Andhra Pradesh

News March 6, 2025

రాజమండ్రి : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

కాతేరు గామన్‌ బ్రిడ్జిపై రోడ్డు దాటుతుండగా బుధవారం మోటర్‌సైకిల్‌ ఢీ ఢీకొనడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందిందని త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై వి.అప్పలరాజు తెలిపారు. కాతేరు వీఆర్‌వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్‌ మార్చురీలో ఉంచామన్నారు. ఆమె ఆచూకీ  తెలిసిన వారు త్రీటౌన్‌ సీఐ 94407 96532, ఎస్ఐ 9490345517కి  సమాచారమివ్వాలన్నారు.

News March 6, 2025

వజ్రపుకొత్తూరు: రిటైర్ట్ తెలుగు టీచర్ మృతి

image

వజ్రపుకొత్తూరు పూండి గోవిందపురానికి చెందిన రిటైర్డ్ తెలుగు టీచర్, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ తెలికిచెర్ల ప్రసాదరావు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పూండి పరిసర ప్రాంతాలలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. 

News March 6, 2025

నగర, పురపాలక సంస్థలకు నిధుల విడుదల

image

కర్నూలు నగర, 9 పురపాలక సంస్థలకు 2023-24కు గానూ 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.41.19 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కర్నూలుకు రూ.15.81 కోట్లు, గూడూరుకు రూ.1.08 కోట్లు, ఆదోనికి రూ.5.47 కోట్లు, ఎమ్మిగనూరుకు రూ.3.08 కోట్లు, నంద్యాలకు రూ.7.15 కోట్లు, ఆళ్లగడ్డకు రూ..82 కోట్లు, డోన్‌కు రూ.1.92 కోట్లు, నందికొట్కూరుకు రూ.1.63 కోట్లు, ఆత్మకూరుకు రూ.1.76 కోట్లు, బేతంచెర్లకు రూ.1.43 కోట్లు ఇచ్చింది.

News March 6, 2025

రాజమండ్రి: చిర్రా వూరి శ్రీరామ శర్మ కన్నుమూత

image

మహామహోపాధ్యాయ, శ్రీ రామాయణ తత్త్వజ్ఞ డాక్టర్‌ చిర్రా వూరి శ్రీ రామ శర్మ కర్నాటక రాష్ట్రం శృంగేరి మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. 1948లో రాజమహేంద్రవరంలో జన్మించిన చిర్రావూరి సీతంపేటలోని గౌతమీ విద్యాపీఠంలో విద్యార్థులకు సంస్కృత, ఆంధ్రాలు బోధించేవారు. తెలుగు సంస్కృత భాషలలో అష్టావధానాలు, షోడశ అవధానాలు నిర్వహించారు. కంచి, శృంగేరి, దత్త పీఠం ఆధ్వర్యంలో సత్కారాలు అందుకున్నారు.

News March 6, 2025

అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం: మంత్రి నారాయణ

image

అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. బుధవారం మంత్రి జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రూ.64 వేల కోట్లతో 5000 ఎకరాలలో రాజధాని నిర్మిస్తామని, ఇప్పటికే రూ.50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ పాల్గొన్నారు.

News March 6, 2025

VZM: మందు బాబులకు భారీగా ఫైన్

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. విజయనగరం పట్టణ ట్రాఫిక్ సీఐ సూరినాయుడు నగరంలో బుధవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 18 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున 18 మందికి రూ.1.80 లక్షల జరిమానా విధించారని SP వకుల్ జిందాల్ తెలిపారు. ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.

News March 6, 2025

సిద్ధాంతం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

సిద్ధాంతం అయ్యప్ప స్వామి గుడి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధాంతం చెరువుపేటకు చెందిన పమ్మి చినబాబు (30)మృతి చెందాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈతకోట రొయ్యల ఫ్యాక్టరీలో డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్ పై ఇంటికి తిరిగి వెళ్తూండగా బస్సును తప్పిస్తూ, ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టాడంతో తలకు బలమైన గాయం అవ్వగా ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News March 6, 2025

జిల్లాని ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్ డా.వినోద్ కుమార్

image

పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారీగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ పథకం అమలులో జిల్లాని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

News March 6, 2025

రాజమండ్రి: రెవెన్యూ విభాగ సిబ్బందితో కమిషనర్ సమావేశం

image

రాజమండ్రి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నేడు రెవెన్యూ విభాగ సిబ్బందితో కమిషనర్ కేతన్ గర్గ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. 2024-2025 సంవత్సరానికి గాను నగర ప్రజలు ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి ఛార్జీల బకాయిలను వచ్చే వారంలోపు 100% వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News March 6, 2025

వెలుగొండకు చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు ఈనెల 8న ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అంతకు ముందే మార్కాపురంలో మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో CM పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం 12:30 నుంచి <<15657223>>1:30 వరకు నాయకులతో<<>> సమావేశమౌతారు. ఆ తర్వాత మధ్యహ్నం 2 గంటలకు దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4:30 వరకు ప్రాజెక్ట్‌ను పరిశీలించి తిరుగుపయనమౌతారు.