India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అప్పుల బాధ తాళ లేక చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉగాది పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు. 2టౌన్ పోలీసుల కథనం… మదనపల్లె, నీరుగట్టువారిపల్లి, మాయబజార్లో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు జి.మల్లికార్జున(42) భార్య మాధవి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లకు అప్పు చేసి పెళ్లిళ్లు చేశాడు. దీంతో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
పి.గన్నవరానికి చెందిన షేక్ కాజా 45 అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని ఎస్సై శివకృష్ణ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. చికెన్ షాప్లో పనిచేసే కాజా గత నెల 31 నుంచి షాపు మూతపడటంతో తరచూ మద్యం తాగుతున్నాడన్నారు. ఈ నెల 4న కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లారని, పి.గన్నవరంలో ఒక భవనంలో వీరు అద్దెకుంటున్నారని చెప్పారు. సోమవారం దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా కాజా మృతదేహం కుళ్ళిపోయి ఉందన్నారు.
కూలి పనులకి ఆటోలో వెళుతుండగా ప్రమాదవశాత్తు మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చీరాల వేటపాలెం బైపాస్ రోడ్డులో జరిగింది. చేనేతపురికి కాలనీకి చెందిన మస్తానీ కొందరు కూలీలతో కలిసి వ్యవసాయ పనులకు ఆటోలో బయలు దేరారు. ఆటోలో వెనుక వైపు కూర్చున్న ఆమెకు ఎద్దుల బండిలో తరలిస్తున్న రేకులు ప్రమాదవశాత్తు కడుపులో దిగాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది.
చిత్తూరు నగరం మండే ఎండలతో వేడెక్కింది. సోమవారం ఉదయం 11 గంటలు దాటగానే చాలా రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి. సోమవారం అత్యధికంగా తవణంపల్లెలో 42.3, నిండ్రలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాల వారీగా.. నగరిలో 41.6, విజయపురంలో 41.6, శ్రీరంగరాజపురంలో 41.4, పుంగనూరులో 40.4, సోమలలో 40.1, బంగారుపాళ్యంలో 39.9, పాలసముద్రంలో 39.9, కార్వేటినగరంలో 39.8, గుడిపాలలో 39.7, సదుంలో 39.7 నమోదయింది.
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సోమవారం రాత్రి ఆత్మకూరు పట్టణంలో పర్యటించారు. అనంతరం పట్టణంలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దుస్తులను ఇస్త్రీ చేశారు. స్థానికులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పామిడి మండలం పాళ్యం తండాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక అనే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పామిడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా రంపచోడవరం సీపీఎం అభ్యర్థిగా లోతా రామారావుకు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, రంపచోడవరం నుంచి వైసీపీ బరిలో నాగులపల్లి ధనలక్ష్మీ ఉండగా.. కూటమి అభ్యర్థిగా మిర్యాల శిరీషా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు విధులకు సుమారు 740 మంది పోలీసులను నియమించినట్లు ఎస్పీ రఘువీరా రెడ్డి తెలిపారు. వీరిలో డీఎస్పీలు 9 మంది, సీఐలు 30, ఎస్సైలు 62, ఏఎస్సైలు 186, కానిస్టేబుళ్లు 247, మహిళా కానిస్టేబుళ్లు 44, హోమ్ గార్డులు 171 మందిని విధులకు నియమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపేలా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని.. నెల్లూరు రూరల్ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే వారిని చంద్రబాబు కొనసాగిస్తారని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందమూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కోటంరెడ్డి మాట్లాడారు.
దెందులూరు మండల పరిధిలోని కొవ్వలి గ్రామంలో 30 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నామని, అలాంటి మాపై చంద్రబాబు కక్ష సాధింపునకు దిగడం బాధాకరమన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా తమపై నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని, దానిని సహించలేక రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.