India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బుధవారం బాధ్యతల స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా గోపీనాథ్ జెట్టిని విశాఖ రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిత సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శించుకుని అనంతరం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 2008 బ్యాచ్కు చెందిన జెట్టి గతంలో చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించారు.

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా గోపీనాథ్ జెట్టిని విశాఖ రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తొలుత సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శించుకుని అనంతరం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 2008 బ్యాచ్కు చెందిన జెట్టి గతంలో చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించారు.

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు(పీఎస్ఆర్) విద్యా, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా నేషనల్ గ్లోబల్ ఐకాన్ అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం వర్చువల్ విధానంలో ఆయనకు సర్టిఫికెట్ అందించారు.

శింగనమల నియోజకవర్గం పుట్లూరులో 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంపై ఇటీవల Way2News స్పెషల్ స్టోరీ <<13523159>>పబ్లిష్<<>> చేసింది. ఈ వార్తకు స్పందించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి బుధవారం స్వయంగా కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఆ భవనాన్ని ఎస్సీ వసతి గృహానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని సౌకర్యాలపై నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.

సీతంపేట మండలం గడిగుజ్జి గ్రామానికి చెందిన గర్భిణి బిడ్డిక నిరోషాకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది గర్భిణిని వాహనంలో ఎక్కించి కొద్ది దూరం వచ్చేసరికి ఉమ్మ నీరు లీక్ అయ్యింది. గమనించిన ఈఎంటీ రామయ్య చాకచక్యంగా 108లోనే డెలివెరీ చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. తదుపరి సపర్యల కోసం దోనుభాయి పీహెచ్సీకి తరలించారు.

ఖాజీపేట మండలంలోని కే.సుంకేసుల గ్రామంలో 11 కె.వి విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయి. పొలంలోకి వెళితే ఎప్పుడు ఏం జరుగుతుందో అని నిత్యం భయపడుతున్నామని రైతులు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. పొలం సాగు చేయలేకపోతున్నామని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ ఈనెల 20న ప్రారంభం కానుంది. 32 కి.మీ. మేర జరిగే ఈ ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 11 మెడికల్ క్యాంపులు, 290 తాత్కాలిక, 169 శాశ్వత మరుగుదొడ్లు, 100 సీసీ కెమెరాలు అమర్చారు. ప్రధాన కూడళ్లలో అంబులెన్సులను సిద్ధం చేస్తున్నారు. సమాచారం తెలిపేలా అనౌన్స్మెంట్ సిస్టం అందుబాటులో ఉంచారు.

చిత్తూరు జిల్లాలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. కుప్పం నుంచి కేజీఎఫ్ బయల్దేరిన బస్సుకు శాంతిపురం మండలం రాళ్లబుదుగురు సమీపంలో ఎదురుగా ఓ బైకు వేగంగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మక్కువ మండలం కన్నంపేటకి చెందిన ఆర్మీ జవాన్ తేలు దినేష్ (34) ఈనెల 12న సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురి కావటంతో చికిత్స కోసం విజయనగరం తీసుకొని వెళ్లారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అనంతపురం పట్టణంలోని ఎస్కే యూనివర్సిటీ వసతి గృహంలో మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. యువతి ఉంటున్న గదిలో ఫ్యాన్కి వేలాడుతుండగా అక్కడే ఉన్న గమనించిన తోటి విద్యార్థులు వెంటనే వెళ్లి కిందకు దించారు. విద్యార్థినిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మౌనిక ఎస్కే యూనివర్సిటీలో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. మౌనిక స్వగ్రామం పులివెందులని తోటి స్నేహితులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.