పరిశీలన

image

బాడంగి సమీపంలోని ఎయిరో డ్రమ్ భూమితో పాటు చుట్టూ పక్కల ఉన్న భూములలో ఆయుధ భాండాగారాన్ని ఏర్పాటు చేసేందుకు భూములను నావికా దళ జూనియర్ మేనేజర్ చైతన్య, ఆర్డీవో రామ్మోహనరావు శుక్రవారం పరిశీలించారు. బాడంగి మండలం ముగడ, పాల్తేరు, రామచంద్రపురం, మల్లంపేట, పూడివలస, కోడూరు గ్రామాలలో 1,585 ఎకరాల భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. వారితో ఎమ్మార్వో సుధాకర్, సిబ్బంది ఉన్నారు.

News March 7, 2025

అత్యాచార నిరోధక చట్టంపై అవగాహన: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల పరిరక్షణ/అత్యాచార నిరోధక చట్టం జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. గ్రామాలలో పలు అంశాలపై మహిళలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఎంపీ అంబికా లక్ష్మినారాయణ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీశ్ పాల్గొన్నారు.