India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడుపుతోందని వాల్తేర్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తెలిపారు. దేశ వ్యాప్తంగా 9,111 ట్రిప్పులను నడుపుతుండగా, గతేడాది కంటే 2,742 ట్రిప్పులు అధికమన్నారు. వాల్తేర్ డివిజన్లో 52 వేసవి ప్రత్యేక సర్వీసులు తిరుగుతున్నాయని, మరో 12 జతలు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు.
బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన బాలిక(16)ను లూనా సెంటర్ ప్రాంతానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. శనివారం కూడా కళ్యాణ్ బాలికను వేధింపులకు గురి చేయడంతో బాలిక తల్లిదండ్రులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు తెలియజేయవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్ కుమార్ తెలిపారు. సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణ కోసం 08554-232922, 6300907233, పోలింగ్ సిబ్బంది పర్యవేక్షణ కోసం 08554 – 231922, 6300923894 నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు.
అనకాపల్లిలో శనివారం ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి తండ్రి నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి శారదా నగర్ ముత్రాసి కాలనీలో నివాసం ఉంటున్న APRJC లెక్చరర్ ఉమాదేవి(32), శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విజయనగరం జిల్లాలో లెక్చరర్గా ఈమె పనిచేస్తున్నారు. 2021లో వివాహమైన ఉమాదేవికి భర్తతో గొడవలు ఉన్నాయని ఆయన తెలిపారు.
అనకాపల్లిలో శనివారం ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి తండ్రి నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి శారదా నగర్ ముత్రాసి కాలనీలో నివాసం ఉంటున్న APRJC లెక్చరర్ ఉమాదేవి(32), శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విజయనగరం జిల్లాలో లెక్చరర్గా ఈమె పనిచేస్తున్నారు. 2021లో వివాహమైన ఉమాదేవికి భర్తతో గొడవలు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఉరవకొండ-గుంతకల్లు ప్రధాన రహదారిలోని గూళ్యపాళ్యం శివారులో శనివారం ట్రాక్టరు నుంచి కిందపడి కొనకొండ్లకు చెందిన విశ్వాసరావు(19) మృతి చెందాడు. అతడు శుక్రవారం తరిమెల గ్రామంలో మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. శనివారం గ్రామానికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ నుంచి జారి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై నరేశ్ తెలిపారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఏప్రిల్ 22వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వు, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీలతో కలపి ఫారం-12ను అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ యువజన పార్టీ తరఫున పోటీ చేయనున్న MLA అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ శనివారం ప్రకటించారు. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పిప్పేటి వడ్డీకాసులు, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమ గోపాల్, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కె.నిరీక్షణ రావును బరిలో దింపుతున్నట్లు పేర్కొన్నారు.
అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ దాదాపు ఖరారైంది. కానీ.. పోటీ చేసే పార్టీ మారనున్నట్లు సమాచారం. అనపర్తి సీటు BJPకి వెళ్లగా.. అప్పటికే TDP టికెట్ పొందిన నల్లమిల్లి నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో BJP నుంచే నల్లమిల్లిని బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జెండా ఏదైనా ఎజెండా గెలవాలని చంద్రబాబు సైతం ఆయనకు నచ్చజెప్పినట్లు సమాచారం. నల్లిమిల్లి నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
YCP బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, పుత్తూరు మాజీ MPP ఏలుమలై అలియాస్ అమ్ములు TDPలో చేరారు. ఆయనతో పాటు DCCB మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి, బిల్డర్ వెంకటమునికి నగరి MLA అభ్యర్థి గాలి భానుప్రకాశ్ సమక్షంలో చంద్రబాబు పసుపు కండువా కప్పారు. నగరి నియోజకవర్గంలో మొదలియార్ సామాజికవర్గ ఓటర్లు 32 వేల మంది ఉన్నారు. అదే సామాజికవర్గానికి చెందిన ఏలుమలై YCPని వీడటం ఆ పార్టీకి నష్టమేనని పలువురు భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.