Andhra Pradesh

News March 6, 2025

SKLM: పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

image

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం (పి-4) సర్వేకు కార్యాచరణ రూపొందించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రారంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

News March 6, 2025

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్-2025 అమలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌లో అమలు చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మాలకొండయ్య పాల్గొన్నారు.

News March 6, 2025

విశాఖ: ఫోన్ కోసం కుమార్తెతో గొడవ.. తండ్రి సూసైడ్

image

విశాఖలో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఆరిలోవ ఎస్‌ఐ వై.కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవ దుర్గా బజారుకు చెందిన బి.మణికంఠకు పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఫోన్ విషయంలో తండ్రి, కూతురి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠ ఫిబ్రవరి 24న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.

News March 6, 2025

గూడూరు వద్ద ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ బొల్లా మోహన్ రావు దుర్మరణం చెందారు. వాహనంలో ఉన్న ప్యాసింజర్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News March 6, 2025

ఒంగోలు: 30 మండలాలకు అధ్యక్షుల ప్రకటన

image

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని 30 మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు షేక్. సైదా ప్రకటించారు. ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేయాలని అన్నారు. షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడానికి సమష్టిగా కృషి చేస్తామని అన్నారు.

News March 6, 2025

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 సర్వే: కలెక్టర్

image

పేద‌రిక నిర్మూలనే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌బ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్ పార్ట‌న‌ర్‌షిప్ (P4) స‌ర్వేకు రూప‌క‌ల్ప‌న చేసిందని, ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు జిల్లాలో నిర్వహించే ఈ సర్వేను విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో MPDOలు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.

News March 6, 2025

సహకార సంఘాలను బలోపేతం చేస్తాం: కలెక్టర్

image

జిల్లాలోని వ్యవసాయ, పాడి, మత్స్య సహకార సంఘాలను పటిష్టపరిచి, సభ్యులకు మరింత మెరుగైన సేవలందించాల్సిందిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సహకార రంగం ద్వారా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప వివరించారు.  

News March 6, 2025

చాపాడు: భార్యను గొడ్డలితో నరికిన భర్త

image

చాపాడు మండలం నక్కలదిన్నె సమీపంలో గురువారం మధ్యాహ్నం భార్య‌ను భర్త యెర్రిబోయిన భాస్కర్ గొడ్డలితో నరికాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో భర్త ఈ ఘాతకానికి పాల్పడినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ట్రైనీ డీఎస్పీ భవానీ, ఎస్సై చిన్న పెద్దయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 6, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలలో 815 మంది గైర్హాజర్

image

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలలో భాగంగా
గురువారం పరీక్షకు 815 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. జనరల్‌లో 21156 మంది, ఒకేషనల్‌లో 1342 మంది పరీక్షల్లో హాజరు కావలసి ఉందని వివరించారు. మొత్తంగా 22498 మందికి గాను 21683 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 6, 2025

ఆళ్లగడ్డలో ఉచితంగా ‘ఛావా’ చిత్రం ప్రదర్శన

image

ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్‌లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.