India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు విజయనగరం జిల్లాలో చంద్రబాబు, పవన్కల్యాణ్ పర్యటించనున్నారు. డెంకాడ మండలం సింగవరం వద్ద సా.4 గంటలకు ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో వారు పాల్గొంటారు. సభ జరిగే ముందు సింగవరం వద్ద రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం విజయనరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రజాగళం సభలో వారు ప్రసంగించనున్నారు. వీరి పర్యటన నిమిత్తం చందకపేట వద్ద రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గ BJP అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, భార్య సీతాసుజాత ఉమ్మడి ఆస్తులు రూ.106.22 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన పేరు మీద ఉన్న స్థిరాస్తులు రూ.91.69 కోట్లు, చరాస్తులు రూ.2.90 కోట్లు ఉన్నాయి. అప్పులు రూ.5.72 కోట్లు ఉన్నాయి. భార్య పేరుతో రూ.10.14 కోట్లు స్థిరాస్తులు, రూ.1.49 కోట్లు చరాస్తులు,అప్పులు రూ.1.67 కోట్లు ఉన్నాయి. వీరికి వాహనాలు లేవు. ఆయనపై ఒక పోలీస్ కేసు ఉంది.
పొన్నూరు YCP అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ మంగళవారం నామినేషన్ వేయలేకపోయారు. నిన్న ఉదయం ఆయన పెదకాకాని మండలం నంబూరు నుంచి వైసీపీ శ్రేణులతో ర్యాలీగా బయల్దేరారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో నామినేషన్ సమయం దాటిపోయింది. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 వరకే నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కానీ, ఆయన పొన్నూరు మున్సిపల్ కార్యాలయానికి కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో మురళీ బుధవారం నామినేషన్ వేయనున్నారు.
కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకి తరలించారు. చెన్నై నుంచి కొయ్యలగూడెంకు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణి, రాజీ, కుమార్లుగా గుర్తించారు.
జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత వారంలో కడపలోని ఓ బిల్డింగ్లోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా వెల్లడైంది. సోమవారం రాత్రి మరికొన్ని చోట్ల తిరిగారని పోలీసులు అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాత్రివేళల్లో పెట్రోలింగ్ కట్టుదిట్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, రాత్రిళ్లు ఎవరైనా బట్టలు లేకుండా వీధుల్లో కనపడితే 100కు ఫోన్ చేయాలని తెలిపారు.
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురువారం గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె నగరంలో రోడ్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. గురువారం మధ్యాహ్నం గుంటూరు చేరుకోనున్న ఆమె సాయంత్రం సంజీవయ్యనగర్, రాజీవ్ గాంధీనగర్, శారదాకాలనీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లాలో బుధవారం పలువురు అసెంబ్లీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వారిలో పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడాల గోపి, పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి, నూజివీడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొలుసు పార్థసారథి, నిడదవోలు కాంగ్రెస్ పెద్దిరెడ్డి సుబ్బారావు నామినేషన్ వేయనున్నారు.
విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనులు కారణంగా విశాఖ నుంచి, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ ను మే 27 వరకు, కాకినాడ-విశాఖ-కాకినాడ ఎక్స్ ప్రెస్ మే 26 వరకు రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.
విజయవాడ రైల్వే స్టేషన్లో ఎకానమీ మీల్స్ రూ.20, స్నాక్స్ మీల్స్ రూ.50కే అందిస్తున్నారు. వేసవి రైలు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని IRCTCతో కలిసి తక్కువ ధరకే భోజనం పథకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా జనరల్ బోగీల ప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిని ప్రయోగాత్మకంగా విజయవాడతో పాటు రాజమహేంద్రవరంలో ప్రారంభించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DRM నరేంద్ర పాటిల్ కోరారు.
కాటసాని రాంభూపాల్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.75.19 కోట్లుగా నామినేషన్ అఫిడవిట్లో ఎన్నికల అధికారులకు సమర్పించారు. కుటుంబం మెుత్తం చరాస్తుల విలువ రూ.26.95 కోట్లు, స్థిరాస్తులు విలువ రూ.48.24 కోట్లు.. అప్పులు రూ.3.01కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. భూమి ఎకరాల్లో కాటసాని పేరుతో 10.87, ఆయన సతీమణికి 164.33, కుమారుడు, కుమార్తెల పేరిట 70.40 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాటసానిపై ఒక్క కేసు ఉంది.
Sorry, no posts matched your criteria.