India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న మెగా DSC పరీక్షకు ఉచితంగా ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా BC వెల్ఫేర్ అధికారిణి వెంకటలక్ష్మమ్మ గురువారం ఓ ప్రకనటలో తెలిపారు. టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు, బీసీ, ఈబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసువాలని తెలిపారు. ఇతర వివరాలకు బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.
కర్నూలు జిల్లాలోని బీసీ, కమ్మ, ఈబీసీ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బలిజ కులాల మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్ తెలిపారు. శిక్షణ అనంతరం కుట్టు మిషన్లను అందజేస్తామని చెప్పారు. ఆయా కులాలకు చెందిన 18-50ఏళ్ల మహిళలు తమ పరిధిలోని సచివాలయాల ద్వారా apobmms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99081 32030 నంబరుకు సంప్రదించాలన్నారు.
మందస పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బీ.గవరయ్య(62) అనే వ్యక్తి గురువారం మృతిచెందారు. ఆయన భార్య బుధవారం ఇతర ప్రాంతానికి వెళ్లగా, గురువారం ఇంటికి వచ్చి చూసేసరికి భర్త ఇంట్లో మృతిచెందారు. అయితే కానిస్టేబుల్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని సీఐ తిరుపతిరావు, ఎస్ఐ కృష్ణప్రసాద్ పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తోట్లవల్లూరులో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులకు వివరాల మేరకు.. మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లెంవారిపాలెం వద్ద కృష్ణానది ఒడ్డున ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. మృతుడి ఎడమ చేతి మీద డిజైన్, బ్రూస్లీ అని, కుడి చేతి మీద నాయక్, ప్రేమ కావాలి, కాజల్, అమ్మానాన్న, గంగా అని చాతిపైన పోలమ్మ, కాజల్, బసవమ్మ అని పచ్చబొట్టులు ఉన్నాయి.VRO ఫిర్యాదతో SI కేసు నమోదు చేశారు.
శింగనమల నియోజకవర్గం జంతులూరు గ్రామంలోని సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ప్రభుత్వం తరఫున అరకు కాఫీ స్టాల్ ఎమ్మెల్యే బండారు శ్రావణి మంత్రి సంధ్యారాణిని కోరారు. సచివాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే నియోజకవర్గంలోని ఎస్టీలకు సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం మంత్రి గొట్టిపాటిని కలిసి నియోజకవర్గంలో విద్యుత్ లైన్ మ్యాన్ల కొరత లేకుండా చేయాలని కోరారు.
నకిలీ రైల్వే ఉద్యోగితో ఇబ్బందులు పడ్డ బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా సోంబాబును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డీఆర్ఎం ఆఫీస్లో ఏసీ, టీవీలు తక్కువ ధరకు ఇప్పిస్తానని అక్కయ్యపాలెం ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, ఎలమంచిలి, దువ్వాడ ప్రాంతాల్లో కొందరిని మోసం చేశాడు. లోకో పైలట్ ఎంప్లాయ్ అని నకిలీ ఐడీ చూపించేవాడు. టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
రాజంపేట వద్ద 2022 FEB 6న కారును నిలిపి అందులోని వారిపై సీతానగరం(M) మునికూడలి వాసులు కర్రలతో దాడి చేశారు. ఈ మేరకు తీగిరెడ్డి ప్రసాద్, దాసరి జానకిరామ్కు గురువారం శిక్ష పడింది. రాజమండ్రి సెవెంత్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 5,500 జరిమానా, 3 నెలలు జైలు శిక్ష విధించారని సీతానగరం ఎస్సై రామ్ కుమార్ తెలిపారు. కోర్టులో హాజరు పరిచిన కానిస్టేబుల్ షరీఫ్ను సీఐ సత్య కిశోర్ అభినందించారు.
తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేబ్రోలు నుంచి ఎల్.అగ్రహారం మోటార్ సైకిల్పై వస్తున్న తిరుపతి వెంకటరమణ (66) ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుని భార్య తిరుపతి వెంకట సూర్య కుమారి ఫిర్యాదు మేరకు ఏఎస్సై దుర్గారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రాజమండ్రిలో నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 30 మందికి కోర్టు శిక్ష విధించిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం రాజమండ్రి కోర్టులో వీరిని హాజరుపరచగా జడ్జి సి.రమ్య ఆధ్వర్యంలో 29 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.2.90లక్షలు జరిమానా, ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష విధించింది.
32 ఏళ్ల క్రితం ఇదే రోజున పల్నాడులో 23 మందిని చంపేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. 1993 మార్చి 7న HYD-CH.పేట వస్తున్న బస్సులో నరసరావుపేట రైల్వే క్రాసింగ్ వద్ద చలపతిరావు, విజయవర్ధన్రావు అనే ఇద్దరు ఎక్కారు. ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించగా బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.