Andhra Pradesh

News April 17, 2024

ఏలూరు: యువతిపై అత్యాచారం.. పదేళ్ల జైలు

image

ఏలూరు జిల్లా పెదపాడు పోలీసు స్టేషన్‌ పరిధిలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు సాక శివకు పదేళ్ల జైలు శిక్ష, రు.2500/- జరిమానా విధించినట్లు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.రామాంజనేయులు తెలిపారు. 2021 ఆగస్టులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, సాక్షులను విచారించిన కోర్టు ఈ రోజు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిందని పేర్కొన్నారు.

News April 17, 2024

కడప: ఎన్నికల బరిలో రాజకీయ కురువృద్ధులు

image

కడప జిల్లా ఎన్నికల బరిలో రెండు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరదరాజులరెడ్డి TDP తరఫున పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో 5 సార్లు MLAగా గెలిచారు. అటు మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి 4 సార్లు MLAగా గెలిచారు. మరోసారి YCP నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిద్దరూ స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. రాష్ట్రంలో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు వీరే కావడం విశేషం.

News April 17, 2024

ప్రకాశం: మాజీ కానిస్టేబుల్‌కు సివిల్స్‌లో 780వ ర్యాంక్

image

జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకి చెందిన మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్స్ పరీక్షలో జాతీయ స్థాయిలో 780 ర్యాంక్ సాధించారు. ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో ఒంగోలులో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఐఏఎస్ అవ్వాలన్నా దృఢ సంకల్పంతో చదివి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా పలువురు ఉదయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News April 17, 2024

కర్నూలు : ఎవరెవరు ఎక్కడ నామినేషన్ వేస్తారో తెలుసా?

image

జిల్లాలో 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. రేపటి నుంచి నామినేషన్లు వేసుకోవచ్చు.
కర్నూలు- కర్నూలు నగర పాలక సంస్థ
పాణ్యం- కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబరు
పత్తికొండ- పత్తికొండ ఆర్డీవో ఆఫీస్
కోడుమూరు – కర్నూలు ఆర్డీవో ఆఫీస్
ఎమ్మిగనూరు- ఎమ్మిగనూరు తహశీల్దార్ ఆఫీస్
మంత్రాలయం- మంత్రాలయం తహశీల్దార్ ఆఫీస్
ఆదోని- ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్
ఆలూరు- ఆలూరు తహశీల్దార్ ఆఫీస్ లో నామినేషన్ వేయవచ్చు.

News April 17, 2024

యల్లనూరు: మహిళా టీచర్ సస్పెండ్

image

యల్లనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులురాలిగా విధులు నిర్వహిస్తున్న విజయకుమారిని సస్పెండ్ చేసినట్లు ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలు వాట్సాప్ గ్రూపులలో నిబంధనలకు విరుద్ధంగా పంపడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

News April 17, 2024

తూ.గో.: సీతారాముల కళ్యాణానికి 24 ఏళ్లుగా..

image

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవాలకు మండపేటకు చెందిన కేవీఏ.రామారెడ్డి 24 ఏళ్లుగా అలంకరించిన బోండాలను అందిస్తున్నారు. అక్కడ పరిణయోత్సవం ముగిసిన తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, జి.మామిడాడ, సత్యవాడ, రామతీర్థంలో నిర్వహించే వేడుకలకు ఇస్తారని తెలిపారు.

News April 17, 2024

మదనపల్లి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

image

మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  పెద్దపంజాణి మండలం ముత్తుకూరుకు చెందిన మొగిలప్ప(67), సారా కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు మొగిలప్పను తీసుకొచ్చి మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో ఉంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మొగిలప్ప బుధవారం ఉదయం తను ఉంటున్న బ్యారక్ లోనే కుప్పకూలిపోవడం గుర్తించిన జైలర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు

News April 17, 2024

సివిల్స్‌లో సిక్కోలు కుర్రోడు సత్తా

image

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్ సివిల్స్‌లో సత్తా చాటాడు. NITలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కోచింగ్ తీసుకుని 467 ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. వెంకటేష్ తండ్రి చంద్రరావు, తల్లి రోహిణి వ్యవసాయం చేస్తూ.. గ్రామంలోనే చిరు వ్యాపారం చేస్తున్నారు. రెండో కుమారుడు వంశీ శ్రీహరికోటలో శాస్త్రవేత్తగా చేస్తున్నాడు.

News April 17, 2024

నెల్లూరు: శ్రీరాముడు నడియాడిన ప్రాంతం ఇక్కడే..

image

రామతీర్థం గ్రామం సముద్రతీరాన ఉంది. స్థల పురాణం ప్రకారం.. సీతాన్వేషణకు వెళుతున్నశ్రీరాముడు ఒకరోజు ఈ ప్రాంతానికి వచ్చి సూర్యోదయసమయంలో శివుణి ప్రతిష్ఠించి అర్చన చేశాడు. రాములవారి పాదస్పర్శ ఏర్పడిన ఈక్షేత్రం “రామతీర్థం” గానూ, శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం గనుక శ్రీ రామలింగేశ్వరస్వామి గానూ పూజలందుకుంటున్నాడు. 14వ శతాబ్దంలో పల్లవరాజులు స్వామివారికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రికఆధారాలు ఉన్నాయి.

News April 17, 2024

ప.గో.: నేడు CM జగన్ బస్సు యాత్రకు BREAK

image

మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు నేడు విరామం ఇచ్చారు. తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేసిన ఆయన బుధవారం రాత్రి కూడా సైతం ఇక్కడే బస చేయనున్నారు. రోజంతా శిబిరంలో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తిరిగి గురువారం ఉదయం యాత్ర ప్రారంభం కానుంది. శిబిరం నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్నారు.