Andhra Pradesh

News July 22, 2024

ఆగస్టు 1 నుంచి బీఆర్క్ సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బిఆర్క్ సెకెండ్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు ఒకటి నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సబ్జెక్టుల వారిగా పరీక్షా తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్ సైట్‌లో ఉంచినట్లు వెల్లడించారు.

News July 22, 2024

పసుపు చొక్కాలో కనిపించిన నారా లోకేశ్

image

మంత్రి నారా లోకేశ్ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సాధారణంగా తెల్ల చొక్కాతో కనిపించే ఆయన ఇవాళ పసుపు చొక్కాలో మెరిశారు. ఆయన లాగే కొందరు పసుపు దుస్తులతో రాగా, మరికొందరు కండువాలతో సమావేశాలకు హాజరయ్యారు. మరోవైపు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

News July 22, 2024

అసెంబ్లీలో అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు

image

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. మంత్రులు పయ్యావుల, సవిత, సత్యకుమార్ యాదవ్ ముందు వరుసలో కూర్చుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అలాగే జిల్లాకు అవసరమైన ప్రాజెక్టులు, వివిధ పనులపై అసెంబ్లీ వేదికగా గళం విప్పేందుకు జిల్లా ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.

News July 22, 2024

పోలీస్ సేవలు ప్రశంసనీయం : జిల్లా SP

image

బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగకు సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఎస్పీ జి.కృష్ణకాంత్ అభినందించారు. 2వేల మంది పోలీసు సిబ్బంది 24 గంటలూ విధుల్లో ఉంటూ దర్గాకు విచ్చేసిన భక్తులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. రద్దీలో తప్పిపోయిన 472 మంది చిన్నారులకు సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు. క్రైమ్ పార్టీ పోలీసులు 17 మంది జేబు దొంగలను అదుపులోకి తీసుకున్నారన్నారు.

News July 22, 2024

ధవళేశ్వరం UPDATE.. 2వ ప్రమాదహెచ్చరికకు ఛాన్స్

image

ధవలేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిందని డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం నాటికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. సోమవారం జిల్లా, మండల స్థాయి ప్రత్యేకాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వరదలపై సమీక్షించారు. భద్రాచలం నుంచి ధవలేశ్వరం బ్యారేజీకి భారీగా వరద వస్తుందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు సిద్ధంగా ఉంచాలన్నారు.

News July 22, 2024

కనిగిరి పోలీస్ స్టేషన్లో 108 అంబులెన్స్‌

image

కొనకనమిట్ల మండలానికి చెందిన 108 వాహనం ఈనెల 10న కనిగిరి మున్సిపాలిటీలోని టకారిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొనగా అతడు మృతి చెందాడు. ఆ అంబులెన్స్‌కు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో కనిగిరి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. జిల్లాలోని పదుల సంఖ్యలో అంబులెన్స్‌‌లకు ఈ ధ్రువపత్రాలు లేవని పలువురు చెప్తున్నారు.

News July 22, 2024

నెల్లూరు: 20 ఏళ్ల తర్వాత అధ్యక్షా.. .

image

టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి మూడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన 20 ఏళ్ల తర్వాత అధ్యక్షా..అని పలకబోతున్నారు. 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన ఆయన తిరిగి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. సర్వేపల్లి నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు కూడా సోమిరెడ్డే.

News July 22, 2024

చిత్తూరు : జాతీయ మామిడి దినోత్సవం (ప్రత్యేకం)

image

మామిడి శాస్త్రీయ నామం మాంజిఫెర ఇండికా. మామిడి భారతదేశ జాతీయ పండు. ప్రతి ఏడాది జూలై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. పండ్లలో రాజుగా మామిడిని పిలుస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా భౌగోళిక పరిస్థితులు మామిడి సాగుకు ఎంతగానో అనుకూలం. జిల్లాలో మామిడి ఉత్పత్తులకు మంచి వ్యాపారం, మార్కెటింగ్ ఉంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతుంది. మీకు నచ్చిన మామిడి రకం కామెంట్ చేయండి.

News July 22, 2024

గుంటూరు: మీ MLA ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారు?

image

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ గళం వినిపించనుండగా.. వారిలో నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరి మీ నియోజకవర్గ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి.

News July 22, 2024

విజయనగరం: గంజాయితో నలుగురు అరెస్ట్

image

గంజాయి విక్రయిస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ పడ్డారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు గంజాయి విక్రయించడానికి ఎస్.కోట-విశాఖ రహదారిలో బైక్‌పై తీసుకువెళ్తుండగా కొత్తవలస పోలీసులకు చిక్కారు. వారితో పాటు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. 3.42 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నారు.