India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓబులదేవరచెరువు మండలం వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు కుమారుడు ద్వారకనాథ్ (4) గురువారం నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. తాత, నానమ్మ పనిలో ఉండగా బాలుడు ఇంటి వెనకాల ఆడుకుంటూ పశువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. వెంటనే గుర్తించిన స్థానికులు బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం కదిరి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.
ఆక్రమణలు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో 2019 అక్టోబర్ 15లోగా గృహాలు నిర్మించిన వారు చట్టబద్ధమైన హక్కులు కల్పించుటకు గాను, ప్రభుత్వం (జీవో ఎం ఎస్ నెంబర్30/2025) విడుదల చేసిందని పేర్కొన్నారు. గ్రామ వార్డులు ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో భర్త వెంకటరామిరెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య విద్య మనోహరమ్మ బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యపై అనుమానం పెంచుకొని, తాగిన మైకంలో వెంకట్రామిరెడ్డి రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోహరమ్మను బనగానపల్లెకు తరలించగా మృతి చెందినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.
రుషికొండ బీచ్ వద్ద గల సముద్రంలో మత్స్యకారుల వలలకు అరుదైన చేపలు చిక్కాయి. చేపల వేట కోసం మత్స్యకారులు గురువారం సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో మత్స్యకారుల వలలోకి రెండు రకాల అరుదైన చేపలు చిక్కాయి. వాటిని తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టినట్లు వారు తెలిపారు. ఒక్కోసారి సముద్ర పాములు వలకు చిక్కుతుంటాయని వారు పేర్కొన్నారు.
ఆకివీడు శివారు దుంపగడప గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఏలూరు జిల్లా కొట్టాడ ప్రాంతానికి చెందిన మద్దా మరియదాస్ (20) యువకుడు ఇంటికి వెళ్తుండగా ఆకివీడు వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. మరియదాసు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు.
చెన్నైలో చదువుకుంటున్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. న్యాయవాది గుడుగుంట వేణుగోపాల్ కుమారుడు శ్రేయాశ్తో పాటు ప్రముఖ ట్రాన్స్పోర్టర్ అధినేత కుమారుడు ధనిశ్ రెడ్డి చెన్నైలో కారులో వెళ్తూ లారీని ఢీకొన్నారు. దీంతో స్నేహితులిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో నెల్లూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
మార్చిలోగా నామినేటెడ్ పదవుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రధానంగా ఎస్.కోట నుంచి గొంప కృష్ణ, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. జనసేన, బీజేపీలో కూడా ఆశావహులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కానీ విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు ప్రమాదంలో ఓకేసారి ఇద్దరు కుమారులను బలి తీసుకుంది. పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న మంజునాథ, లక్ష్మి దంపతుల దీనగాధ ఇది.
కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొరస్వామి నాయుడు మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. గురువారం బెంగళూరులో దొరస్వామి నాయుడు మరణం పట్ల ఎంపీ ఢిల్లీలో ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుప్పంలో పీఈఎస్ మెడికల్ కళాశాల స్థాపించడం ద్వారా ఎంతో సేవ చేశారని కొనియాడారు.
ఉరవకొండ గవిమఠం శ్రీ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి నెమలి వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని నెమలి వాహనంపై ఉంచి చిన్న రథంపై ఎదురు బసవన్న గుడి వరకు ఊరేగించారు. అనంతరం యథాస్థానానికి చేర్చారు. అంతకుముందు చంద్రమౌళీశ్వరస్వామి వారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.