Andhra Pradesh

News April 27, 2024

నేడు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

image

పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నారు. పాలిసెట్ కోసం జిల్లాలో మొత్తం 14 కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 11 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆయా కేంద్రాలలో 4,628 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.

News April 27, 2024

చిత్తూరు: 213 మంది HMలకు షోకాజ్ నోటీసులు

image

యూడైస్ (విద్యార్థుల నమోదు) ప్రక్రియలో చోటు చేసుకున్న తప్పులను కారణాలుగా చూపుతూ 25 మండలాల్లోని 213మంది HMలకు, 26 మంది MEOలకు చిత్తూరు DEO దేవరాజు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శాఖాపరమైన లోపాలు సవరించకుండా సమాచారం రాలేదనే సాకుతో టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదనని ఉపాధ్యాయ సంఘం నేతలు అన్నారు. ఉపసంహరించుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.

News April 27, 2024

శ్రీకాకుళం-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు

image

శ్రీకాకుళం రోడ్డు తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. మే 5, 12 తేదీల్లో రాత్రి 8.05 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8.05కి దువ్వాడ చేరుకుని మధ్యాహ్నం12.15కి శ్రీకాకుళం చేరుకుంటుంది. మే 6, 13వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి దువ్వాడ మీదగా తర్వాత రోజు ఉదయం 8.20కి తిరుపతికి చేరుకుంటుంది.

News April 27, 2024

ఎన్టీఆర్: 85 నామినేషన్లు తిరస్కరణ

image

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా విజయవాడ పార్లమెంట్‌, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలకు సంబంధించి 125 నామినేషన్లు ఆమోదం పొందగా.. 85 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 332 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకే అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో 122 సెట్ల నామినేషన్లు అదనంగా వచ్చాయి.

News April 27, 2024

పార్టీ ఏ పని చెప్తే.. అది చేస్తా: పేర్ని నాని

image

రాజకీయంగా అకౌంటబులిటీ లేని జీవితం గడపాలనే రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు పేర్ని నాని తెలిపారు. ‘జగన్ అంటే పిచ్చి ఉంది. వైసీపీ అంటే ప్రేమ ఉంది. పార్టీకి ఏ అవసరం వచ్చినా నన్ను పిలిస్తే అది చేస్తానని సీఎం జగన్‌కు చెప్పాను. నాకు నచ్చజెప్పడానికి జగన్ చాలా సార్లు ప్రయత్నించారు. పోర్టు శంకుస్థాపనకు మచిలీపట్నం వచ్చిన రోజు ఇక నేను మాట వినను అని జగన్ డిసైడ్ అయ్యారు’ అని పేర్ని నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News April 27, 2024

శ్రీకాకుళం-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు

image

శ్రీకాకుళం రోడ్డు తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. మే 5, 12 తేదీల్లో రాత్రి 8.05 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8.05కి దువ్వాడ చేరుకుని మధ్యాహ్నం12.15కి శ్రీకాకుళం చేరుకుంటుంది. మే 6, 13వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి దువ్వాడ మీదగా తర్వాత రోజు ఉదయం 8.20కి తిరుపతికి చేరుకుంటుంది.

News April 27, 2024

శ్రీకాకుళం: 95 ఆమోదం.. 28 తిరస్కరణ

image

సార్వత్రిక ఎన్నికలక ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం నిర్వహించారు. 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు నామపత్రాలు పరిశీలించారు. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి 82 నామినేషన్లు ఆమోదించగా.. 25 తిరస్కరించారు. పార్లమెంట్ స్థానానికి 13 ఆమోదించగా.. 3 తిరస్కరించారు. మొత్తానికి 95 ఆమోదం పొందాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఇచ్చారు.

News April 27, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 28,29 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మల్లెల రాజశేఖర్ తెలిపారు. 28న గూడురులో బహిరంగసభలో పాల్గొని రాత్రి అక్కడే బస చేస్తారు. 29న నంద్యాల జిల్లాలోని డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు.

News April 27, 2024

ధర్మవరంలో చేనేత కార్మికుడి దారుణ హత్య

image

ధర్మవరంలో శుక్రవారం రాత్రి దారుణ హత్య జరిగింది. గీతానగర్‌‌లోని రమేశ్‌కు అతడి పిన్ని నారాయణమ్మ కుమారుడు మణి పట్టుచీర అమ్మాడు. అందుకు సంబంధించిన రూ.10వేలు ఇవ్వాలని రమేశ్‌ను అడగడంతో మాటమాట పెరిగి మణి ఛాతిలో కత్తితో పొడిచాడు. అడ్డువచ్చిన మణి అన్న మణికంఠపై, తల్లి సావిత్రిని రమేశ్ కత్తితో పొడిచి గాయపరిచాడు. మణిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు.

News April 27, 2024

తిరుపతి: ఆమోదం 177.. తిరస్కారం 50

image

తిరుపతి జిల్లాలో ఒక MP, 7 శాసనసభ స్థానాలకు 227 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. తిరుపతి MP స్థానానికి 27 దాఖలవ్వగా మూడింటిని తిరస్కరించారు. జిల్లాలోని 7 శాసనసభ స్థానాలకు 200 దాఖలు చేయగా.. 47 తిరస్కరించారు. తిరుపతిలో 52కి 4, చంద్రగిరిలో 43కి 17, శ్రీకాళహస్తిలో 27కి 4, సత్యవేడులో 24కి 7, సూళ్లూరుపేటలో 16కి 2, గూడూరులో 21కి 6, వెంకటగిరిలో 17కి 7 తిరస్కరించారు.