India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కలెక్టర్ శివ శంకర్ లోతేటి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబంధించిన శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు.

బొమ్మనహాల్ మండలంలోని తుంగభద్ర జలాశయం నుంచి సోమవారం ఎగువ కాలువకు తుంగభద్ర బోర్డు సెక్రటరీ వారికి రెడ్డి, ఎస్ ఈ శ్రీకాంత్ రెడ్డి, ఈఈ రవిచంద్ర నీటిని విడుదల చేశారు. మొదట 100 క్యూసెక్కుల నీటిని ఎగువ కాలువకు విడుదల చేశారు. గంట గంటకు పెంచుకుంటూ పోతూ 500 క్యూసెక్కుల నీటిని వదులుతామని తుంగభద్ర బోర్డ్ అధికారులు తెలిపారు.

గుంటూరు శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని ఉప్పలపాడు-తగరపాలెం అడ్డరోడ్డు దగ్గర గోపాలకృష్ణ రోడ్డు దాటుతున్నాడు. వేగంగా వచ్చిన లారీ అతణ్ని ఢీకొనడంతో గోపాలకృష్ణ రెండు టైర్లకింద నలిగి అక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పెదకాకాని పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేశ్ తాడేపల్లిలోని ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన, ప్రజా దర్బార్ మంగళవారం రద్దు చేసినట్లు లోకేశ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సమయాభావం వలన కార్యక్రమం రద్దు చేశామన్నారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుపుతామన్నారు. ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

అవినీతికి పాల్పడ్డ ముగ్గురు రెవెన్యూ అధికారులను కలెక్టర్ శివ శంకర్ సస్పెండ్ చేశారు. బద్వేల్ డివిజన్ మున్నెల్లి రెవెన్యూ గ్రామంలోని ZPH పాఠశాలకు చెందిన స్థలాన్ని అప్పటి డిప్యూటీ MRO విద్యాసాగర్, సర్వేయర్ ప్రవీణ్, వీఆర్వో గురవయ్య నిబంధనలకు వ్యతిరేకంగా వేరొకరికి ఆన్లైన్ చేశారు. దీనిపై బద్వేలు ఇన్ఛార్జ్ ఆర్డీవో విచారణ చేసి కలెక్టర్కు నివేదిక అందించడంతో ముగ్గురిని సస్పెండ్ చేశారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రజలు నుంచి 55 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల విషయంలో అలసత్వం లేకుండా చట్ట ప్రకారం తక్షణ చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

అల్పపీడనం ప్రభావంతో విశాఖ జిల్లాలో 4 రోజులుగా కురిసిన వర్షాలకు జరిగిన నష్టం వివరాలను అందజేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నష్టం నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి సత్వరమే అందించాలని ఆదేశించారు. జేసీ మయూర్ అశోక్ అధికారులు పాల్గొన్నారు.

కాలువలో స్నానానికి దిగి వ్యక్తి గల్లంతైన ఘటన ప.గో జిల్లా యలమంచిలి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. యలమంచిలి లంక గ్రామానికి చెందిన పి.ఆనందరావు(43) సోమవారం మధ్యాహ్నం నక్కల కాలువ రేవులో స్నానానికి దిగి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. నరసాపురం ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, పాలకొల్లు ఫైర్ ఆఫీసర్ జానకీరామ్ పర్యవేక్షించారు.

రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 15న ప్రారంభించేందుకు విజయనగరం జిల్లాలో 3 అన్నా క్యాంటీన్లను సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. విజయనగరం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్లతో తన ఛాంబర్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ముందుగా మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యాధుల వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు.

ఏయూ ఉద్యోగుల ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానని ఇన్చార్జి వీసి ఆచార్య జి.శశిభూషణరావు అన్నారు. సోమవారం ఆయన ఆర్ట్స్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశం అయ్యారు. ఫ్యాకల్టీకి ఏయూ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందన్నారు. సమయపాలన పాటిస్తూ, నిబద్ధతతో సేవలు అందించాలని సూచించారు. ప్రతి విభాగాన్ని సందర్శిస్తానని అందరి సూచనలు స్వీకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.