Andhra Pradesh

News March 18, 2024

ఏలూరు: నర్సుతో LOVE.. గర్భవతిని చేసి మోసం

image

ఏలూరు జిల్లాలో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. వివరాలు.. ఏలూరుకు చెందిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. నూజివీడుకు చెందిన పురమా సాయిబాబు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె అతడికి దగ్గరైంది. ఈ క్రమంలోనే గర్భం దాల్చింది. ఆ తర్వాత అబార్షన్ చేయించి.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. యువతి ఫిర్యాదుమేరకు కేసు నమోదైంది.

News March 18, 2024

దర్శి: బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

image

రెండు బైకులు ఢీకొని ముగ్గురు యువకులకు గాయాలైన సంఘటన దర్శి మండలంలోని రాజంపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. క్షతగాత్రుల బంధువు కథనం మేరకు.. పొదిలి విశ్వనాథపురానికి చెందిన అస్మత్‌ బాషా, చరణ్‌తేజ బైక్‌పై దర్శి వెళ్తున్నారు. అదే మార్గంలో ముందు వెళ్తున్న రాజంపల్లికి చెందిన గుర్రపుశాల నాగార్జున గేదెలు అడ్డురావడంతో ముందు బైక్‌ను ఢీకొని పడిపోయారు. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News March 18, 2024

కాకినాడ: పవన్ కళ్యాణ్ అభిమాని మృతి

image

ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచికి చెందిన పవన్‌కళ్యాణ్ అభిమాని తాడి గంగాధర్ నవీన్ (30), రాజేశ్, సురేశ్, వెల్దుర్తికి చెందిన సత్యనారాయణ, ఉమాశంకర్‌ 2 బైక్‌లపై ప్రత్తిపాడుకు వెళ్తుండగా విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీ కొంది. ఈ ఘటనలో నవీన్ చనిపోగా..మిగతావారికి గాయాలయ్యాయి. నవీన్ తల్లిదండ్రులతో HYDలో ఉండగా ఆదాయం సరిపోవట్లేదని భార్య, పిల్లలతో 2నెలల క్రితమే ఉత్తరకంచికి వచ్చాడని గ్రామస్థులు చెబుతున్నారు.

News March 18, 2024

VZM: సచివాలయ ఉద్యోగి మృతి

image

విజయనగరం జిల్లా వేపాడ(M) కుంపల్లికి చెందిన వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. డెక్క చిరంజీవి(32) అనకాపల్లి జిల్లా దేవరాపల్లి(M) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిన్న ములకలాపల్లి పాలకేంద్రం వద్ద స్తంభానికి కట్టిన పోస్టర్‌ తొలగిస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. SI డి.నాగేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

News March 18, 2024

పెందుర్తి ఎమ్మెల్యే ర్యాలీపై అధికారుల నిఘా

image

పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆదివారం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీపై ఎన్నికల అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. ర్యాలీలో 100 మంది పాల్గొంటారని ఎమ్మెల్యే వర్గీయులు ముందుగా అనుమతి తీసుకున్నారు. కానీ అంతకుమించి కార్యకర్తలు, నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ర్యాలీని చిత్రీకరించారు. నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు జారీ చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

News March 18, 2024

మా ఎమ్మెల్యేకు సహకరించం: సర్పంచ్ కొనిరెడ్డి

image

ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి తాను, తన అనుచరులు సహకరించబోమని కొత్తపల్లె గ్రామపంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఎమ్మెల్యే చిచ్చు పెట్టాలని చూస్తున్నాడని, ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇవ్వమని, ప్రచారం చేయమని స్పష్టం చేశారు. త్వరలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు నడుచుకుంటానని తెలిపారు.

News March 18, 2024

చిత్తూరు జిల్లాలో వాలంటీర్ల తొలగింపు

image

చిత్తూరు జిల్లా పరిధిలో 33 మంది వాలంటీర్లను విధుల నుంచి తప్పించడం కలకలం రేపుతోంది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 18 మంది, పలమనేరు మున్సిపాల్టీలో 12 మంది, గుడిపాలలో ముగ్గురిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News March 18, 2024

నేటి నుంచి ఒంటిపూట తరగతులు

image

నెల్లూరు జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని డీఈఓ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలన్నారు. రోజూ ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 18, 2024

టెక్కలి పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌లు

image

టెక్కలిలోని ఐదు గ్రామ సచివాలయాల సిబ్బందితోపాటు, మండలంలోని పలువురు గ్రామీణ ప్రాంత పంచాయతీ కార్యదర్శులకు ఆదివారం టెక్కలి ఎంపీడీఓ కె. విజయలక్ష్మి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టెక్కలి మేజర్ పంచాయతీతో పాటు గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలుకు సంబంధించిన విధులకు గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు హాజరుకాకపోవడంపై నోటీసులు జారీ చేశారు. ఇదే అంశాన్ని టెక్కలి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నివేదించారు.

News March 18, 2024

గుంటూరు: విద్యార్థులకు RTCలో ఉచిత ప్రయాణం

image

నేటినుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రకటించింది. బస్సులో పరీక్షా కేంద్రానికి రాకపోకలు సాగించే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ ప్రజా రవాణా అధికారి నర్రా శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.