India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సచివాలయ ఉద్యోగి డాక్ యార్డ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూర్మన్నపాలెం సచివాలయం-1 మహిళా పోలీస్గా పనిచేస్తున్న మీను స్కూటీపై తన కుమార్తెతో నగరానికి వెళ్లి తిరిగి వస్తుండగా మారుతి సర్కిల్ సమీపంలో లారీని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప్రజలు గన్నవరం, పెనమలూరు నుంచి ఎక్కువగా విజయవాడకు వస్తుంటారు. విజయవాడలో కాలేజీలు కూడా ఉండటంతో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విజయవాడ వెళ్లాలంటే టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
చొదిమెళ్ల <<15665845>>ప్రమాదం <<>>పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. జగ్గంపేట(M) కాట్రావులపల్లికి చెందిన దుర్గాభవాని(23) సాప్ట్వేర్ ఇంజినీర్గా HYDలో పనిచేస్తోంది. తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ మధ్యలోనే కన్నుమూసింది. ఉదయానికే వచ్చేస్తానంటూ ఫోన్ చేసి చెప్పిన భీమేశ్వరరావు(భీమడోలు), కాకినాడ జిల్లాలో బంధువుల పెళ్లికి బయల్దేరిన భవాని(28) చనిపోయారు. సగం దూరం బస్ నడిపి రెస్ట్ తీసుకున్న మధుసూదన్(కాకినాడ) చనిపోయాడు.
అనంతపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ కాయల సంత ప్రారంభమైంది. గురువారం టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.24,500 పలికాయి. మార్కెట్కు నిన్న 520 టన్నుల చీనీ కాయలు వచ్చాయి.
☞ ఇక కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా రూ.8 పలికింది. కనిష్ఠంగా రూ.5 ప్రకారం విక్రయాలు సాగాయి. నిన్న మార్కెట్కు 270 టన్నుల సరకు వచ్చింది.
చొదిమెళ్ల <<15665845>>ప్రమాదం <<>>పలు కుటుంబాల్లో విషాదం నింపింది. జగ్గంపేట(M) కాట్రావులపల్లికి చెందిన దుర్గాభవాని(23) సాప్ట్వేర్ ఇంజినీర్గా HYDలో పనిచేస్తోంది. తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ కన్నుమూసింది. ఉదయానికే వచ్చేస్తానంటూ ఫోన్ చేసి చెప్పిన భీమేశ్వరరావు(భీమడోలు), కాకినాడ జిల్లాలో బంధువుల పెళ్లికి బయల్దేరిన భవాని(28) చనిపోయారు. సగం దూరం బస్ నడిపి రెస్ట్ తీసుకున్న మధుసూదన్(కాకినాడ)చనిపోయాడు.
ఈనెల 8వ తేదీన రెండో శనివారం సెలవు లేదని జిల్లా విద్యాశాఖ అధికారిణి వరలక్ష్మి తెలిపారు. 2024-25 సంవత్సరానికి మొత్తం పని దినాలు 220 రోజుల కన్నా తక్కువగా ఉండడంతో రెండో శనివారం పని దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ యథావిధిగా పాఠశాలకు హాజరుకావాలని సూచించారు.
మల్కాపురం ప్రకాశ్నగర్కు చెందిన ఆర్యన్ కుమార్ గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. హెచ్పీసీఎల్లో సూపర్వైజర్గా పని చేస్తున్న ఆర్యన్ కుమార్ ఇంటికి వెళ్తున్న సమయంలో అతివేగంగా స్కూటీపై వెళుతూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామభద్రపురం మండలం తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్ద గురువారం రెండు బైక్లు ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ప్రసాద్ వర్మ(42) మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన రామగోపాల్, ప్రసాద్ వర్మ ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై బొబ్బిలి రైల్వేస్టేషన్కు వెళ్తుండగా వారికి ముందు వెళ్లుతున్న బైక్ స్లో కావడంతో రెండు బైకులు ఢీకొన్నాయి. వెనుక కూర్చున్న ప్రసాద్ వర్మ మృతి చెందినట్లు SI ప్రసాద్ తెలిపారు.
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై పెట్రోల్తో దాడి జరిగింది. దూదేకుల నాగూర్ వలిపై ఓ వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. మెరుగైన చికిత్స కోసం మార్కాపురం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్కి రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనిల్ తల్లి ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్కి ఈ నెల 10 వరకు బెయిల్ దక్కింది. 11వ తేదీన తిరిగి అనిల్ జైలుకు వస్తారని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.