India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజలు నుంచి అందే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్.పి(అడ్మిన్) సుధాకర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ వెంకట రాముడు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులతో మాట్లాడారు. బాధితులకు తక్షణ న్యాయాన్ని అందించాలన్నారు.

గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నేడు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను వైసీపీ అధినేత YS
జగన్కు అందజేశారు. తమ రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో గుంటూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలిందని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, మద్దాలి గిరి అనుచరులు ఎవరూ ఫోన్లో అందుబాటులో లేరు.

భర్త నుంచి తనను కాపాడాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. బనగానపల్లెకు చెందిన ఉప్పరి అన్నపూర్ణ అనే మహిళ భర్త నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని తెలిపారు. అదనపు కట్నం కోసం తరచూ హింసిస్తుంటే రూ.లక్ష ఇచ్చామని అయినా మరికొంత డబ్బు కావాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల పత్రంపై సంతకం పెట్టాలంటూ తనపై దాడి కూడా చేశాడని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారు.

విశాఖ ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊర్వసి జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని దెబ్బతిన్నాయి. అనకాపల్లికి చెందిన ఓ మహిళ కొత్త కారు డ్రైవ్ చేస్తూ వెళుతూ ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొని నుజ్జునుజ్జు అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాకపోకలను పునరుద్ధరించారు.

కావలికి చెందిన వెంకట కార్తీక్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. హైదరాబాద్లో పలు వెబ్సిరీస్లకు దర్శకుడిగా కార్తీక్ పనిచేస్తున్నారు. చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదని, ప్రతిసమస్యకు పరిష్కారం ఉంటుందని చెబుతూ బైక్పై గతేడాది ఫిబ్రవరి 14 నుంచి అక్టోబర్ 6 వరకు దేశమంతా చుట్టేశారు. 1,40,300 కి.మీ. తిరిగి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

వర్షాకాలంలో విద్యుత్తు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఈపీడీసీఎల్ ఎస్.ఈ ఎం.లక్ష్మణరావు సూచించారు. ఉమ్మడి జిల్లాలో 6 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్యలపై 1912 టోల్ ఫ్రీ నంబరుతో పాటు విజయనగరం సర్కిల్లో 94906 10102, టౌన్లో 63005 49126, రూరల్లో 94409 07289, బొబ్బిలిలో 94906 10122, పార్వతీపురంలో 83320 46778 నంబర్లను సంప్రదించాలన్నారు.

తెనాలి ఐతానగర్కు చెందిన వైద్యురాలు హారిక(25) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ఆమె మృతదేహం స్వస్థలం చేరుకునేందుకు సాయం చేయాలని మంత్రి లోకేశ్ను పలువురు సోషల్ మీడియాలో కోరారు. దీనిపై మంత్రి స్పందించారు. హారిక మృతి విషయం బాధ కలిగించిందని లోకేశ్ పేర్కొన్నారు. మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ ఎంబసీతో చర్చిస్తుందని వివరించారు.

ఆధార్ స్పెషల్ క్యాంపులు అందరు వినియోగించుకోవాలి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆధార్ స్పెషల్ క్యాంపులను ఈనెల 23 నుంచి 27 తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరూ ఆధార్ స్పెషల్ క్యాంపులు వినియోగించుకోవాలన్నారు.

ఏపీ సభాపతి అయన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నిర్వహణ, చేపట్టాల్సిన అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ గైర్హాజరైంది.

కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.43 ఉండగా 52 పైసలు తగ్గి నేడు రూ.108.91కు చేరింది. డీజిల్ 48 పైసలు తగ్గి నేడు లీటర్ రూ.96.80గా ఉంది. నంద్యాల జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.76 ఉండగా 33 పైసలు పెరిగి నేటికి రూ.110.09కు చేరింది. 30 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.97.87గా ఉంది.
Sorry, no posts matched your criteria.