India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కార్యకలాపాలను విశాఖలో విస్తరించనుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విశాఖలో గ్రోసరీ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 77 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న జీ.ఎఫ్.సీ ద్వారా స్థానికులు వెయ్యి మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది.
దత్తిరాజేరు మండలం మరడాం గ్రామ సమీపంలోని మామాడి తోటలో బుధవారం మధ్యాహ్నం ఓ వృద్ధులు మృతి చెందాడు. వంగర గ్రామానికి చెందిన చుక్క రామన్న గత కొంతకాలంగా మతిస్తిమితం లేకుండా తిరుగుతున్నాడని స్టేషన్ బూర్జివలస ఎస్.ఐ లక్ష్మీప్రసన్న కుమార్ తెలిపారు. వడదెబ్బకు మృతి చెంది ఉండొచ్చని, మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం తరలించినట్లు వెల్లడించారు.
విశాఖ రైల్వే స్టేషన్ లో 3,4 ప్లాట్ ఫామ్స్ మధ్య కుంగిన ఫూట్ ఓవర్ వంతెన నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. యుద్దప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 3, 4ప్లాట్ ఫామ్స్ ను ట్రైన్స్ రాకపోకలకు సిద్ధం చేసినట్లు తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా ప్రస్తుతానికి ప్రయాణికులను ఈ వంతెనపై ప్రయాణికులను అనుమతించడం లేదని తెలిపారు.
జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైవే పోలీసులు
వివరాల ప్రకారం.. రామవరం గ్రామానికి చెందిన ఎద్దుమాటి దేవి తన భర్త వీరబాబు(32)తో కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం ముగించుకొని గ్రామంలో హైవే దాటుతుండగా గుర్తు తెలియని బైక్ ఢీ కొనడంతో మృతి చెందినట్లు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేసిన ఘటన మంగళవారం రాత్రి బెంగళూరు జాలహళ్లిలో పరిధిలో జరిగింది. నెల్లూరుజిల్లా ఉదయగిరి ప్రాంతానికి చెందిన గంగాదేవి తన ఇద్దరు పిల్లలు లక్ష్మీ (9), గౌతమ్(7)తో కలిసి బెంగళూరులో ఉంటోంది. నిద్ర పోతున్న బిడ్డల ముఖాలపై దిండు వేసి అదిమిపెట్టి హత్య చేసింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి.. తప్పు ఒప్పుకుంది. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంటర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత నెల 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 22,239, ద్వితీయ సంవత్సరం 25,173 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నెల18న ప్రారంభమైన మూల్యాంకనం అదేనెల 31వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈనెల 4వ తేదీతో ఈ కార్యక్రమం ముగిసింది.
అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారైనట్లు జిల్లా టీడీపీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ తెలిపారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు పాయకరావుపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు చోడవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
రాయదుర్గం మండలంలోని కొంతనపల్లికి చెందిన గొర్రెల కాపరి బోయ వన్నూరప్ప(65) వడదెబ్బతో మృతి చెందాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్నూరప్ప ఎప్పటిలాగే మంగళవారం కూడా తనకున్న సుమారు 50 గొర్రెలను మేపుకోసం కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మంగళవారం సాయంత్రం వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా అక్కడి నుంచే నేరుగా గుండ్లపల్లికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రాత్రి పరిస్థితి విషమించి మృతిచెందాడు.
దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో ఈనెల 11 నుంచి 28 వరకు రోలింగ్ స్టాక్ కారిడార్ కార్యక్రమం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 11 నుంచి 28 వరకు రాజమండ్రి నుంచి బయలుదేరే రాజమండ్రి-విశాఖ పాసింజర్ ట్రైన్ ను రద్దు చేసినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో 11 నుంచి 28 వరకు విశాఖ నుంచి రాజమండ్రి బయలుదేరి పాసింజర్ రైలును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
వైఎస్ షర్మిల ముఖ్య అనుచరుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు కొండా రాఘవరెడ్డి నేడు కడపకు రానున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి షర్మిల చేసిన అన్యాయంపై కడపలో ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ పేరిట వైఎస్ షర్మిల చేసిన మోసం అక్రమాలపై ఈరోజు నుంచి ఆయన రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు తెలుపనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.