India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం యూనివర్సిటీ డీఎన్ విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా డిగ్రీ మొదటి, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కొద్ది రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 29వ తేదీ ఓటర్లతో తుది జాబితా విడుదల చేస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ నెల 29న చిహ్నాలను కేటాయిస్తామన్నారు. బాపట్ల జిల్లాలో మొత్తం 147 నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు.
నూతన కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని గురువారం పరిశీలించారు. కంట్రోల్ రూంలో మీడియా సర్టిఫికేషన్ మోనిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా, కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, సీ-విజిల్స్ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ పలు శాఖలను ఆయన పరిశీలించారు.
రాజంపేట ప్రజాగళం సభలో TDP అధినేత చంద్రబాబు రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చారు. ‘రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడం. అన్నమయ్య ప్రాజెక్ట్, పింఛా ప్రాజెక్టులు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయడం. మాచుపల్లి బ్రిడ్జీ, ఓబిలి-టంగుటూరు బ్రిడ్జీని పూర్తి చేయడం. జర్రికోట ప్రాజెక్ట్ నుంచి సుండుపల్లికి తాగునీరు, సాగునీరు ఇవ్వడం. గాలేరు, నగరి కాలువ పనులను పూర్తి చేయడం తమ బాధ్యత’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఎచ్చెర్లలోని చిలకపాలెం జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ మజ్జి అచ్చెప్పడు మృతి చెందాడు. పొందూరులోని లోలుగు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్గా పోలీసులు గుర్తించారు. ఆటోను వెనుక నుంచి వ్యాన్ ఢీకొనడంతో అదుపు తప్పి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి ఆయనను తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నామని నెల్లూరు కలెక్టర్ హరి నారాయణన్ వివరించారు. స్థానిక ఎన్నికల కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యయ పరిశీలకులు, సాధారణ పరిశీలకులతో కలెక్టర్, ఎస్పీ సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో 79శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 85 శాతానికి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహణలో భాగంగా పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్గా బూరె సర్వేశ్వరుడు నరేంద్ర నియమితులయ్యారు. ఈ సందర్భంగా పల్నాడు కలెక్టర్ శివశంకర్ లోతేటి అబ్జర్వర్ను కలిశారు. అనంతరం ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సార్వత్రిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా పరిశీలకులను భారత ఎన్నికల కమిషన్ నియమించిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు చేస్తున్న వ్యయానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే మండల పరిశీలకులకు నేరుగా కానీ ఫోన్లో గాని ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, సి-విజిల్ కేంద్రాన్ని పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే గురువారం
పరిశీలించారు. అక్కడి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా ఎన్నికల సంబంధిత ఫిర్యాదులకు తన మొబైల్ నంబర్ 9154141876, policeobservertpt23@gmail.com ద్వారా సంప్రదించాలని సూచించారు.
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏలూరు జిల్లాకు ఉంగుటూరు, గోపాలపురం నియోజకవర్గాలు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోకి వచ్చాయి. దీంతో ఆయా చోట్ల పోటీచేసే అభ్యర్థులు 2 జిల్లాల్లో ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
– గణపవరం మండలం వాస్తవానికి ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీకి చెందినదే అయినా జిల్లా మాత్రం ప.గో.
– ద్వారకాతిరుమల మండలం ప.గో. జిల్లా గోపాలపురం అసెంబ్లీకి చెందినదే అయినా జిల్లా మాత్రం ఏలూరు.
Sorry, no posts matched your criteria.