Andhra Pradesh

News April 13, 2024

ఉరవకొండ మండలంలో రోడ్డు ప్రమాదం

image

ఉరవకొండ మండలం పెన్నహోబిలం సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన బొలెరో వాహనం నిలిపి మధ్యలో రాళ్లు పెట్టడంతో ఉరవకొండ నుంచి మదనపల్లికి బైక్‌పై వెళ్తున్న గిరీష్ బాబు, ఆంజనేయులు వాటిని ఎక్కించి కిందపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోలెరో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

News April 13, 2024

విశాఖ: 24 వరకు సప్లిమెంటరీ దరఖాస్తులకు అవకాశం

image

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని విశాఖ జిల్లా అధికారులు తెలిపారు. అలాగే రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 18 నుంచి 24 వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయన్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

News April 13, 2024

తిరుపతిలో సర్దుకున్న కూటమి నాయకులు

image

తిరుపతి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించినప్పటి నుంచి నెలకొన్న వివాదం ముగిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నాయకులకు భరోసా ఇచ్చారు. దీంతో వారు అలకతీరి శనివారం నుంచి ప్రచారం చేయనున్నారు. సుగుణమ్మ, కిరణ్ రాయల్ తో వ్యక్తిగతంగా మాట్లాడిన పవన్ వారికి భరోసా కల్పించారు. బీజేపీ నాయకులు సమావేశం కాకుండా వెళ్లి పోయారు.

News April 13, 2024

కృష్ణా: 18 నుంచి సప్లిమెంటరీ దరఖాస్తులు

image

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి 24వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అధికారులు తెలిపారు. అలాగే రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 18 నుంచి 24వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయన్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

News April 13, 2024

తిరుపతి: రేపటి నుంచి 3 రోజులపాటు షర్మిల పర్యటన

image

వైయస్ షర్మిల మూడు రోజులు పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తిలో, సాయంత్రం 4 గంటలకు సత్యవేడులోని గాంధీ విగ్రహం సమీపంలో, రాత్రి 7.30కు పుత్తూరులో నాయకులతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం 10.30 కార్వేటినగరంలో రోడ్డుషో, సమావేశం, 11.30 జీడీనెల్లూరులో, సాయంత్రం 5 గంటలకు పలమనేరు, రాత్రి 7.30 గంటలకు పూతలపట్టులో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. 16న అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తారు.

News April 13, 2024

గుంటూరు: 24 వరకు సప్లిమెంటరీ దరఖాస్తులు

image

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గుంటూరు జిల్లా అధికారులు తెలిపారు. అలాగే రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 18 నుంచి 24 వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయన్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

News April 13, 2024

24 వరకు సప్లిమెంటరీ దరఖాస్తులు: NSVL నరసింహం

image

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారి NSVL నరసింహం తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు ఉందన్నారు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం కూడా ఈనెల 18 నుంచి 24 వరకూ సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయన్నారు. SHARE IT..

News April 13, 2024

24 వరకు సప్లిమెంటరీ దరఖాస్తులు: ప్రభాకర్

image

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏలూరు జిల్లా వృత్తి విద్యాధికారి బి.ప్రభాకర్‌ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు ఉందన్నారు. అలాగే రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఈనెల 18 నుంచి 24 వరకూ సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయన్నారు. SHARE IT..

News April 13, 2024

శ్రీకాకుళం :ఈనెల 15వ తేదీ నుంచి చేపల వేటపై నిషేధం

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఈ రెండు నెలల సమయం చేపలు సంతానోత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు.

News April 13, 2024

కర్నూలు: ఇంటర్‌లో సత్తా చాటిన రైతు బిడ్డ అనురాధ

image

కృష్ణగిరి మండలం యాగంటి పల్లెకు చెందిన ఎరుకల శంకర్ రైతు. మొదటి కూతురు అనురాధ గతేడాది వెల్దుర్తి బాలికల హాస్టల్‌లో ఉంటూ పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం పాణ్యం మండలం నెరవాడలో గల మహాత్మ గాంధి జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో ఇంటర్‌లో చేరింది. ఫస్టియర్ బైపీసీలో 425/440 మార్కులు సాధించి మండలంలోనే మొదటి స్థానాన్ని సాధించి ప్రతిభను చాటుకుంది.