India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్టీల్ ప్లాంట్కు గంగవరం అదానీ పోర్టు నుంచి బొగ్గు రవాణా నిలిచిపోవడంపై ఉక్కు అధికారుల సంఘం హైకోర్టులో కేసు వేసింది. గంగవరం పోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్కు చెందిన కోకింగ్ కోల్, లైన్ స్టోన్ సుమారు మూడు లక్షల టన్నులు ఉందన్నారు. ఈనెల 12 నుంచి పోర్ట్ కార్మికుల ఆందోళన వల్ల వాటి రవాణా నిలిచిపోయిందన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సంఘం ప్రతినిధి ప్రసాద్ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13 ఓటు హక్కు వినియోగించుకునేందుకు తూ.గో జిల్లాలోని వివిధ ప్రైవేటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాలు, హోటళ్లలో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు కార్మికశాఖ సహాయ కమిషనర్ బి.ఎస్.ఎం. వల్లి తెలిపారు. ఓటుహక్కు ఉన్న కార్మికులందరికీ పోలింగ్ రోజున సెలవు మంజూరు చేయాలని ఆయా సంస్థల యాజమాన్యాన్ని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైన బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, దీని పరిష్కారానికి వాటాదారులందరూ సహకరించాలని ప్లాంట్ సిఎండి అతుల్ భట్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 12 నుంచి అదానీ గంగవరం పోర్ట్ నుంచి రవాణా నిలిచిపోవడం వల్ల స్టీల్ ప్లాంట్ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ఉత్పత్తి ప్రక్రియకు అవసరమైన కోకింగ్ కోల్ సున్నపురాయి అందకపోవడంతో ప్లాంట్ ఇబ్బందుల్లో పడిందన్నారు.
ఎన్నికలకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం మొత్తం 23 నామినేషన్లు దాఖలు అయినట్లు కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానానికి ముగ్గురు, రాప్తాడు అసెంబ్లీ స్థానానికి ముగ్గురు, మడకశిర నుంచి నలుగురు, హిందూపురం నుంచి ఐదు, పెనుకొండ నుంచి ఒకటి, పుట్టపర్తి నుంచి ముగ్గురు, ధర్మవరం నుంచి ఒకరు, కదిరి నుంచి ఐదుగురు నామినేషన్లు వేశారన్నారు.
ఈనెల 25వ తేదీ ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు నామినేషన్ వేస్తారని కార్యాలయం సిబ్బంది తెలిపారు. టీడీపీ నుంచి టిక్కెట్ ఇవ్వకపోవడంతో భంగపడ్డ శివరామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా శివ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఎన్నికల అధికారులు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 26వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఫారం-12 దరఖాస్తుకు ఎన్నికల గుర్తింపు కార్డు ఎన్నికల విధుల నియామక పత్రం జతచేసి నోడల్ అధికారి ద్వారా వారు పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సూచించారు.
☞ అభ్యర్థి: వంగా గీత (వైసీపీ)
☞ విద్యార్హతలు: బి.ఎ, బి.ఎల్, ఎం.ఎల్
☞ కేసులు: ఏమీ లేవు
☞ చరాస్తులు: రూ.2.10 కోట్లు, భర్త పేరు మీద రూ.27.81 లక్షలు
☞స్థిరాస్తులు: రూ.13.11 కోట్లు, భర్త పేరు మీద రూ.13.64 కోట్లు
☞ అప్పులు: రూ.4.51 కోట్లు, భర్త పేరు మీద రూ.51.64 లక్షలు
➤ నియోజకవర్గం: బొబ్బిలి
➤ అభ్యర్థి: బేబినాయన
➤ పార్టీ: టీడీపీ
➤ విద్యార్హత: డిగ్రీ
➤ చరాస్తులు: రూ.3,19,53,154
➤ స్థిరాస్తులు: రూ.1,00,51,100
➤ భార్య పేరిట చరాస్తులు: రూ.71,99,116
➤ భార్య పేరిట స్థిరాస్తులు: రూ.33,77,500
➤ అప్పులు: రూ.5.70కోట్లు(బ్యాంకుల్లో)
➤ కేసులు: 1
నందికొట్కూరు ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ బాష కూతురు షేక్ రోషిని టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించింది. పరిక్షల ఫలితాల్లో 600కు గాను 596 మార్కులు సాధించి తన ప్రతిభ కనబరిచింది. తన కుతూరు ఈ మార్కులు సాధించడం గర్వకారణమని కుటుంబ సభ్యుడు రఫీ అహ్మద్ ప్రకటనలో తెలిపారు.
మాడుగుల అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తన చేతిలో రూ.50 వేల నగదు, బ్యాంకు డిపాజిట్లు రూ.7.69 లక్షలు, భూముల విలువ రూ.21.17 కోట్లు, భార్య పేరున రూ.5.81 కోట్ల ఆస్తులు, కారు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2023లో సీఎం జగన్ను దూషించినందుకు, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పినగాడిలో అధికారులను అడ్డుకున్నందుకు, 2009లో సబ్బవరం పీఎస్లో మరో కేసు ఉన్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.