Andhra Pradesh

News April 26, 2024

కమలాపురం: విద్యుదాఘతంతో వ్యక్తి మృతి

image

విద్యుత్‌ షాక్‌‌తో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం పెద్ద చెప్పలిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పెద్దచెప్పలిలోని పంచర్ బంకుకు విద్యుత్ సరఫరా కావడంతో అన్వర్ భాష(36) షాక్‌ తగిలి స్పృహ కోల్పోయాడు. స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 26, 2024

MLA శివకుమార్, నాదెండ్ల మనోహర్ నామినేషన్లకు ఆమోదం

image

తెనాలిలో ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. ఇక్కడి బరిలో నిలిచిన వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు తుంపల నరేంద్ర, అశోక్ కుమార్,జి. రామకృష్ణ, తెలుగు జనతా పార్టీ అభ్యర్థి కె.నాగరాజు నామినేషన్ పత్రాలకు ఆమోదం లభించింది.

News April 26, 2024

కొడాలి నాని నామినేషన్‌పై వివాదం

image

గుడివాడ YCP అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం నెలకొంది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ROకి TDP నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆఫీస్‌ను కొడాలి నాని క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని కోరారు. మరోవైపు ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని అఫిడవిట్లో పేర్కొన్నారు.

News April 26, 2024

ఉమ్మడి కృష్ణా లయన్స్ క్లబ్ లీగల్ ఎయిడ్ ఛైర్మన్‌గా లంకిశెట్టి

image

అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్‌కు 2024-2025 సంవత్సరానికి గానూ లీగల్ ఎయిడ్ విభాగానికి ఎన్టీఆర్, కృష్ణాజిల్లా ఛైర్మన్‌గా మచిలీపట్నంకు చెందిన ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా గవర్నర్ శేషగిరిరావు ఉత్తర్వులు జారీ చేశారు. 18 సంవత్సరాలుగా బాలాజీ లయన్స్ క్లబ్‌లో అనేక పదవులు నిర్వహించి పలు సేవా అవార్డులు పొందారు.

News April 26, 2024

ఎల్.ఎన్.పేట: భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం శ్యామలాపురం పునరావాస కాలనీలో ఉంటున్న నెల్లి అమ్ములు (69) గురువారం రాత్రి మృతిచెందింది. శుక్రవారం ఉదయం ఈమె దహన సంస్కరాలకు కుటుంబ సభ్యులు సిద్ధం చేస్తున్నారు. అక్కడే రోదిస్తూ ఉన్న అమ్ములు భర్త ఏకాశి (77) ఆమెకు చివరి స్నానం చేయిస్తూ కుప్పకూలిపోయాడు. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది. 

News April 26, 2024

పెదపాడు: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

పెదపాడు మండలంలోని జయపురం గ్రామంలో భలే జగన్మోహనరావు (32) గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిది హత్యా.. లేక కరెంట్ షాక్ తో చనిపోయారా అనే కోణంలో విచారణ చేపట్టారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది.

News April 26, 2024

తొండంగి: ఉరేసుకుని ఇస్రో ఉద్యోగి ఆత్మహత్య

image

తొండంగి మండలం పైడి కొండకు చెందిన కోదండ గంగేశ్వర్ (31) ఉరి వేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో గంగేశ్వర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేస్తూ డిప్యూటేషన్‌పై సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఎస్పీబీలో విధులు నిర్వహిస్తున్నాడు. సూళ్లూరుపేట షార్ ఉద్యోగుల నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

News April 26, 2024

ఈనెల 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష

image

అనంతపురం జిల్లాలో శనివారం పాలిసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ జయచంద్ర రెడ్డి తెలిపారు. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాల్లో 8880 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

News April 26, 2024

శ్రీ సత్యసాయి: ఓపెన్‌ పది, ఇంటర్‌ ఫలితాల విడుదల

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఓపెన్‌ పది, ఇంటర్‌ ఫలితాలు గురువారం విడుదల చేసినట్లు జిల్లా పరీక్షల విభాగం ఏడీ లాజర్‌ తెలిపారు. ఓపెన్‌ ఇంటర్మీడియట్‌లో 1,525మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 888మంది పాసై 58.23% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసిన 703మంది విద్యార్థుల్లో 249 మంది పాసై 35.42% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వస్థానం సాధించారని తెలిపారు.

News April 26, 2024

ఎర్రగుంట్ల: పట్టాలు దాటుతుండగా వ్యక్తి మృతి

image

పెద్దముడియం మండలం చిన్నపసుపులకి చెందిన గొల్ల శ్రీనివాసులు భార్య తులసి పిల్లలతో కలిసి పుట్టినిల్లైన విజయనగరం వెళ్ళింది. వారికోసం వెళ్లిన శ్రీనివాసులు ఇంటికి వచ్చే క్రమంలో గురువారం అందరితో కలిసి నంద్యాలలో ధర్మవరం రైలు ఎక్కారు. జమ్మలమడుగులో దిగాల్సి ఉండగా మరిచిపోయి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో దిగారు. అక్కడి నుంచి బయటకు వెళ్లే క్రమంలో పట్టాలు దాటుతుండగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మృతి చెందాడు.