Andhra Pradesh

News April 28, 2024

నేడు ఆర్కే బీచ్‌లో ఓటరు చైతన్య ర్యాలీ: కలెక్టర్

image

స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్.కె. బీచ్ లో సుమారు ఐదు వేల మందిని భాగస్వామ్యం చేస్తూ 5కె రన్ ఫర్ ఓట్ అనే పేరుతో ఓటరు చైతన్య ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

News April 28, 2024

కడప: ‘ఓటు హక్కు.. ప్రతి ఒక్కరి ఆయుధం’

image

ప్రజాస్వామ్య దేశంలో విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం పౌరులుగా మన బాధ్యతని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగించుకోవాలని కడప నగర కమీషనర్ ప్రవీణ్ చంద్ అన్నారు. “మన ఓటు, మన ధైర్యం, మన భవిత” అన్న నినాదంతో కడప రాజీవ్ పార్క్ వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కమిషనర్ ప్రారంభించి ఆయన పాల్గొన్నారు. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. 

News April 28, 2024

కాకినాడ జిల్లాలో 14 మండలాల్లో వడగాల్పులు: కలెక్టర్

image

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం.. ఆదివారం కాకినాడ జిల్లాలోని 14 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ నివాస్ తెలిపారు. ఏలేశ్వరం, గండేపల్లి, గొల్లప్రోలు, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెదపూడి, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రౌతులపూడి, సామర్లకోట, తుని, శంఖవరం మండలాల్లో వడగాల్పులు వీస్తాయన్నారు. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News April 28, 2024

నేడు అనకాపల్లిలో ‘మొగలిరేకులు’ నటుడి ప్రచారం

image

టీవీ, సినీ నటుడు సాగర్ నేడు (ఆదివారం) అనకాపల్లిలో జనసేన తరఫున ప్రచారం చేయడానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు పట్టణంలోని రింగ్ రోడ్‌లో గల జనసేన పార్టీ కార్యాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం జనసేన తరుఫున ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం.

News April 28, 2024

రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది కి సంబంధించి రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జనరల్ అబ్జర్వర్లు జాఫర్, మీర్ తారిఖ్ ఆలీ సమక్షంలో పోలింగ్ సిబ్బందికి సంబంధించిన రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.

News April 28, 2024

పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు: కలెక్టర్

image

ఉద్యోగి ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఓటరుగా నమోదైనా తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ప.గో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ కంటే ముందుగానే ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. దీని కొరకు మే1 వరకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 28, 2024

ప్రకాశం: కోనంకి సబ్ డివిజన్‌లో ఆగిన సాగర్ జలాలు

image

కోనంకి సబ్ డివిజన్‌లో రెండో దఫా వచ్చిన సాగర్ జలాలు శనివారం వేకువజాముతో ఆగిపోయాయి. మార్టూరు, పర్చూరు, కారంచేడు, యద్దనపూడి, ఇంకొల్లు మండలాలలో 68 మంచి నీటి చెరువులు ఉండగా వాటిలో 58 చెరువులకు నీళ్లు చేరినట్లు ఎన్ఎస్పీ ఈఈ ఉమామహేశ్వరరావు చెప్పారు. మార్టూరు చెరువుకు మాత్రం 50 శాతం సాగర్ జలాలు చేరాయి. జూన్ నెల వరకు గ్రామంలో తాగునీటికి ఇబ్బంది ఉండదని పంచాయతీ అధికారులు చెబుతున్నారు.

News April 28, 2024

ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి: శ్రీకాకుళం కలెక్టర్

image

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. శనివారం సాధారణ పరిశీలకులు శేఖర్, సందీప్ కుమార్, పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా, పోలీసు పరిశీలకులు సచింద్ర పటేల్‌, దిగంబర్ పి. ప్రధాన్లకు ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్‌ వివరించారు. ఇప్పటికే సిబ్బందికి రెండు విడతల శిక్షణ పూర్తి చేశామన్నారు.

News April 28, 2024

VZM: నియోజకవర్గాల కేటాయింపు పూర్తి  

image

జిల్లాలో వచ్చే నెలలో జరగనున్న సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా PO, APO, OPOల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఎన్ఐసీలో రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా జిల్లాలోని 12, 522 మంది ఎన్నికల సిబ్బందిని నియోజకవర్గాలకు కేటాయించే ప్రక్రియను కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీశ్ చాబ్రా, సీతారాం జాట్ తదితరుల సమక్షంలో ఎన్ఐసీ అధికారులు నిర్వహించారు.  

News April 28, 2024

కృష్ణా జిల్లాలో మరింత పెరిగిన ఓటర్లు

image

కృష్ణా జిల్లాలో ఓటర్ల సంఖ్య మరింత పెరిగింది. జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాకు అదనంగా సప్లమెంటరీ ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 15,39,460 మంది ఓటర్లు ఉన్నారు. గత జనవరిలో 15,18,255 మంది ఓటర్లతో విడుదల చేసిన జాబితాతో పోలిస్తే జిల్లాలో 21,205 మంది ఓటర్లు పెరిగారు. వీరంతా మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు.