Andhra Pradesh

News March 7, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 385 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 385 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పి.దుర్గారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 19,149 మంది విద్యార్థులకు గాను 18,763 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. కాగా జిల్లాలోని పొందూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి మాథ్స్ 2A పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడినట్లు ఆయన తెలిపారు.

News March 7, 2025

ఫ్రీ బస్.. ప్రజల భిన్నాభిప్రాయాలు

image

ATP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఫ్రీ జర్నీ జిల్లా వరకే పరిమితం.. మీ కామెంట్’ అంటూ వే2న్యూస్ అనంతపురం జిల్లాలో వార్త <<15677166>>పబ్లిష్<<>> చేయగా ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పారు. 41శాతం మంది దీనిని స్వాగతించారు. మరికొందరు ఈ పథకం వద్దని, బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, కాలేజ్ పిల్లల వరకు పరిమితం చేయాలని కొందరు కామెంట్ చేశారు.

News March 7, 2025

కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థుల డీబార్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సర విద్యార్థులకు నేడు పార్ట్‌ 3లోని సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. చూచిరాతలకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 20,864 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 414 మంది గైర్హాజరు అయ్యారు. బి.క్యాంప్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కళాశాలలోనే డీబార్ అయినట్లు తెలిపారు.

News March 7, 2025

గుడివాడ: కొడాలి నాని అనుచరులకు షాక్

image

మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సన్నిహితులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీనుకు గుడివాడ పోలీసులు శుక్రవారం 41ఏ నోటీసులు ఇచ్చారు. వాలంటీర్ల బలవంతపు రాజీనామా, లిక్కర్ గోదాం కేసుల్లో వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో కొడాలి నాని, మాజీ బెవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జె.సి. మాధవీలతారెడ్డి సహా పలువురిపై కేసు నమోదైంది.

News March 7, 2025

వేంపల్లె: ఉపాధ్యాయుడిపై మహిళా టీచర్లు ఫిర్యాదు

image

వేంపల్లె పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా టీచర్లపై పీజీటీ ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డి తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ కాళ్లతో తన్నినట్లు మహిళా టీచర్లు సునీత, అంజలి పేర్కొంటున్నారు. దీనిపై శుక్రవారం వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో గుర్నాథ్ రెడ్డిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 7, 2025

విశాఖ: నేటి నుంచి ఇంటర్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం

image

నేటి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు రీజినల్ అధికారి మురళిదర్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ మహిళ కాలేజీలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సంస్కృతం పేపర్ మూల్యాంకనం చేయనున్నారు. వీటి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 20వరకు ఉండనున్నాయి.

News March 7, 2025

తూ.గో జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. తూ.గో జిల్లా వాసులు ఎక్కువగా ఉమ్మడి తూ.గో జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థల్లో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా తూ.గో జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

News March 7, 2025

ప.గో జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప.గో జిల్లా వాసులు ఎక్కువగా ఏలూరు, తూ.గో జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థలతో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా ప.గో జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

News March 7, 2025

YS జగన్‌తో విజయనగరం వైసీపీ నాయకుల భేటీ

image

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా నాయకులు గురువారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణ, ప్రజా ప్రతినిధుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై మాజీ సీఎం జగన్‌తో చర్చించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, నేతలు పాల్గొన్నారు.

News March 7, 2025

గోకవరం: కారు ఢీకొని వ్యక్తి మృతి

image

గోకవరం, కొత్తపల్లి గ్రామంలో పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం కారు – బైకు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ఉన్న జగ్గంపేట మండలం గోవిందపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఇదే ఘటనలో గాయపడిన మహిళను స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.