Andhra Pradesh

News April 22, 2024

భవనంపై నుంచి పడి శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

image

భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దిల్లేశ్వర్ రహ్మత్ నగర్‌లో ఉంటూ కూలీ పని చేసేవాడు. ఆదివారం సంజయ్ నగర్ బస్తీలోని నాల్గో అంతస్తులో పని చేస్తుండగా పైనుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

News April 22, 2024

సత్యసాయి జిల్లాలో 2012మంది వాలంటీర్ల రాజీనామా

image

వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లాలో 2012 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. జిల్లాలో మొత్తం 9187మంది వాలంటీర్లు ఉండగా ఇప్పటివరకు 2012 మంది రాజీనామా చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. వారిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 69మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో మెుత్తం 2072 మంది అయ్యారు.

News April 22, 2024

నంద్యాల: వివాహ వేడుకలో కారం చల్లి పెళ్లికూతురి ఆపహరణ

image

పెళ్లికూతురిని ఆహరణకు యత్నించిన ఘటన తూగో జిల్లా కడియం(M)లో జరిగింది. కడియం సీఐ వివరాలు..చాగలమర్రి(M) గొడిగనూరుకు చెందిన స్నేహ, కడియంకు చెందిన బత్తిన వెంకటనందు నరసరావుపేటలో ఓ కాలేజీలో చదివారు. ఈ క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెంకటనందు తన ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించారు. ఆదివారం మరోసారి పెళ్లి చేస్తుండగా పెళ్లికుతూరు తరుఫువాళ్లు వచ్చి వారిపై కారం చల్లి స్నేహ అపహరణకు యత్నించారు.

News April 22, 2024

నెల్లూరు: భారీగా మద్యం స్వాధీనం

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సైదాపురం పరిధిలో 22, వేదాయపాళెంలో 14, ఉదయగిరి, వింజమూరులో 12 చొప్పున, దుత్తలూరులో 7, చేజర్లలో 10, కలువాయి, టీపీ గూడూరులో 15 చొప్పున, కండలేరులో 20, ఏఎస్ పేటలో 6 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. 420 బాటిళ్లను ఎస్ఈబీ అధికారులు సీజ్ చేశారు.

News April 22, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

➤ బెల్లాన చంద్రశేఖర్(వైసీపీ): విజయనగరం ఎంపీ
➤ బేబినాయన(టీడీపీ): బొబ్బిలి ఎమ్మెల్యే
➤ కొత్తపల్లి గీత(బీజేపీ): అరకు ఎంపీ
➤ తోయక జగదీశ్వరి(టీడీపీ): కురుపాం ఎమ్మెల్యే
➤ కూర్మి నాయుడు(కాంగ్రెస్): గజపతినగరం ఎమ్మెల్యే
➤ గీతారాణి(భారత్ ఆదివాసీ పార్టీ): కురుపాం ఎమ్మెల్యే
➤➤ వీరితో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

News April 22, 2024

ఉమ్మడి విశాఖలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

➤ ఎం.శ్రీభరత్(టీడీపీ): విశాఖ ఎంపీ
➤ వంగలపూడి అనిత(టీడీపీ), కంబాల జోగులు(వైసీపీ): పాయకరావుపేట ఎమ్మెల్యే
➤ బండారు సత్యనారయణ(టీడీపీ): మాడుగుల ఎమ్మెల్యే
➤ బూడి ముత్యాలనాయుడు: అనకాపల్లి ఎంపీ
➤ గిడ్డి ఈశ్వరి(టీడీపీ): పాడేరు ఎమ్మెల్యే
➤ కొత్తపల్లి గీత(బీజేపీ): అరకు ఎంపీ
➤ రేగం మత్స్యలింగం(వైసీపీ): అరకు ఎమ్మెల్యే
➤➤ వీరితో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

News April 22, 2024

తూ.గో: నేడు నామినేషన్లు వేసేది వీరే

image

☞ రాజమండ్రి ఎంపీ అభ్యర్థులు రుద్రరాజు(కాంగ్రెస్), గూడూరి శ్రీనివాస్ (YCP)
☞ వేగుళ్ల జోగేశ్వరరావు (మండపేట-TDP)
☞ విశ్వరూప్ (అమలాపురం-YCP)
☞ సూర్యారావు (రాజోలు-YCP)
☞ చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట-YCP)
☞ ద్వారంపూడి (కాకినాడ సిటీ- YCP)
☞ ధనలక్ష్మి (రంపచోడవరం- YCP)
☞ చినరాజప్ప (పెద్దాపురం- TDP)
☞ విప్పర్తి వేణుగోపాలరావు (పి.గన్నవరం-YCP)
☞ కన్నబాబు (కాకినాడ రూరల్-YCP)
☞ వంగా గీత (పిఠాపురం-YCP)

News April 22, 2024

శ్రీకాకుళం: నేడు నామినేషన్లు వేసేది వీరే..!

image

శ్రీకాకుళం జిల్లాలో నేడు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పలాస నుంచి మంత్రి సీదిరి అప్పలరాజు, పాతపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డిశాంతితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో నామినేషన్ చేయనున్నారు. వీరితో పాటు తమ్మినేని సీతారాం ఆమదాలవలసలో నామినేషన్ వేయనున్నారు.

News April 22, 2024

అనిల్ కుమార్ యాదవ్ ఆస్తుల వివరాలు

image

➤ పార్లమెంట్: నరసరావుపేట
➤ అభ్యర్థి: పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ (YCP)
➤ భార్య: జాగృతి
➤ విద్యార్హతలు: B.D.S
➤ చరాస్తి విలువ: రూ.2.43 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.2.10కోట్లు
➤ కేసులు: 1
➤ అప్పులు: రూ.1.59కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.2 లక్షలు
➤ బంగారం: 12 గ్రాములు, డైమండ్ రింగ్ భార్యకు 900 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థి పేర్కొన్న వివరాలు ఇవి.

News April 22, 2024

కృష్ణా జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

కృష్ణా జిల్లాలో నేడు వైసీపీ, టీడీపీ బలపరిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరిలో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ రావు నేటి ఉదయం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే విధంగా పెడన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.