Andhra Pradesh

News April 18, 2024

నామినేషన్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: అనంత ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల వద్ద పటిష్ఠ బందోబస్తు చేపట్టాలని పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్ సూచించారు. బుధవారం శింగనమల మండల కేంద్రంలోని నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల నియమ నిబంధనలు అమలు చేసి నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ల వద్ద నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు.

News April 18, 2024

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

image

సారా, మద్యం అక్రమ రవాణా కేసుల్లో పెండింగ్‌ కేసుల పురోగతిపై అధికారులతో ఎస్పీ రాధిక బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ అరెస్టులు, కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసం కేసుల దర్యాప్తు వేగవంతం చేసి త్వరితగతిన నిందితులకు శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రేమ్ కాజల్ ఉన్నారు.

News April 18, 2024

ఏలూరు: నామినేషన్ స్వీకరణకు సర్వం సిద్ధం

image

సార్వత్రిక ఎన్నికల లో భాగంగా ఏలూరు జిల్లాలో ఈనెల 18వ తేదీ నుండి నామినేషన్ స్వీకరణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు కార్యాలయ పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారన్నారు.

News April 18, 2024

సత్యసాయి జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం వ్యయ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురం పార్లమెంటు నియోజవర్గానికి అమిత కుమార్, మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాలకు వినాయక్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు రిదయం బహుదజలు జిల్లాకు వచ్చారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

News April 18, 2024

19న ఆలూరుకు రానున్న చంద్రబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 19న టీడీపీ అధినేత చంద్రబాబు ఆలూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసేందుకు బుధవారం ఆలూరులో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అదే రోజు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆలూరులో పర్యటించునున్నారు.

News April 18, 2024

జిల్లాలో 377 ధాన్యం కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్ 

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు 377 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. సాధారణ రకం క్వింటాలుకు రూ.2,183, గ్రేడ్-ఏ రకం రూ.2,203 మద్దతు ధర ఇస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యలను, ఫిర్యాదులను 1800 425 2532 నంబర్ కు కాల్ చేసి చెప్పాలన్నారు. 

News April 18, 2024

నేటి నుంచే నామినేషన్: కడప కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు ప్రకటించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాలని, ఎంపీ అభ్యర్థి కడప కలెక్టర్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ వేయవచ్చన్నారు. ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.

News April 18, 2024

గుంటూరులో భారీగా నగదు, మద్యం సీజ్ 

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం జిల్లాలో ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ పరిధిలో సరైన పత్రాలు చూపని రూ రూ.80వేల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 17వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,19,14,430లక్షల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. 

News April 17, 2024

అక్రమ రవాణ కట్టడికి పటిష్ఠ చర్యలు: ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో భాగంగా తగిన రశీదులు లేకుండా మనుబోలు పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 120 ఫ్యాన్లు, 24 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏఎస్ పేట పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3500 నగదు, 255 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 17, 2024

స్థానిక సంస్థలను జగన్ నిర్వీర్యం చేశారు: ఎంపీ

image

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకపాత్ర పోషించే స్థానిక సంస్థలను సీఎం జగన్ నిరంకుశ వైఖరితో నిర్వీర్యం చేసారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ విమర్శించారు. సర్పంచుల పవర్ ఏంటో జగన్ కు రానున్న ఎన్నికల్లో తెలిసివస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బుధవారం ప్రజాగళం-బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.