India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤ నియోజకవర్గం: చిలకలూరిపేట
➤ అభ్యర్థి: ప్రత్తిపాటి పుల్లారావు(TDP)
➤ భార్య: వెంకాయమ్మ
➤ విద్యార్హతలు: B.COM
➤ చరాస్తి విలువ: రూ.32.33కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.23.37కోట్లు
➤ కేసులు: 13
➤ అప్పులు: రూ.22.72కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1,55,011
➤ బంగారం: 409.8గ్రాములు, భార్యకు 323.5గ్రాముల బంగారం
➤ NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నియోజవర్గ ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు.
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని ఉత్తర నియోజకవర్గంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 6 గంటలకు ఢిల్లీ తిరుగు ప్రయాణమవుతారు.
ఎన్నికల విధుల్లో దురుసుగా ప్రవర్తించిన SI కి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. మంగళవారం ఎస్సై నాగశివారెడ్డిని పర్చూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద విధులకు వేశారు. ఈ సమయంలో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు పై దురుసుగా ప్రవర్తించడంతో, సాంబశివరావు తనకు ఫిర్యాదు చేశారని దీనిపై వివరణ అడిగి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.
ధర్మవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో సినీనటుడు, బీజేపీ నాయకుడు సాయికుమార్ పాల్గొన్నారు. నేడు సత్యకుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్ శివాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూటమి పార్టీల కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం బుధవారం శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు,16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ మంగళవారం తెలిపారు. ఆమదాలవలస,బూర్జ,గంగువారి సిగడాం, పొందూరు, సరుబుజ్జిలి, నర్సన్నపేట, జలుమూరు, టెక్కలి, కోటబోమ్మాళి, సారవకోట, పాతపట్నం, హిరమండలం, ఎల్ ఎన్ పేట మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయన్నారు.
➤ నియోజకవర్గం: నెల్లూరు ఎంపీ
➤ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR)
➤ VSR ఆస్తి: రూ.66.73 కోట్లు
➤ భార్య ఆస్తి: రూ.13.99 కోట్లు
➤ అప్పులు: రూ.10.34 లక్షలు,
➤ భార్య అప్పులు రూ.22.84 లక్షలు
➤ వాహనాలు: ఒకే కారు
➤ బంగారం: 1456 గ్రాములు
➤ డైమండ్లు: 345.07 క్యారెట్లు
NOTE: తనపై సీబీఐతో పాటు మొత్తం 21 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు.
➤ నియోజకవర్గం: ఉండి
➤ అభ్యర్థి: వేటుకూరి శివరామరాజు (ఇండిపెండెంట్)
➤ చరాస్తులు: రూ.81,58,379
➤ స్థిరాస్తులు: రూ.4,36,07,949
➤ అప్పులు: లేవు
➤ భార్య చరాస్తులు: రూ.50,57,238
➤ భార్య స్థిరాస్తులు: రూ.80,00,000
➤ ఇద్దరి చేతిలో ఉన్న డబ్బులు: రూ.54,000
➤ 4 క్రిమినల్ కేసులు (పెండింగ్)
NOTE: ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఇవి.
టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలు కిటికీలు తెరిచి దోపిడీ చేస్తే వైసీపీ హయాంలో ఏకంగా తలుపులే తెరిచారని వైఎస్ షర్మిల అన్నారు. కర్లపాలెంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా చెప్పుకోవడానికి రాజధాని ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ కలిసి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి ప్రజల చేతిలో చిప్ప పెట్టారన్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిసలుగా తయారయ్యారన్నారు.
వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 27 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం విశాఖ నుంచి ఈ రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఈనెల 28 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖకు నడుపుతున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.