Andhra Pradesh

News July 5, 2025

బాలినేనికి ఇక అంతా బాగేనా?

image

బాలినేనిని జిల్లా రాజకీయాలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేనిపేరు. అటువంటి బాలినేనికి ఇకపై అంతా మంచే జరగబోతోందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మార్కాపురానికి డిప్యూటీ CM పవన్ వచ్చిన సందర్భంగా బాలినేని ప్రత్యక్షమయ్యారు. మళ్లీ వైసీపీలోకి బాలినేని అంటూ పుకార్లు వినిపిస్తుండగా, ఇక్కడ కనిపించడంతో ఓ క్లారిటీ వచ్చింది. పవన్ ప్రసంగంలో బాలినేని మంచి నేత అని చెప్పడంతో, ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టాక్ నడుస్తోంది.

News July 5, 2025

శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

శ్రీకాకుళం రోడ్ పలాస మీదుగా SMVT బెంగుళూరు(SMVB)- నారంగి(NNGE) మధ్య నడుస్తున్న 2 ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు నడిచేలా పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06559 SMVB- NNGE రైలు జులై 8, 15 తేదీలలో, నం.06560 NNGE- SMVB మధ్య నడిచే రైలు జులై 12, 19 తేదీలలో ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News July 5, 2025

విశాఖలో ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు సస్పెండ్: సీపీ

image

విశాఖలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సస్పెండ్ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. కంచరపాలెం స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్స్ సన్నీబాబు, ఎస్.రామకృష్ణ, హోంగార్డు గురునాయుడు విధి నిర్వహణలో ఉండగా లారీలు ఆపి అక్రమ వసూలు చేసినట్లు కమిషనర్ దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు చేసి ముగ్గురిని సస్పెండ్ చేశారు. పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే వాట్సాప్‌లో తనను సంప్రదించాలన్నారు.

News July 5, 2025

బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగ సందడి

image

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందడి ముందుగానే ప్రారంభమైంది. శుక్రవారం స్వర్ణాల చెరువు వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. జులై 6 నుంచి 10 తేదీ వరకు ఐదు రోజులపాటు రొట్టెల పండుగ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు.

News July 5, 2025

20 బైకులను ప్రారంభించిన నెల్లూరు SP

image

జిల్లాలో రాత్రిళ్లు నిఘాను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. ఇందులో భాంగంగా 20 బైకులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. పగలు, రాత్రిళ్లు గస్తీకి వీటిని వాడనున్నట్లు స్పష్టం చేశారు. నెల్లూరు ట్రాఫిక్, నెల్లూరు టౌన్, రూరల్, ఆత్మకూరు, కావలి, కందుకూరు సబ్ డివిజన్‌లకు వాటిని కేటాయించినట్లు తెలిపారు.

News July 5, 2025

చెరువులలో ఆక్రమణలు తొలగించండి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు చెరువుల స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, గుడిసెలు వంటి తాత్కాలిక ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఇన్‌ఛార్జి కలెక్టర్ డా.బి.నవ్య ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటి వనరుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

News July 5, 2025

గూగూడు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

image

నార్పల మండలం గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం డీఎస్పీ వెంకటేశ్ శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, అగ్నిగుండం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు, అవసరమైన చోట పోలీసు సిబ్బందిని కేటాయించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచామని చెప్పారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు.

News July 5, 2025

విశాఖ: ‘జులై 10న దుకాణాలకు బహిరంగ వేలం’

image

GVMC జోన్-4 పరిధిలో దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ సైడ్ మార్కెట్లకు జులై 10న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు శుక్రవారం తెలిపారు. జోన్ పరిధిలోని డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము, జగదాంబ వాణిజ్య సముదాయం, పాత బస్ స్టాండ్ దుకాణాములు, పలు వార్డుల్లో వ్యాపార సముదాయాలను వేలం వేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు జీవీఎంసీ జోన్-4 జోనల్ ఆఫీసు వద్ద జులై 10న ఉ.11గంటలకు హాజరుకావాలన్నారు.

News July 5, 2025

విజయనగరం జిల్లాలో నేడు జాతీయ లోక్ అదాలత్

image

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జ్ బబిత సూచించారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 20 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిస్కారం చేసుకోవచ్చన్నారు.

News July 5, 2025

చిత్తూరు: బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

image

పోలీసు శాఖలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎస్పీ మణికంఠ శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ ఆనంద్ బాబు సతీమణి మాధవి, గుడిపల్లి స్టేషన్‌లో మృతి చెందిన లక్ష్మీ భర్త ఆనంద్‌కు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు.