Andhra Pradesh

News March 7, 2025

దక్షిణ చిరువోలు లంకలో రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ 

image

అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంకలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గ్రామ సచివాలయంలో రికార్డులు పరిశీలించి అక్కడున్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూమి నిజనిర్ధారణ (గ్రౌండ్ ట్రూతింగ్), భూమి ధ్రువీకరణ (గ్రౌండ్ వాలిడేషన్) ప్రక్రియ సక్రమంగా జరిగితే రీ సర్వేలో నాణ్యమైన ఫలితాలు పొందవచ్చన్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 7, 2025

పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి: క‌లెక్ట‌ర్‌

image

జిల్లాలో పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికైన పాఠశాలలకు మంజూరైన నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ హెచ్‌ఎంలకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో పీఎంశ్రీ నిధుల వినియోగం, పాఠశాలల్లో పెండిరగ్‌లో వున్న అభివృద్ధి పనులపై సమగ్రశిక్ష ఇంజనీర్లు, హెచ్‌ఎంలతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

News March 7, 2025

చందనోత్సవాన్ని విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే గంటా

image

ప్రభుత్వానికి పేరు తెచ్చేలా సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్న దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కె.సుబ్బారావు శుక్రవారం ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏప్రిల్ 30న జరగనున్న చందనోత్సవాన్ని సవాలుగా తీసుకుని జిల్లా యంత్రాంగం సహకారంతో విజయవంతం చేద్దామన్నారు.

News March 7, 2025

రైతుల్ని ఇబ్బంది పెడితే క్రిమిన‌ల్ కేసులు: క‌లెక్ట‌ర్‌

image

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, సంబంధిత రైస్ మిల్లర్ల‌పై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క‌లెక్ట‌ర్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను రైతుకు చెల్లించాల్సిందేనన్నారు.

News March 7, 2025

మార్కాపురంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు.!

image

మార్కాపురం పట్టణానికి శనివారం సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు దిగనున్న హెలిప్యాడ్ స్థలం వద్ద బాంబ్ స్క్వాడ్ శుక్రవారం తనిఖీలు చేపట్టింది జిల్లా అధికార యంత్రాంగం హెలిప్యాడ్ స్థలం వద్ద ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పటిష్ఠ భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

News March 7, 2025

విద్యార్థులకు పక్కాగా భోజనాన్ని అందించాలి: కలెక్టర్

image

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని కలెక్టర్ పి.రంజిత్ భాష ఆదేశించారు. శుక్రవారం కర్నూల్ నగరంలోని ఎస్ఎపీ క్యాంప్‌లోని నగర పాలక ఉన్నత పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు సులభంగా గణితం అర్థమయ్యేందుకు టిప్స్ సైతం  అందించారు. అనంతరం విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు.

News March 7, 2025

పరీక్షా పత్రం లీకేజిపై మంత్రి లోకేశ్  సీరియస్

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షా పత్రం లీకేజి అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోందని మంత్రి లోకేశ్ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 2.గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఛైల్డ్ డెవలప్‍మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి ముందే లీక్ కావడంపై విచారణ నిర్వహించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News March 7, 2025

కవిటి: ఇరాక్‌లో వలస కూలీ మృతి

image

విదేశాలకు కూలీ పనికి వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కవిటి మండలంలో జరిగింది. మండలంలోని ఆర్ బెలాగానికి చెందిన భుజంగరావు(43) ఇరాక్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఆయన మృతిచెందడంతో తోటి కూలీలు ఫోన్ ద్వారా కుటుంబీకులకు చెప్పారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు మృతదేహన్ని దేశానికి రప్పించి.. కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే అశోక్ బాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు.

News March 7, 2025

కైలాసగిరిలో అదుపులోకి వచ్చిన మంటలు: ప్రణవ్ గోపాల్ 

image

కైలాసగిరిపై రోప్ వే సిబ్బంది వ్యర్థాలను తగలబెట్టడం వల్లే మంటలు వ్యాపించాయని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ (ఎంసీ) కేఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. తక్షణమే మంటలను అదుపు చేయాలని వీఎంఆర్డీఏ అటవీ విభాగం అధికారులను ఆదేశించామన్నారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించామని, మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు.

News March 7, 2025

విజయనగరం జిల్లా వ్యాప్తంగా 572మంది విద్యార్థులు గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 572మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్.ఐ.ఓ మజ్జి ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా 19,603 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 19,031మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు.