India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్యే భర్తను చంపిన ఘటన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో వెలుగు చూసింది. కోటవూరు(P) చవటకుంటపల్లెకు చెందిన వెంకటరమణ(58) మొదటి భార్యతో విడిపోయాడు. రెండో భార్య రెడ్డెమ్మ, కుమారుడితో ఉంటున్నారు. మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ గొంతుకు భార్య చీర బిగించి చంపేసింది. దీనికి కుమారుడు సహకరించినట్లు సమాచారం. CI సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కవిటి మండలం వరకకు చెందిన బెంతు ఒరియా సంఘం అధ్యక్షుడు శ్యాంసుందర్ పురియా తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మాజీ MLA, వైసీపీ నేత పిరియా సాయిరాజ్, వైసీపీ కవిటి మండల అధ్యక్షుడు కడియాల ప్రకాశ్ శ్యాంసుందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పాడె మోసి అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్యాంసుందర్ మృతితో వైసీపీ కీలక నేతను కోల్పోయిందని సాయిరాజ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశించారు.
ప్రజల మధ్య నిలబడటం అంటే పైరసీలు చేసి రాజ్యసభ సభ్యుడైనంత ఈజీ కాదని, విజయవాడ పశ్చిమ NDA కూటమి అభ్యర్థి సుజనా చౌదరిని ఉద్దేశించి వైసీపీ నేత పోతిన మహేశ్ ట్వీట్ చేశారు. బ్యాంకుల నుంచి కొట్టేసిన రూ. వేల కోట్లలో ఎంతో కొంత సుజనా నుంచి తీసుకోవచ్చని.. NDA కూటమి నాయకులు ఆయన చుట్టూ చేరారని పోతిన వ్యాఖ్యానించారు. మాటలు తప్ప మూటలు లేవని కూటమి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారని పోతిన ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఏలూరు జిల్లా సమన్వయాధికారి భారతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పెదవేగి, చింతలపూడి, ఆరుగొలను, నరసాపురం, న్యూ ఆరుగొలను గురుకుల పాఠశాలల్లో చేరేందుకు పెదవేగిలోని గురుకుల పాఠశాలకు ఈ నెల 22న ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు.
ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనుంది. కాకినాడ జిల్లా తునిలో పర్యటన ముగించుకుని రాత్రి తొమ్మిది గంటలకు జాతీయ రహదారి మీదుగా జిల్లాకి చేరుకుంటారు. ఆయన జాతీయ రహదారి మీదుగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
భార్యే భర్తను చంపిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో వెలుగు చూసింది. కోటవూరు(P) చవటకుంటపల్లెకు చెందిన వెంకటరమణ(58) మొదటి భార్యతో విడిపోయాడు. రెండో భార్య రెడ్డెమ్మ, కుమారుడితో ఉంటున్నారు. మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ గొంతుకు భార్య చీర బిగించి చంపేసింది. దీనికి కుమారుడు సహకరించినట్లు సమాచారం. CI సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధి ఎటపాక మండలం కన్నాయిగూడెం ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం చూసుకుని వస్తుండగా, కన్నయ్య గూడెం ఊరి శివారులో ఇద్దరు దారి కాచి బండరాయితో మోది హత్య చేశారు. హత్యానంతరం ఇద్దరు నిందితులు ఎటపాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చాగలమర్రి మండలం గొడిగనూరు గ్రామానికి చెందిన ఓ విత్తనాల వ్యాపారి రైతులకు కుచ్చుటోపి పెట్టినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మినుములు, మొక్కజొన్న తదితర విత్తనాలను, రూ.2.34 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు వాపోతున్నారు. రైతులకు ఐపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ కన్నయ్య గూడెంలో ఎంపీటీసీ సభ్యుడు వర్ష బాలకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం చూసుకుని వస్తుండగా, కన్నయ్య గూడెం ఊరి శివారులో ఇద్దరు దారి కాచి బండరాయితో మోది హత్య చేశారు. హత్యానంతరం ఇద్దరు నిందితులు ఎటపాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ నిబంధనల ప్రకారం పోలీసులు అప్రమత్తమయ్యారు. తుపాకీ లైసెన్స్లు కలిగిని వారందరూ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకూ తమ ఆయుధాలను అందజేయాలంటూ పోలీసులు వారికి లేఖలు రాశారు. ఈమేరకు సంబంధిత వ్యక్తులు తుపాకులను పోలీసులకు అప్పగించారు. జిల్లాలో ఎస్బీఎల్, డీబీబీఎల్, ఫిస్టల్, రైఫిల్స్ మొత్తం 445 ఉన్నాయి. 68 మినహా మిగతా అన్ని పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది.
Sorry, no posts matched your criteria.