Andhra Pradesh

News April 26, 2024

30న తెనాలిలో చంద్రబాబు పర్యటన: నాదెండ్ల

image

ఈనెల 30వ తేదీన తెనాలి పట్టణంలో చంద్రబాబు పర్యటిస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాడు తెనాలి చేరుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

News April 26, 2024

నంద్యాల: ఓటు హక్కును ప్రాధాన్యత తెలియజేసే కార్టూన్ చిత్రం

image

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ చిత్రకారుడు విజయ్ తమ కుంచె నుంచి వ్యంగ్య కార్టూన్‌ను రూపొందించారు. సామాజిక స్పృహ కలిగిన ఓటర్లు అందరూ నోటుకో , మద్యానికో .. తమ ఓటు అమ్ముకోకుండా ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే సరైన నాయకుడిని ఎంచుకోవాలని ఆర్టిస్ట్ విజయ్ తమ కార్టూన్ రూపంలో తెలిపారు. ఈ చిత్రం పలువురిని ఆలోచింపజేస్తుంది.

News April 26, 2024

తాడిపత్రిలో 2 నామినేషన్లు రిజెక్ట్

image

తాడిపత్రిలో దాఖలైన ఎన్నికల నామినేషన్లలో 2 రిజెక్ట్ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. శుక్రవారం వాటిని పరిశీలించి ఇది వరకే ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు అంగీకరించినందున కేతిరెడ్డి రమాదేవి, జేసీ ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు.

News April 26, 2024

రేపు పాలిసెట్ ప్రవేశ పరీక్ష

image

ఈనెల 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5,460 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News April 26, 2024

ప.గో.: అమ్మా, నాన్న, ఓ కుమారుడు.. ముగ్గురూ మంత్రులే

image

దెందులూరుకు చెందిన మాగంటి కుటుంబం అరుదైన గుర్తింపు పొందింది. 1989లో కాంగ్రెస్ నుంచి దెందులూరు MLAగా గెలుపొందిన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి దేవాదాయ మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవిలో ఉండగానే ఆయన ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి వరలక్ష్మీదేవి గెలిచి మంత్రి అయ్యారు. వారి కుమారుడు మాగంటి బాబు 2004లో MLAగా గెలిచి రెండేళ్ల తర్వాత చిన్ననీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు.

News April 26, 2024

గుంటూరు పార్లమెంట్ పోటీలో 34 మంది: ఆర్వో

image

గుంటూరు పార్లమెంటు స్థానానికి 47 మంది అభ్యర్థులు 67 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్ రెడ్డి నామినేషన్‌ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 34 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించి, సక్రమంగా లేని 13 నామినేషన్లను రిజెక్ట్ చేశామన్నారు. పరిశీలనలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు S.P. కార్తీకా పాల్గొన్నారు. 

News April 26, 2024

సోమల: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి 

image

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన సంఘటన సోమల మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సదుం మండలం కారేవాండ్ల పల్లెకు చెందిన ముని-వెంకట సిద్ధుల కుమారుడు భవిత్ కుమార్(15) మండలంలోని నడింపల్లిలో సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో నేడు ఈత కోసం గుంజు చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 26, 2024

పిఠాపురం బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి

image

పిఠాపురంలో చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కరరావు ఎన్నికల బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిన్ని నామినేషన్ వేశారు. ఇంటర్ వరకు చదివిన ఆయన స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఏ (రాజనీతిశాస్త్రం) సైతం పూర్తిచేశారు. నియోజకవర్గ సమస్యలకు తనదైన పరిష్కారాలతో ఆయనే ఓ మేనిఫెస్టో రూపొందించుకొన్నారు.

News April 26, 2024

తెనాలిలో కాంగ్రెస్ పార్టీకి షాక్  

image

గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ బషీద్‌కి బీఫామ్ ఇవ్వగా ఆయన నామినేషన్ వేశారు. అయితే అనూహ్యంగా నిన్న చివరి నిమిషంలో ఆయనను తప్పించి తెనాలి స్థానికుడైన డాక్టర్ చందు సాంబశివుడిని ప్రకటించింది. ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా నేడు అధికారులు వారి ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. 

News April 26, 2024

విజయనగరం: కాంగ్రెస్ అభ్యర్థి.. విమానం గుర్తు..! (REWIND)

image

చీపురుపల్లి నియోజకవర్గానికి 1985లో జరిగిన ఎన్నికల్లో వింత ఘటన జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీసాల నీలకంఠం నాయుడికి అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బీఫాం కొంత ఆలస్యంగా రావడంతో సకాలంలో నామినేషన్ వేయలేకపోయారు. ఆయనను EC స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి విమానం గుర్తుఇచ్చింది. దీంతో ఆయన విమానం, హస్తం గుర్తులను బ్యానర్‌పై వేయించి ప్రచారం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.