India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు మంత్రులు కింజరాపు అచ్చెనాయుడు, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి శనివారం ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఏలూరు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు తరలివెళ్లారు.

హైదరాబాద్ KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో చేజర్ల మండలం కొలపనాయుడుపల్లెకు చెందిన హేమనందిని అనే సాప్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె శ్రీధర్ అనే మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని 3 నెలల క్రితమే పెళ్లి చేసుకోగా ఆషాడ మాసం నేపథ్యంలో భర్త ఊరికి వెళ్లాడు. ఈ నెల 24న ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వినుకొండలో రషీద్ హత్య కేసులో 20మందికి పైగా నిందితులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మృతుడు, నిందితుడి మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. హత్యకు ముందు నిందితులు ఓ ప్రైవేట్ పాఠశాల మైదానంలో కలిసి మద్యం తాగి, హత్యకు సిద్ధమైనట్లు రిపోర్టులో వివరించారు. హత్య జరుగుతున్న సమయంలో నిందితులు కర్రలతో కాపు కాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆగస్టు 5వ తేదీ లోపు మండల విద్యాధికారికి అందజేయాలన్నారు.

గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన భారతరత్నతో సహా అనేక అవార్డులు అందుకున్నారన్నారు. అబ్దుల్ కలాంను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్నారు.

ఆగస్టు ఒకటో తేదీ సీఎం చంద్రబాబు మడకశిరకు రానున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తారని సమాచారం. సీఎం రాకను పురస్కరించుకొని జిల్లాస్థాయి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు పర్యటనను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఏపీఎస్సీపీసీఆర్ సభ్యుడు గొండు సీతారాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 26న జాతీయ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ్ బాల్ పురస్కారాలను ప్రదానం చేసేందుకు దరఖాస్తులను జులై 31లోగా పంపించాలని మొదట గడువు విధించారని, ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారని తెలిపారు.

ప్రమాదవశాత్తు ఐరన్ పైపు మీద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శ్రీకాళహస్తి మండలంలో జరిగింది. స్థానికుల కథనం.. రాచగున్నేరి సమీపంలోని ఓ కంపెనీలో లారీలోకి పైపులు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ ఐరన్ పైపు మీద పడటంతో కాపు గున్నేరు గ్రామానికి చెందిన ప్రసాద్ (48) తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై కడప జిల్లాకు వచ్చిన 40 మంది తహశీల్దార్లను తిరిగి ఆయా జిల్లాలకు బదిలీ చేస్తూ కలెక్టర్ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం వారంతా రిలీవ్ అయ్యారు. ఇక్కడి నుంచి వెళ్లిన వారు సోమవారం జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. బదిలీపై వెళ్లిన తహశీల్దార్ల స్థానంలో డిప్యూటీ తహశీల్దార్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

భార్యను చూసేందుకు నిలిపి ఉన్న RTC బస్సు తీసుకెళ్లిన ఘటన ఆత్మకూరులో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఆత్మకూరు (మం) వెంకటాపురానికి చెందిన దర్గయ్య లారీ డ్రైవర్. విధులకు వెళ్లగా.. భార్య పుట్టినిల్లు ముచ్చుమర్రికి వెళ్లింది. ఇంటికి వచ్చిన దర్గయ్య.. భార్య లేదని తెలిసి ఆత్మకూరు బస్టాండ్లో నిలిపి ఉన్న బస్సు తీసుకుని ముచ్చుమర్రికి వెళ్లాడు. అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సు స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.